India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు విషయాన్ని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ‘ఇది మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొనేందుకు కవిటి మండలం రాజపురం గ్రామానికి సీఎం రానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం పొగిరి గ్రామంలో 1000 ఏళ్ల కిందటి అపురూపమైన శైవ శిల్పాలు ఉన్నాయని, ఆగ్రామం కాకతీయుల నాడు గొప్ప శైవక్షేత్రంగా వెలసిందని, రాజాం రచయితల వేదిక నిర్వాహకుడు గార రంగనాథం తెలిపారు. బుధవారం ఆ గ్రామానికి వెళ్లగా ఊరి ముందర రోడ్డుపక్కన నాగదేవత శిల్పముంది. అది అక్కడి చెరువు తవ్వుతుండగా దొరికిందని తెలిపారు. ఊర్లో ఉన్న వెయ్యేళ్ళ కిందటి అగస్త్యేశ్వర ఆలయాన్ని పరిశీలించారు.
ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
✮ శ్రీకాకుళంలో ప్రైవేటు సంస్థ 3వేల మందికి మోసం
✮ రేగిడిలో ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
✮ ఏపీ పీజీ సెట్ రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభం
✮ జిల్లాలో 95.45 శాతం ఈ క్రాప్ నమోదు
✮ శ్రీకాకుళం IIIT రిజిస్ట్రార్గా అమరేంద్ర
✮ త్వరలో ఆమదాలవలస అన్న క్యాంటీన్ ప్రారంభం
✮ ఈనెల 20న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్
✮ DRBRAUలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అందని వేతనాలు
✮ జిల్లా ప్రముఖ విద్యావేత్త చక్రధర్ మృతి
ఈ నెల సెప్టెంబరు 20 శుక్రవారం నాడు విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ స్వాభిమాన్ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరుగుతుందని విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు కె.కవిత బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు వినతుల స్వీకరణ ఉంటుందన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
రేగడి ఆమదాలవలస అంబాడ వెంకటాపురం గ్రామానికి చెందిన గోగుల యోగేశ్వరరావు(20) బుధవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆత్మహత్యకు ముందు అతడు సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు ఎస్సై నీలావతి తెలిపారు. ‘దానిలో తాను కెరియర్లో సక్సెస్ అవ్వలేక పోతున్నా, కుటుంబ సభ్యులను ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ప్రయత్నించా, కానీ నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా విఫలం అవుతున్నా’ అంటూ విద్యార్థి రాశాడు.
ఏపీ పీజీ సెట్-2024 రెండో విడత కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఈ మేరకు జిల్లాలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో మొదటి విడత అలాట్మెంట్, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తయింది. 542 సీట్లు ఉండగా 259 ప్రవేశాలు జరిగాయి. ఇంకా 303 సీట్లు మిగిలి ఉండటంతో రెండో విడత కౌన్సిలింగ్కు ఈనెల 19 లోపు రిజిస్ట్రేషన్, 21న ఆన్లైన్లో ధ్రువీకరణ పత్రాల పరిశీలన, 23, 25న వెబ్ ఆప్షన్ నమోదుకు అవకాశం కల్పించామని అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం రైతు బజారు సమీపంలో ఓ ప్రైవేటు సంస్థ బాధితులను మోసం చేసిన ఘటన చోటుచేసుకుంది. ఆ సంస్థ తక్కువ పెట్టుబడితో లాభాలు పొందవచ్చని ఖాతాదారులను నమ్మించింది. జిల్లాలో సుమారు 3 వేల మంది సభ్యులుగా చేర్చుకుంది. పలు మార్గాల రూపంలో డబ్బులు వసూలు చేసి, 4 నెలలుగా అనుమానం కలగకుండా సక్రమంగా చెల్లింపులు జరిపింది. సంస్థ కార్యకలాపాలు అందుబాటులో లేకపోవడంతో మోసపోయామని బాధితులు పోలీసులకు సమాచారం అందించారు.
నరసన్నపేట మండలం దూకులపాడు పంచాయతీ తండ్యాలవానిపేటకు చెందిన శిమ్మ దివ్య అత్తింటి వేధింపులు కారణంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు హుటాహుటిన నరసన్నపేటలోని ఓ స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి మంగళవారం రాత్రి తరలించారు. దివ్య తల్లి ఆదిలక్ష్మి నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఎస్సై దుర్గా ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టమన్నారు.
అభివృద్ధికి అవకాశం ఉన్న అన్ని రంగాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కీలక శాఖల 100 రోజుల కార్యాచరణ నివేదికలపై శాఖల వారీగా ఉన్నతాధికారులతో శ్రీకాకుళంలో బుధవారం దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయిలో 100 రోజుల పనుల ప్రగతి, లక్ష్యాలపై జాయింట్ కలెక్టర్తో కలిసి అధికారులకు పలు సూచనలు చేశారు. అందరూ లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.