India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. చట్ట పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ కు సంబంధించి సోమవారం నుంచి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్లో ఈనెల 23వ తేదీ నుంచి 25 వరకు ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. 26న మార్పునకు అధికారులు అవకాశం కల్పించారు. కాగా శ్రీకాకుళం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో 562 సీట్లకు గాను ఈ కౌన్సిలింగ్కు 303 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అక్టోబర్ 5వ తేదీ నుంచి క్లాస్ వరకు ప్రారంభం కానున్నాయి.
శ్రీకాకుళంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదుదారుల నుంచి 85 ఫిర్యాదులు స్వీకరించామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు ఎండార్స్ చేశారు. చట్ట పరిధిలో సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.
శ్రీకాకుళం నగరంలోని జడ్పీ కార్యాలయంలో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్వర్ణంద్రా 2047 గోడ పత్రికను అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ స్వర్ణాంధ్ర లక్ష్యంగా ప్రతి అధికారి పనిచేయాలని ఆదేశించారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలను రచించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా ఉరిటి సాయికుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన విధుల్లో చేరారు. గతంలో మన్యం జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ జిల్లా అధికారిగా ఈయన విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో శ్రీకాకుళం జిల్లా అధికారిగా బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ను కలుసుకున్నారు.
శ్రీకాకుళం జిల్లాలో కీలక ఉద్యోగుల బదిలీలపై ఆదివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. జడ్పీ ఇన్ఛార్జ్ సీఈవోగా పనిచేస్తున్న రావాడ వెంకట రామన్ను విజయనగరం జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవోగా బదిలీ చేశారు. విజయనగరం జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న ఎల్.ఎన్.వి శ్రీధర్ రాజాను శ్రీకాకుళం జిల్లా పరిషత్ నూతన సీఈవోగా నియమించారు.
కల్తీ జరిగిందని గుర్తించిన TTD.. ఆ నెయ్యితో లడ్డూలే తయారు చేయలేదని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ‘వాడని నెయ్యి, తయారు కాని లడ్డూలు పట్టుకుని సీఎం చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు. లడ్డూ తయారీలో కొవ్వు కలిసిందని దుష్ర్పచారం చేస్తూ గత ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. శ్రీవారితో రాజకీయాలు బాబుకే చెల్లింది. దేవుడితో రాజకీయాలు తగవు’ అని ఓ ప్రకటనలో ధర్మాన పేర్కొన్నారు.
సారవకోట మండలం బూతడి గ్రామంలో ప్రాఖ్యత గాంచిన కంచు, ఇత్తడి కార్మికులు తమ నైపుణ్యంతో ఆంధ్రరాష్ట్ర చిహ్నంలో ఉన్న పూర్ణ ఘటం తయారు చేశారు. గ్రామానికి చెందిన కింతాడ అప్పారావు ఆయన కుమారుడు బుజ్జి సుమారు 40 రోజులు శ్రమించి 12 కేజీల ఇత్తడితో ఈ పూర్ణకుంభం తయారు చేశారు. దీనిని జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించనున్నట్లు తయారీ దారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 డాక్యుమెంట్లో జిల్లా స్ధాయి ప్రణాళిక ప్రస్ఫుటంగా ఉండేలా ప్రజలు, ప్రజా ప్రతినిధుల సూచనలు సలహాలు స్వీకరిస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ చెప్పారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ వికసిత భారత్లో భాగంగా అక్టోబరు 5 వరకు నిర్వర్తించవలసిన కార్యాచరణను వివరించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు వివిధ పోటీ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇండోనేషియా దేశంలో జరుగుతున్న పారా బ్యాడ్మింటన్ పోటీలలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివ్యాంగ క్రీడాకారుడు చాపర పూర్ణారావు విజయం సాధించాడు. ఇటీవలె విదేశాలలో జరుగుతున్న పోటీలకు వెళ్లేందుకు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆయనకు సహాయ సహకారాలు అందజేశారు. ఈ చొరవతోనే పోటీలలో పాల్గొన్నారు. ఆదివారం జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకాన్ని గెలుపొందినట్లు తెలియజేశారు. ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Sorry, no posts matched your criteria.