Srikakulam

News May 29, 2024

ఎచ్చెర్ల: కొనసాగుతున్న పాలిటెక్నిక్ కౌన్సిలింగ్

image

పాలిసెట్-2024 కౌన్సిలింగ్ 12001నుంచి 27000మధ్య ర్యాంకు విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరీశీలించారు. పరీశీలనకు 372 మంది విద్యార్థులు హాజరయ్యారు. బుధవారం 27001నుంచి 43000ర్యాంకు మధ్య ధ్రువీకరణ పత్రాలు పరీశీలించనున్నారు. కౌన్సిలింగ్ 27న ప్రారంభించగా, ఇప్పటి వరకు 615 మంది హాజరయ్యారు. కౌన్సిలింగ్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. ఈనెల 31నుంచి జూన్ 4వ తేదీ వరకు కళాశాలలు, బ్రాంచ్‌ల ఆప్షన్ల ఎంచుకోవాలి.

News May 29, 2024

పలాస గెలుపుపై ఒడిశాలో బెట్టింగులు?

image

జిల్లాలో పలాస నియోజకవర్గానిది ప్రత్యేక స్థానం ఉంది. ఈ నియోజకవర్గం గురించి ఒడిశాలో కూడా బెట్టింగులు జోరందుకున్నాయి. పలాసలో వైసీపీ నుంచి సీదిరి అప్పలరాజు, కూటమి నుంచి గౌతు శీరిష బరిలో ఉన్నారు. గత ఎన్నికలో సీదిరి 16,000 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2019లో 73.35శాతం ఓటింగ్ నమోదవ్వగా, ఈసారి 76.42శాతం నమోదైంది. పెరిగిన 3శాతం పోలింగ్ ఎవరికి కలిసివస్తుందో జూన్4 వరకు వేచి చూడాల్సిందే.

News May 29, 2024

ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం ఆమదాలవలస

image

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడికి సమయం దగ్గర పడుతోంది. ఇందులో భాగంగా నిబంధన ప్రకారం తక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న నియోజకవర్గం లెక్కింపు ముందుగా చేపట్టాలి. అతి తక్కువ పోలింగ్ కేంద్రాల 259 ఉన్న ఆమదాలవలసలో ఈవీఎంలను తెరిచి ముందుగా ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత శ్రీకాకుళం, పలాస, ఇచ్ఛాపురం, నరసన్నపేట, ఎచ్చెర్ల, టెక్కలి చివరిగా అధికంగా 332 పోలింగ్ కేంద్రాల ఉన్న పాతపట్నం నియోజకవర్గం ఫలితాలు వస్తాయి.

News May 29, 2024

శ్రీకాకుళం: ఓట్ల లెక్కింపు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

కౌటింగ్‌ పక్కాగా జరగాలని, ఎన్నికల ఫలితాలను రౌండ్ల వారీగా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేసే సిబ్బంది, అలాగే వాటిని క్రాస్ చెక్ చేసే మరో బృందం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌ సిబ్బందితో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు వివరాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా నమోదు చేయాలన్నారు.

News May 28, 2024

శ్రీకాకుళం: ఏజెంట్లుకు కలెక్టర్ కీలక సూచనలు

image

అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు జూన్ 4 తేదీ ఉదయం 6 గంటలకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. ఆ రోజు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుందని, ప్రతీ ఏజెంటు పెన్ను, పెన్సిల్, నోట్ పేడ్ తీసుకురావాలన్నారు. రిటర్నింగ్ అధికారులు అనుమతి లేకుండా ఏజెంట్లు ఎవరూ లోపలికి బయటకు వెళ్లరాదని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా అంతా సహకరించాలని కోరారు.

News May 28, 2024

ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పరమేశ్వర్ ఫంక్వల్ నియామకం

image

శ్రీకాకుళం – ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్‌గా పరమేశ్వర్ ఫంక్వల్ నియమితులయ్యారు. ఈ మేరకు సంబంధిత అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. పరమేశ్వర్ 1998 బ్యాచ్ ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ ఇంజినీర్స్(IRSE)కు చెందినవారు. గతంలో ఈయన రాజ్‌కోట్, అహ్మదాబాద్ రైల్వే డివిజన్లలో కీలక పదవుల్లో పనిచేశారని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తెలిపింది.

News May 28, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే ఇంటర్ పబ్లిక్ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 1,3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల ఉంటాయి. సబ్జెక్టువారీగా టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి.

News May 28, 2024

నరసన్నపేటలో చైతన్యరథంపై ఎన్టీఆర్

image

1982 ఆగస్టులో ఎన్టీఆర్ నరసన్నపేట వచ్చారు. చైతన్యరథంపై ప్రచారం చేపట్టారు. కార్మికుడి డ్రెస్‌ వేసుకుని.. లక్ష్మీథియేటర్ సెంటర్లో ఉపన్యాసాలతో హోరెత్తించారు. ఎన్టీఆర్‌ను చూసేందుకు పేట వాసులతో పాటు చుట్టుపక్క గ్రామాల ప్రజలు అధికసంఖ్యలో తరలివచ్చారు. ప్రచార సభ అనంతరం.. ఎన్టీఆర్‌ నరసన్నపేట నుంచి తామరాపల్లి మీదుగా కోటబొమ్మాళి మండలం సుబ్బారాయుడుపేట వద్ద శివాలయంలో రాత్రి బస చేశారు.

News May 28, 2024

శ్రీకాకుళం: ఓట్ల లెక్కింపులో 1300 మంది సిబ్బంది

image

ఈవీఎంలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు 1300 మంది సూపర్‌వైజర్లు, మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్‌ సూపర్‌వైజర్‌లను నియమించినట్లు కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. రౌండ్లవారీగా ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలో ఆమదాలవలస నియోజకవర్గానికి 19 రౌండ్లు, పాతపట్నం 24, ఇచ్ఛాపురం 22, పలాస 21, టెక్కలి 23, శ్రీకాకుళం 20, ఎచ్చెర్ల 23, నరసన్నపేట 21 రౌండ్లుగా లెక్కింపు జరగనుంది.

News May 28, 2024

పలాసలో బాలుడి కిడ్నాప్‌కు యత్నం

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రాజమ్మ కాలనీకి చెందిన పదేళ్ల బాలుడు కుమార్ తన తల్లిని కలిసేందుకు సమీపంలో ఉన్న జీడి పరిశ్రమకు సోమవారం వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలో గుర్తుతెలియని ఓ వ్యక్తి బాలుడికి మాయమాటలు చెబుతూ తన వెంట ద్విచక్ర వాహనంపై తీసుకుపోయాడు. పలాస రైల్వే స్టేషన్ వైపు వెళుతున్న సమయంలో బాలుడు బిగ్గరగా ఏడుస్తూ ఉండటాన్ని స్థానికులు ప్రశ్నించడంతో బాలుడును వదిలి వెళ్లాడు.