Srikakulam

News August 24, 2025

సోంపేట: తీరప్రాంత మహిళలు ఆర్థిక స్వావలంబనకు కూటమి కృషి

image

తీర ప్రాంత మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఉపాధి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు వేసింది. సోంపేట మండలం మూలపొలం గ్రామంలో, సముద్రపు నాచుసాగు పైలట్ ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ విధానంలో శనివారం కలెక్టర్, స్థానిక మహిళలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ పద్ధతి ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందవచ్చునని సీఎం చెప్పారు. కలెక్టర్, మహిళలు ఇక్కడి పరిస్థితులను సీఎంకు వివరించారు.

News August 23, 2025

ప్రిన్సిపల్‌గా 12వ ర్యాంకు సాధించిన జి.సిగడాం వాసి

image

మెగా డీఎస్సీ – 2025 ఫలితాలలో ఇంగ్లిష్ స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్న బాలి అప్పలరాజుకు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్‌గా స్టేట్ 12వ ర్యాంకు సాధించారు. తాను ప్రస్తుతం జి. సిగడాం జెడ్పీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నానని తెలిపారు. అయితే విడుదలైన ఫలితాలలో మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ స్టేట్ 12వ ర్యాంకుతో పాటు పీజీటీగా స్టేట్ ఏడవ ర్యాంకు కూడా వచ్చిందన్నారు.

News August 23, 2025

నరసన్నపేట: వంశధార పేపర్ మిల్లు ప్రమాదంలో ఒకరు మృతి

image

నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిల్లులో నిల్వ చేసిన టన్నుల ఊక ఒక్కసారిగా కార్మికుడు వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇదే గ్రామానికి చెందిన వాడిని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

News August 23, 2025

టెక్కలి: చికిత్స పొందుతూ ఇద్దరు మృతి.

image

టెక్కలి మండలం సింగుమహంతిపేట, రెయ్యిపేట గ్రామాల్లో ఈ నెల 19,20 తేదీల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో గణేష్(27), లోకేశ్వరరావు(37) ఇరువురు శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ మృతిచెందినట్లు టెక్కలి పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి తీవ్రంగా గాయపడి గణేష్ మృతిచెందగా, పురుగులమందు తాగిన లోకేశ్వరరావు చికిత్స పొందుతూ మరణించాడని చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News August 23, 2025

ఆదిత్యుని సేవలో ఏపీ జెన్‌కో ఎండీ

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని శుక్రవారం సాయంత్రం ఏపీ జెన్‌కో ఎండీ కేవీఎన్‌ చక్రధరబాబు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

News August 23, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

➤మాతాశిశు మరణాలు తగ్గించాలి: జిల్లా కలెక్టర్
➤సరుబుజ్జిలి: చెరువులను తలపించే గోతులతో రోడ్లు
➤ అచ్చెన్నాయుడు రైతులు నడ్డి విరుస్తున్నారు: ఎమ్మెల్సీ దువ్వాడ
➤ పోలీస్ శిక్షణ కేంద్రం పనులు పూర్తిచేయాలి: డీఐజీ
➤ఎచ్చెర్ల: ఐటెప్ కోర్సులోకి కౌన్సెలింగ్ ప్రారంభం
➤ఆదిత్యుని సేవలో ఏపీ జెన్ కో ఎండీ
➤టెక్కలి: ఎండల మల్లన్నకు పసుపు అలంకరణ

News August 23, 2025

నరసన్నపేట: వంశధార పేపర్ మిల్లు ప్రమాదంలో ఒకరు మృతి

image

నరసన్నపేట మండలం మడపాం వంశధార పేపర్ మిల్లులో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం మిల్లులో నిల్వ చేసిన టన్నుల ఊక ఒక్కసారిగా కార్మికుడు వాసు(45)పై పడిపోవడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు ఇదే గ్రామానికి చెందిన వాడిని స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

News August 22, 2025

శ్రీకాకుళంలో స్పెషల్స్ కోర్టు ఏర్పాటుకు ఆమోదం

image

శ్రీకాకుళంలో స్పెషల్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గురువారం విజయవాడలో సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. భారత ఉన్నత న్యాయస్థానం క్రిమినల్ రిట్ పిటీషన్ నెంబరు 511 ఆఫ్ 2024లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు కోర్టు ఏర్పాటు చేయనున్నారు. మావోయిస్ట్ కేశవరావుపై విచారణ చేస్తున్న16 కేసులపై 7 వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టుగా నియమించే ప్రతిపాదనకు ఆమోదం దక్కింది.

News August 22, 2025

ఎచ్చెర్ల: నేడు పోలీసులకు ఫైరింగ్ ప్రాక్టీస్

image

ఎచ్చెర్లలోని చిన్నరావుపల్లి వద్ద పోలీస్ ఫైరింగ్ గ్రౌండ్‌లో శుక్రవారం జిల్లా పోలీసులు ఫైరింగ్ ప్రాక్టీస్ చేయనున్నట్లు రిజర్వ్ ఇన్స్పెక్టర్ శంకర్ ప్రసాద్ తెలిపారు. పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వార్షిక శిక్షణలో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హాజరవుతారన్నారు.

News August 22, 2025

శ్రీకాకుళం SC యువతకు హెవీ వాహన డ్రైవింగ్ శిక్షణ

image

జిల్లాకు చెందిన షెడ్యుల్డ్ కులాల యువతీ–యువకులకు భారీ వాహన డ్రైవింగ్ శిక్షణ కల్పించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాకు చెందిన 10 మంది అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అభ్యర్థుల వయస్సు 20-40 ఏళ్లతో పాటుగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్నారు. వివరాలకు జిల్లా షెడ్యుల్డ్ కులాల సేవా సహకార సంఘం కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.