India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కోటబొమ్మాళి మండలం కొత్తపల్లి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు పండించిన ధాన్యానికి 48గంటల్లో బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు.
నరసన్నపేట మండలం పెద్ద కరగాంలో ఉన్న నరికివేసిన తాటి చెట్టు మొండెం నుంచి రావి మొక్క రావడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ చెట్టును నరికి వేశారు. పక్షులు గింజలను చెట్ల తొర్రలో వేయడంతో రావి మొక్క వచ్చిందని గ్రామస్థులు అంటున్నారు. అటుగా వెళ్లే ప్రయాణికులు సైతం పైన చెట్టు రావడడంతో ఆగి మరీ చూస్తున్నారు.
టెక్కలి పాత హైవేపై రోడ్డు ఆక్సిడెంట్లో ఓ యువకుడు శనివారం సాయంత్రం మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన రావివలస మల్లేశ్వరరావు(32) అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంతబొమ్మాళికి వచ్చి తిరిగి వెళ్తుండగా టెక్కలి ఆట్ నుంచి దూకి తప్పించుకునే క్రమంలో లారీ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
బూర్జ మండలం చీడివలస గ్రామానికి సంబంధించిన శ్మశాన వాటికకు సరైన రహదారి లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు స్థానికులు తెలిపారు. గ్రామంలో ఎవరైనా మృత్యువాత పడితే దహన సంస్కారాలకు పంట పొలాల గట్లు మీద నుంచి నానా అవస్థలు పడుతూ తీసుకెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ రహదారి నిర్మాణానికి నిర్లక్ష్యం చేసిందన్నారు. ఇప్పటి కూటమి ప్రభుత్వం అయినా రహదారి నిర్మించాలని కోరుతున్నారు.
పెండింగ్లో ఉన్న కేసులు దర్యాప్తు వేగవంతం చేయాలని పోలీసు అధికారులను SP మహేశ్వర రెడ్డి ఆదేశించారు. పెండింగ్లో ఉన్న NDPS, సైబర్, గ్రేవ్, ప్రాపర్టీ , SC, ST, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, ముఖ్యమైన కేసుల దర్యాప్తు, కేసులు పరిష్కారం, నేర నియంత్రణ తదితర అంశాలపై SP శనివారం సాయంత్రం జిల్లా పోలీసు కార్యాలయం పోలీసు అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రణస్థలం మండలం లంకపేటలో శనివారం ఐదుగురిపై తేనెటీగలు దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఇద్దరు మృతి చెందగా గాయపడిన పలువురిని స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. మృతులను కిల్లారి కాంతమ్మ, కిల్లరి సూరి కిష్టప్పడుగా గుర్తించారు. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండగా మెరుగైన చికిత్స కోసం విశాఖ కెజిహెచ్కి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు.
ఓపెన్ స్కూల్లో పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 28 వరకు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 200 అపరాధ రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో గాని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో గాని సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం జిల్లా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కుక్క కాటుకు సంబంధించిన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని DM&HO డా. బొడ్డేపల్లి మీనాక్షి తెలిపారు. CHC సెంటర్ల వద్ద కూడా ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని అన్నారు. ఇండెంట్ పెట్టిన వెంటనే ఈ వ్యాక్సిన్ను సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. కుక్కకాటు బాధితులు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలని మంచి వైద్యం అందుతుందన్నారు.
కొత్తూరు మండలం జోగిపాడుకు చెందిన లుకలాపు పాపయ్య కుమారుడు జనార్దన్ (42) శుక్రవారం హైదరాబాద్లో మరణించాడు. సహోద్యోగులు, కుటుంబీకుల వివరాల ప్రకారం.. మృతుడు 2001 నుంచి అక్కడే ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే డ్యూటీకి వెళ్లి ఇంటికి రాకుండా సెకండ్ షిఫ్ట్లో ఉరేసుకొని చనిపోయాడు. కేసు నమోదు చేసుకొని పోస్ట్మార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు.
టెక్కలి మండలంలోని మెట్కోర్ అల్లాయిస్ పరిశ్రమకు అధికారుల విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రావివలసలోని ఈ పరిశ్రమ సుమారు రూ.4 కోట్ల మేరకు విద్యుత్ బకాయి పడినట్లు అధికారులు తెలిపారు. దీంతో శుక్రవారం టెక్కలి విద్యుత్ శాఖ అధికారులు పరిశ్రమకు సరఫరాను నిలిపివేశారు. హెచ్.టీ సర్వీస్ పరిధిలో ఉన్న ఈ పరిశ్రమ బకాయిలు కోట్ల రూపాయలలో ఉండటంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు.
Sorry, no posts matched your criteria.