Srikakulam

News May 25, 2024

శ్రీకాకుళం: తుఫాను ప్రభావంతో జిల్లాకు వర్ష సూచన

image

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కొన్ని గంటల్లో తుఫాన్ (రెమాల్)గా మారే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. ఇది రేపటికి తీవ్ర తుఫాన్‌గా మరి అవకాశం ఉందని తాజా ప్రకటనలో వెల్లడించారు. ఈ తుఫాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. కావున మత్స్యకారులు సోమవారం వరకు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

News May 25, 2024

శ్రీకాకుళం: సజావుగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

జిల్లా వ్యాప్తంగా ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. పకడ్బందీగా పరీక్షలు నిర్వహణ చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఉదయం జరిగిన పరీక్షలకు 3,422 మంది హాజరు కావాల్సి ఉండగా 176 మంది గైర్హాజరై 3,246 మంది పరీక్ష రాశారని అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 926 మంది హాజరు కావాల్సి ఉండగా 80 మంది గైర్హాజరై 846 మంది పరీక్ష రాశారని వారు పేర్కొన్నారు.

News May 25, 2024

శ్రీకాకుళం: SSC విద్యార్థులకు ముఖ్య గమనిక

image

ఏపీ సార్వత్రిక విద్యాపీఠం(APOSS) నిర్వహించే SSC సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు APOSS పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూన్ 1, 3, 5, 6, 7, 8 తేదీల్లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయని, టైం టేబుల్ పూర్తి వివరాలకు https://apopenschool.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్ చూడాలని APOSS వర్గాలు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసాయి.

News May 25, 2024

ఇచ్ఛాపురం: జాతీయ రహదారిపై కారు బీభత్సం

image

ఇచ్ఛాపురం చీకటి బలరాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం బలరాంపురం గ్రామ సమీపంలో ఓ ద్విచక్ర వాహనాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి డివైడర్ పైకి దూసుకు వెళ్లి ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. అదే సమయంలో ఎదురుగా వస్తున్న టాటా మ్యాజిక్ వాహనం కారును ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

News May 25, 2024

శ్రీకాకుళం: ఏజెంట్ల ఎంపికపై పార్టీలు అప్రమత్తం

image

శ్రీకాకుళం జిల్లాలో ఇరు పార్టీలకు అత్యంత నమ్మకమైన వ్యక్తులను ఏజెంట్లుగా నియమించే దిశగా అభ్యర్థులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇతర ఏజెంట్లకు దీటుగా వారిని తట్టుకునే శక్తియుక్తులున్న వారిని ఎంపిక చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. విశ్వసనీయుల పేర్లనే రిటర్నింగ్ అధికారులకు పంపించేందుకు అభ్యర్థులు సిద్ధం అవుతున్నారు.

News May 25, 2024

చైనా ఏజెంట్ల వలలో శ్రీకాకుళం జిల్లా వాసి

image

కాంబోడియాలో డేటా ఎంట్రీ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను కొందరు ఏజెంట్లు నమ్మించిన ఘటనలో పలాస వాసి
ఉన్నట్లు సమాచారం. ఆ యువకుడి నుంచి రూ.1.50 లక్షలు తీసుకుని చైనా, కాంబోడియా కంపెనీల ఏజెంట్లకు అప్పగించారు. ఓ బాధితుడి ఫిర్యాదుతో విషయం వెలుగు చూసింది. భారత రాయబార, విదేశీ వ్యవహారాల శాఖ సహకారంతో కొందరు రెండు విమానాల్లో శుక్రవారం రాత్రి విశాఖకు చేరుకున్నారు. వారిలో పలాస వాసి ఉన్నట్లు గుర్తించారు.

News May 25, 2024

రాష్ట్రంలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనే..!

image

ఏపీలో రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. తాజా లెక్కల ప్రకారం అన్ని జిల్లాల నుంచి 5,39,189 ఓట్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 38,865 ఓట్లు పోలయ్యాయని, తరువాత స్థానంలో నంద్యాల జిల్లా (25,283) ఓట్లు రాగా, మూడో స్థానంలో కడప జిల్లా (24,918) ఓట్లు పోలయ్యాయి. ఇక అత్యల్పంగా నరసాపురంలో (15,320) ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

News May 25, 2024

శ్రీకాకుళం: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆమదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*పలాసలో 40 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు.*వజ్రపుకొత్తూరు మండల పరిధిలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య. *దైవ దర్శనానికెళ్లి కాశీలో గుండె పోటుతో మృతి చెందిన టెక్కలివాసి. *రాష్ట్రంలో పోలైన అత్యధిక బ్యాలెట్ ఓట్లు శ్రీకాకుళం జిల్లాలోనే. *మద్యం మత్తులో డ్రైనేజీలో పడి మృతి చెందిన హిరమండల వాసి. *ఎచ్చెర్ల మండల పరిధిలో బోల్తాపడిన ఇసుక లారీ.*రైల్వే పనుల కారణంగా పాతపట్నం వెళ్లే రైళ్లు రద్దు

News May 24, 2024

శ్రీకాకుళం: ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆముదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.