Srikakulam

News May 23, 2024

SKLM: కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. స్వస్థలాలకు విద్యార్థులు!

image

కిర్గిస్థాన్‌లో వైద్య విద్య అభ్యసిస్తున్న రాజాం విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 13వ తేదీన మొదలైన అల్లర్లు ఇంకా సద్దుమణగకపోవడంతో అక్కడ ఉండడం శ్రేయస్కరం కాదని భావించి ఇంటి దారి పట్టారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ నెలాఖరుకు స్వదేశం వచ్చేలా విమాన టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. అక్కడున్న పరిస్థితుల నేపథ్యంలో వర్సిటీలకెళ్లి చదువుకోలేకపోతున్నామని వారు తెలిపారు.

News May 23, 2024

నేటితో ముగియనున్న ఈఏపీసెట్ పరీక్షలు

image

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు గాను నిర్వహిస్తున్న ఈఏపీసెట్ 2024 పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. ఈనెల 16 నుంచి బైపీసీ, ఎంపీ విభాగాలకు గాను జరుగుతున్న పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి. జిల్లాలోని చిలకపాలెం, ఎచ్చెర్ల, టెక్కలి, నరసన్నపేట ప్రాంతాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. జేఎన్టీయూ కాకినాడ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

News May 23, 2024

శ్రీకాకుళం: ఐటీఐలో 550 ఉద్యోగాలతో జాబ్ మేళా

image

ఎచ్చెర్ల ప్రభుత్వ ఐటీఐలో నేడు జాబ్ మేళా నిర్వహించనున్నారు. 18-35 వయసు గల అభ్యర్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు. ఈ మేళాలో 550 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. టెన్త్, ఐటీఐ ఒరిజినల్ పత్రాలు, ఆధార్ కార్డుతో పాటు బయోడేటా జిరాక్స్ కాపీలు 2 సెట్లు, పాస్‌పోర్టు సైజు ఫోటోలతో ఉ. 9 గంటలకు హాజరు కావాలాని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు.

News May 23, 2024

శ్రీకాకుళం: వీడిన మర్డర్ మిస్టరీ .. భార్య అరెస్ట్

image

నగర పాలక సంస్థ పరిధి గూనపాలెంలో హత్యకు గురైన సీర సురేశ్ (34) మర్డర్ మిస్టరీ వీడింది. అనుమానంగా ఉన్న మృతుడు భార్య తిరుమలను ఈ మర్డర్లో కీలక సూత్రధారిగా పోలీసులు నిర్ధారించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసి నిందితురాలు తిరుమలను బుధవారం సీఐ సన్యాసినాయుడు, 1 టౌన్ ఎస్సై బలివాడ గణేశ్ అదుపులోకి తీసుకున్నారు. మృతుడి భార్య తిరుమలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు వారు స్పష్టం చేశారు.

News May 23, 2024

మెలియాపుట్టి: ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

image

పాతపట్నం మండలం ద్వారకాపురి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెలియాపుట్టి మండలం తుమ్మకొండ రామచంద్రపురం గ్రామానికి చెందిన అప్పల నరసమ్మ (45) ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. తన కన్నవారిని చూసేందుకు జగన్నాధపురం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలోఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

News May 22, 2024

మెలియాపుట్టి: ఆర్టీసీ బస్సు కిందపడి మహిళ మృతి

image

పాతపట్నం మండలం ద్వారకాపురి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మెలియాపుట్టి మండలం తుమ్మకొండ రామచంద్రపురం గ్రామానికి చెందిన అప్పల నరసమ్మ (45) ఆర్టీసీ బస్సు కింద పడి మృతి చెందినట్లు ఎస్సై మహమ్మద్ యాసిన్ తెలిపారు. తన కన్నవారి సృష్టి జగన్నాధపురం వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ఆర్టీసీ బస్సు క్రాస్ చేసే క్రమంలో ప్రమాదం జరిగినట్లు చెప్పారు.

News May 22, 2024

శ్రీకాకుళం: ఎస్పీని సత్కరించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులు

image

లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీ రాధికను అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జిల్లాలో పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలకు గాను అధిక ఓటింగ్ శాతం నమోదు, ఎన్నికలు సజావుగా శాంతియుతంగా నిర్వహించినందుకు గాను లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ప్రతినిధులు బుధవారం సాయంత్రం ఆమెను సత్కరించి, అభినందనలు తెలిపారు. వారిలో ప్రతినిధులు సెంట్రల్ మెంటార్ నటుకుల మోహన్, తదితరులు ఉన్నారు.

News May 22, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త

image

ప్రయాణికుల సౌకర్యార్థం పలాస మీదుగా తాంబరం, సత్రాగచ్చి మధ్య స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) తెలిపింది. నం.06089 తాంబరం- సత్రాగచ్చి ట్రైన్‌ను జూన్ 5 నుంచి జూలై 3 వరకూ ప్రతి బుధవారం, నం.06090 సత్రాగచ్చి- తాంబరం ట్రైన్‌ను జూన్ 6 నుంచి జూలై 4 వరకూ ప్రతి గురువారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, రాజమండ్రి, విజయనగరంతో పాటు పలు ప్రధాన స్టేషన్లలో ఆగుతాయి.

News May 22, 2024

శ్రీకాకుళం: అధ్యాపకులకు ముఖ్య గమనిక

image

కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో ఉత్తమ అధ్యాపకులకు ఇచ్చే అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. UG, PG విద్యార్థులకు బోధించే అధ్యాపకులకు 2 కేటగిరీలలో ఇచ్చే ఈ అవార్డులకు https://www.awards.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌లో జూన్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఎంపికైన 35 మంది అధ్యాపకులకు మెడల్, సర్టిఫికెట్‌తో పాటు రూ.50వేల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.

News May 22, 2024

శ్రీకాకుళం: ‘కొరియర్ కాల్స్‌పై అప్రమత్తత అవసరం’

image

కొరియర్ పేరుతో వచ్చే కాల్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP దీపిక తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌లో బుక్‌చేసిన ఐటమ్ యొక్క పార్సల్౨లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని కేసు నమోదైందని సీబీఐ లేదా పోలీసుల మంటూ సైబర్ నేరగాళ్లు బెదిరిస్తారని చెప్పారు. విచారణకు రమ్మంటారని, రాలేమంటే ఆన్లైన్లోనే రావచ్చునని చెప్పి, ఓ లింక్ పంపిస్తారని దాన్ని తెరిస్తే బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయిపోతాయని ఎస్పీ వివరించారు.