India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ మరో ప్రతిష్ఠాత్మక క్రికెట్ ట్రోఫీకి ఎంపికయ్యాడు. సెప్టెంబర్లో జరగనున్న దులీప్ ట్రోఫీకి శ్రీకాకుళం జిల్లా నుంచి విజయ్ను ఎంపిక చేశారు. రంజీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన విజయ్ ను సెలెక్ట్ చేశారు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున ఆడిన విషయ తెలిసిందే. తాజాగా ఆంధ్రా ప్రీమియర్ లీగ్లో స్థానం దక్కించుకున్నాడు.

ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పింఛన్లు, అన్నకాంటీన్లు, మున్సిపల్ సేవలు, మహిళలపై నేరాలు, డ్రగ్స్ అరికట్టే విషయంలో ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలన్నారు.

రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్న 10% మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అట్టడుగున ఉన్న 20% మందిని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. మంగళగిరి సచివాలయం నుంచి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్లో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులతో సమీక్షించారు. పి4 సర్వేకు మార్గదర్శకాలు సిద్ధం చేశామని ఈనెల 15లోగా పూర్తి చేసి 19వ తేదీ కల్లా సిద్ధంగా ఉండాలన్నారు.

శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు అధికారులు కోరారు. ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్యసేవలో కాంట్రాక్టు ప్రాతిపదికన 14 డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు డిగ్రీ, ఆపైన విద్యార్హత కలిగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన వారు ఈ నెల 4వ తేదీ నుంచి 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్గా చల్లా కళ్యాణినిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె శ్రీకాకుళం గ్రామీణ మండలంలోని ఒప్పంగి గ్రామానికి చెందినవారు. 2023 బ్యాచ్లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్లో చేరారు. గతంలో కర్నూలులో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలో అసిస్టెంట్ కలెక్టర్గా విధులు నిర్వహిస్తూ మదనపల్లికి బదిలీ అయ్యారు.

శ్రీకాకుళం జిల్లాలోని పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన కార్యాలయంలో సోమవారం భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా 75 వసంతాలు వేడుకల సందర్భంగా సిక్కోలు జిల్లా చరిత్ర, అభివృద్ధి, నాగరికత, పల్లె సాంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలు ఇతర ముఖ్యమైన అంశాలను హైలైట్ చేసేలా వీడియో రూపొందించాలని కలెక్టర్ సూచించారు. వీరితో పాటు DRO వెంకటేశ్వరరావు ఉన్నారు.

నరసన్నపేట: అనారోగ్య సమస్యలతో ఒకరి ఆత్మహత్య
జిల్లాలో పలుచోట్ల మొబైల్ ఫోన్లు తిరిగి ఇచ్చేసిన అంగన్వాడీ సిబ్బంది
SKLM: జర్నలిస్టుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి
శ్రీకాకుళం: ఎస్పీ గ్రీవెన్స్కు 48 వినతులు
ఆముదాలవలస: 1.66 లక్షల ఆర్థిక సహాయం అందజేత
తాగునీటి సమస్యను పరిష్కరించండి: పాతపట్నం ఎమ్మెల్యే
శ్రీకాకుళం: జూనియర్ కళాశాలల వంట బకాయిలు చెల్లించాలి
ఎరువుల సమస్యలపై ఫిర్యాదు చేయండి: కలెక్టర్.

ఎప్పటికప్పుడు అర్జీలు పరిష్కారించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కర వేదిక కార్యక్రమంలో ఆయన జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 140 అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలను సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరించారు.

ఏపీ కానిస్టేబుల్ ఫైనల్ స్కోర్ కార్డ్ గురువారం విడుదలైన విషయం తెలిసిందే. దీంతో శ్రీకాకుళం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థుల్లో ఫుల్ టెన్షన్ నెలకొంది. ఎన్ని మార్కులొచ్చాయి? కటాఫ్ ఎంత ఉండొచ్చనే చర్చ అభ్యర్థుల్లో నడుస్తోంది. మరి మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మన జిల్లాలో కటాఫ్ ఎంత ఉండొచ్చని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

ఎచ్చెర్ల మండలంలో గోపి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం మధ్యాహ్నం ఫరీద్ పేట గ్రామ జంక్షన్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు గోపిపై అతి కిరాతకంగా దాడి చేసి చంపేశారని స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.