India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

శ్రీకాకుళం జిల్లాలోని పలు స్టేషన్ల మీదుగా ప్రయాణించే గుణుపూర్(GNPR)- కటక్(CTC) రైలు ఈ నెల 31న ఖుర్దా రోడ్ వరకే నడపనున్నట్లు రైల్వే అధికారులు తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు. ట్రాక్ పనులు జరుగుతున్నందున..ఈ నెల 31న నెం.68434 GNPR- CTC మెము ఖుర్దా రోడ్ వరకు, అదే విధంగా నెం.68433 CTC- GNPR మెమో కటక్కు బదులుగా ఖుర్దా రోడ్ స్టేషన్ నుంచి బయలుదేరుతుందని తెలిపారు.

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పనాశాఖ ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా జరగనుంది. ఆగస్టు 30న ఉదయం 10 గంటలకు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు జిల్లాఉపాధి కల్పనా అధికారి సుధ ఒక ప్రకటనలో తెలిపారు. ట్రాన్స్ ఇండియా, గోడ్రెజ్ ఇండియా, డివిస్ లాబ్స్, సీల్ ఎలక్ట్రానిక్స్ వంటి ప్రైవేట్ సంస్థల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

టెక్కలి పోలీస్ స్టేషన్ ఆవరణలో గురువారం రాత్రి పలు దళిత సంఘాల ప్రతినిధుల సమక్షంలో ప్రేమ జంట ఒక్కటయ్యింది. స్థానికుల వివరాల మేరకు టెక్కలికి చెందిన కిరణ్మయి, విశాఖకు చెందిన శివ శంకర వరప్రసాద్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కాగా ఇరువురు విషయాన్ని వారి ఇంటిలో చెప్పిన నిరాకరించారు. దీంతో వీరిద్దరూ దళిత సంఘాల ప్రతినిధులు బోకర నారాయణరావు, యడ్ల గోపీ తదితరులు సమక్షంలో దండలు మార్చుకుని ఒక్కటయ్యింది.

భవిష్యత్తు ప్రపంచాన్ని ముందుకు నడిపేది క్వాంటం సాంకేతికతేనని కలెక్టర్ దినకర్ పుండ్కర్ అన్నారు. విద్యార్థులు ఈ రంగంలో చేస్తున్న ఆవిష్కరణలు రాష్ట్రానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్–2025లో భాగంగా ఆర్జీయూకేటీ (త్రిబుల్ ఐటీ ఎచ్చెర్ల), శ్రీకాకుళంలో అంతర్గత హ్యాకథాన్ నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వినూత్న ఆవిష్కరణలను చూసి ప్రశంసించారు.

▶ శ్రీకాకుళంలో కార్డెన్ సెర్చ్.. ఐదు బైక్ లు సీజ్
▶10 వేల మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి: అచ్చెన్నాయుడు
▶కొత్తూరు: రోడ్డుపై ప్రవహిస్తున్న గెడ్డ నీరు
▶శ్రీకాకుళం, టెక్కలిలో ఈనెల 30న జాబ్ మేళా
▶ కొత్తమ్మతల్లి ఉత్సవాలపై మంత్రి అచ్చెన్న సమీక్ష
▶ రోగులకు సక్రమంగా వైద్యసేవలు అందించాలి: ఎమ్మెల్యే బగ్గు
▶ కొత్తూరులో నీట మునిగిన పంట పొలాలు

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆగస్టు 30న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.టీ.గోవిందమ్మ గురువారం తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలు నిర్వహించే ఈ జాబ్ మేళాలో 10th, ఇంటర్, డిగ్రీ, బీటెక్ అర్హత కలిగిన వారు జాబ్ మేళాకు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు దేవాదయ శాఖ అధికారులను ఆదేశించారు. రానున్న నెల 23 నుంచి 25 వరకు జరగనున్న పండగ మహోత్సవం నేపథ్యంలో గురువారం నిమ్మాడ కార్యాలయంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

శ్రీకాకుళంలోని చిత్రంజన్ వీధికి చెందిన భారటం సావిత్రమ్మ (85) గురువారం ఉదయం మృతి చెందారు. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. రెడ్ క్రాస్ ఛైర్మన్ జగన్మోహనరావు విషయాన్ని తెలియజేశారు. మగటపల్లి కళ్యాణ్ నేత్ర సేకరణ కేంద్రం ఐ.టెక్నీషియన్ సుజాత, కృష్ణ ఆమె కార్నియాలు సేకరించి విశాఖపట్నంలోని ఎల్.వి.ప్రసాద్ నేత్ర సేకరణ కేంద్రానికి పంపించినట్లు తెలిపారు.

శ్రీకాకుళం, పలాస మీదుగా సంత్రాగచ్చి(SRC)- యశ్వంత్పూర్(YPR) మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించామని రైల్వే అధికారులు తెలిపారు. నం.02863 SRC- YPR రైలును Sept 4 నుంచి Sept 18 వరకు ప్రతి గురువారం, నం.02864 YPR- SRC మధ్య నడిచే రైలును Sept 6 నుంచి Sept 20 వరకు ప్రతి శనివారం నడిచేలా పొడిగించామన్నారు. ఈ రైళ్లు ఏపీలోని పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మంగళవారం సూచించారు. ఉత్సవాలలో ఎటువంటి అవాంచనీయ ఘటనలు, అపసృతులకు చోటు ఇవ్వకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఈ వేడుకల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవలసిన బాధ్యత నిర్వాహకులపై ఉందన్నారు.
Sorry, no posts matched your criteria.