India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలో 6,51,717 పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ఆధారిత రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ఆగస్టు 25 నుంచి ప్రారంభమైందని. ఈ పంపిణీ సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుందని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తెలిపారు. సంబంధిత కార్డుదారులు తమ రేషన్ షాప్ పరిధిలోని సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో కార్డులు తీసుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా దోమల నిర్మూలనకు ఐదు లక్షల గాంబూసియా చేప పిల్లలను విడిచిపెట్టే కార్యక్రమం ప్రారంభించామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శనివారం అరసవల్లి దేవస్థానం ఇంద్రపుష్కరినిలో 750 చేప పిల్లలను వదిలారు. వర్షాకాలంలో పెరిగే దోమల బెడదను అరికట్టడంలో గాంబూసియా చేపలు అసలు అస్త్రం అని స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల చేప పిల్లలు విడిచిపెట్టే ప్రణాళికను పూర్తిచేయాలన్నారు

టెక్కలి అక్కపువీధిలోని నూతిలో డెడ్ బాడీ కలకలం రేపింది. ఇదే కాలనీకి చెందిన శ్రీనివాసరావు(40) శుక్రవారం నుంచి కనిపించడం లేదు. కుటుంబీకులు వెతికినా ఆచూకీ లభించలేదు. శనివారం ఇంటికి సమీపంలోని బావిలో మృతదేహాన్ని చూసిన స్థానికులు బయటకు తీశారు. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

యువతలోని ప్రతిభను వెలికితీసి క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యమని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎర్రన్న క్రీడోత్సవం కార్యక్రమంలో భాగంగా ఎంపీ కప్–2025లో 8 రకాల క్రీడా పోటీలను సెప్టెంబర్ 19 నుంచి శ్రీకాకుళంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా శుక్రవారం ప్రకటించారు. ఆసక్తి గల క్రీడాకారులు రిజిస్ట్రేషన్ లింక్ https://bit.ly/mpcup 2025 ద్వారా నమోదు చేసుకోవాలన్నారు.

ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బరు నిర్మాణ స్థలాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ ఇంజినీరింగ్ ఫర్ ఫిషరీస్ సభ్యులు శుక్రవారం పరిశీలించారు. కొత్తగా తీసుకొచ్చిన ప్రతిపాదనలకు సంబంధించి క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించారు. ఏపీ మారిటైం బోర్డు ఎస్ఈ నాగేష్, సీఐ సీఈఎఫ్ డైరెక్టర్ ఎన్.రవిశంకర్, మత్స్యశాఖ డీడీ వై.సత్య నారాయణ, ఎఫ్డీవో రవి తదితరులు ఉన్నారు.

డా. బీఆర్ అంబేద్కర్ యూనివర్శిటీలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న నూతన పరిపాలనా భవనంలో ఒక సమావేశ మందిరానికి గిడుగు వేంకట రామ్మూర్తి పేరు పెట్టనున్నట్లు వర్శిటీ వీసి. రజని తెలిపారు. శుక్రవారం గిడుగు జయింతిని క్యాంపస్లో నిర్వహించారు. గిడుగు చిత్రపటానికి పూలమాలలు వేసి వర్శిటీ అధికారులు నివాళులర్పించారు. చరిత్ర కలిగిన తెలుగు భాషను పరిరక్షించుకొని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు.

నరసన్నపేట: సాఫ్ట్ వేర్ టూ సినీ ఫీల్డ్
సంతబొమ్మాళిలో ఇద్దరిని కాటేసిన పాము
విమానాల తయారీలో భారత్ అగ్రగామిగా నిలవాలి: రామ్మోహన్
జిల్లాలో పలు చోట్ల తెలుగు భాషా దినోత్సవం
లావేరులో 8 బైక్లు సీజ్
విద్యుత్ అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
సోంపేట: బస్సు దిగుతూ జారిపడి హెచ్ఎం మృతి
ఎల్.ఎన్ పేట: జడ్పీ ఉన్నత పాఠశాలలో దొంగల హాల్చల్
ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని నరసన్నపేట(M) కోమర్తికి చెందిన అట్టాడ సృజన్ నిరూపించారు. సాఫ్ట్వేర్ జాబ్ వదిలి సినిమాలపై మక్కువతో డైరెక్టర్ అయ్యారు. నాలుగేళ్ల క్రితం ఆనంద్ దేవకొండ హీరోగా ‘పుష్పక విమానం’ సినిమాకు కథ రాయడంతోపాటు దర్శకత్వం వహించారు. తన డైరెక్షన్లో ఇటీవల విడుదైన ‘కన్యాకుమారి’ సినిమాలో శ్రీకాకుళం అందాలను చాలా బాగా చూపించారు. సృజన్ తండ్రి అట్టాడ అప్పలనాయుడు ప్రముఖ కవి.

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమీక్ష జరిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలన్నారు. కరెంటు సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

బ్మహపురం నుంచి సోంపేట మీదుగా విశాఖకు వెళ్లే ప్యాసింజర్ రైలు అనివార్య కారణాలతో మంగళవార, గురువారం, శుక్రవారం మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 4:20 గంటలకు బరంపురం నుంచి విశాఖపట్నం ప్రయాణించే ప్యాసింజర్ రైలు సర్వీసును నియంత్రించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.