Srikakulam

News May 31, 2024

శ్రీకాకుళం: పాలిటెక్నిక్ వెబ్‌ ఆప్షన్‌ నమోదు ఇలా..

image

శ్రీకాకుళం జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు బ్రాంచ్‌, కళాశాల ఎంపిక కోసం తమ ఆప్షన్లను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఈ నెల 31 నుంచి జూన్‌ 1 వరకు.. 1- 50,000 వరకు, జూన్‌ 2, 3 తేదీల్లో 50,001- 90,000 వరకు, 4, 5 తేదీల్లో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.

News May 31, 2024

ఫలితాల కోసం వర్సిటీ విద్యార్థుల ఎదురుచూపు

image

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలో బీఎస్సీ, బీఏ తదితర డిగ్రీ కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. 2024 జనవరిలో ఆరో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు జరిగినట్లు విద్యార్థులు శుక్రవారం తెలిపారు. సుమారు 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల కాలేదని, పీజీలో చేరేందుకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

News May 31, 2024

మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్: రాజాం CI 

image

నిబంధనలు పాటించకుంటే ‘భరత్ అనే నేను’ మూవీలో ఫైన్స్ ఎంత కఠినంగా ఉన్నాయో మనం చూశాం. ఇకపై మన శ్రీకాకుళంలోనూ అదే జరగనుంది. జూన్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నట్లు రాజాం CI మోహన్ రావు తెలిపారు. ఓవర్ స్పీడ్‌తో పట్టుబడితే రూ.1000-రూ.2000, లైసెన్స్ లేకుండా డ్రైవింగ్-రూ.500, మైనర్లు వాహనం నడిపితే రూ.25వేల ఫైన్‌తో పాటు మైనర్‌కు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందే ఛాన్స్ ఉండదన్నారు.

News May 31, 2024

స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 2KM మేర రెడ్ జోన్: ఎస్పీ

image

ఎచ్చెర్లలోని శ్రీశివాని ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 2కి.మీ పరిధి వరకు రెడ్ జోన్ అమలు చేస్తున్నట్లు SP రాధిక ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 8 అసెంబ్లీ, శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పారు. రెడ్ జోన్‌ అమలు చేస్తున్న నేపథ్యంలో డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడం నిషేధించినట్లు చెప్పారు. నిబంధనలు అతిక్రమించరాదన్నారు.

News May 31, 2024

ఏపీ ఈసెట్ ఫలితాల్లో మెరిసిన శ్రీకాకుళం విద్యార్థిని

image

ఏపీ ఈసెట్ ఫలితాల్లో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ఆమదాలవలస మండలం శ్రీహరిపురానికి చెందిన కూన జ్యోత్స్న 8వ ర్యాంకు (బ్రాంచ్ ర్యాంక్), ఇంటిగ్రేటెడ్ ర్యాంక్-826 సొంతం చేసుకుంది. ఈ విద్యార్థిని 200 మార్కులకు గాను 105 మార్కులు సాధించింది. 10వ తరగతి శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదవగా.. డిప్లొమా అనకాపల్లిలో పూర్తి చేసింది. మంచి ర్యాంక్ రావడంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు అభినందనలు తెలిపారు.

News May 31, 2024

SKLM: అభ్యర్థుల మార్పు YCPకి కలిసొచ్చేనా..?

image

2019లో శ్రీకాకుళం MP అభ్యర్థిగా YCP నుంచి బరిలో దిగిన దువ్వాడ శ్రీనివాస్ తాజా ఎన్నికల్లో టెక్కలి నుంచి అచ్చెన్నపై పోటీ చేస్తున్నారు. అటు టెక్కలిలో 2019లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పేరాడ తిలక్.. ప్రస్తుతం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. 2019లో పరాజయం పాలైన వీరిద్దరికి వైసీపీ అధిష్ఠానం మరలా టికెట్ ఇచ్చింది. స్థానాల మార్పు వైసీపీకి ఇక్కడ విజయం అందిస్తుందా..? దీనిపై మీ కామెంట్?

News May 31, 2024

శ్రీకాకుళం: విషాదం.. వివాహిత ఆత్మహత్య

image

శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన వివాహిత బెవర మేరీ సలోమి(22) గురువారం ఉరివేసుకొని మృతి చెందింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సలోమికి, పెనసాంకు చెందిన జగదీశ్‌తో వివాహమైంది. వీరికి ఏడాదిన్నర కుమార్తె. సలోమి ఉరివేసుకొని ఉన్నట్లు సమాచారం అందడంతో SI మధుసూదనరావు వెళ్లి పరిశీలించారు. ఆమె తల్లిదండ్రులు విజయవాడలో ఉండటంతో ఫిర్యాదు అందాల్సి ఉందన్నారు.

News May 31, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

శ్రీకాకుళం రోడ్, పలాస మీదుగా ప్రయాణించే ట్రైన్ నంబర్ 12513 సికింద్రాబాద్- సిల్చార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను జూన్ 1న రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. ఈ రైలు ప్రయాణించే మార్గంలో ట్రాక్ సస్పెన్షన్ కారణంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు గురువారం పేర్కొన్నారు. ప్రయాణికులు గమనించాలని కోరారు.

News May 30, 2024

మందస: గుర్తు తెలియని మృతదేహం కలకలం  

image

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొండలోగాం పంచాయతీ పరిధి రామరాయి సమీప పొలాల్లో గుర్తుతెలియని మృతదేహాన్ని స్థానిక గిరిజనులు గుర్తించారు. అనంతరం మందస పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తించినట్లయితే మందస పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

News May 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో తగ్గనున్న ఎండ తీవ్రత

image

జిల్లా ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తీపి కబురు చెప్పింది. ఈ మేరకు జిల్లాలో శుక్రవారం, శనివారం ఎండ తీవ్రత నుంచి ప్రజలకు కాస్త ఉపశమనం కలగనుందని పేర్కొంది. ఈ సందర్భంగా ఆ రెండు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గనున్నాయని తేలికపాటి మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీనితో 30 నుంచి 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను నమోదవుతాయని APSDMA తెలిపింది.