Srikakulam

News May 17, 2024

మలేషియాలో గోల్డ్ మెడల్ సాధించిన సిక్కోలు చిన్నారి

image

మందస మండలం దున్నవూరు గ్రామానికి చెందిన దున్న కృష్ణారావు, స్వాతి దంపతుల కుమార్తె దున్న ప్రత్యూష(7) కరాటిలో చిన్న నాటి నుంచి ప్రావీణ్యం సంపాదించింది. ఇటీవల మే 10 నుంచి 12 వ తేదీ వరకు మలేషియాలో జరిగిన ఓపెన్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించింది. ఈ విషయం తెలియడంతో దున్నవూరు గ్రామస్థులు, తల్లిదండ్రులు చిన్నారిని అభినందించారు. కాగా తండ్రి దున్న కృష్ణారావు ఉపాధి నిమిత్తం హైదరాబాదులో ఉన్నారు.

News May 17, 2024

సీతంపేట: దారుణ హత్యకు గురైన గుర్తు తెలియని మహిళ

image

సీతంపేట మండలం పుల్లిపుట్టి గ్రామ సమీపంలో ఉన్న చెరువులో గుర్తుతెలియని మహిళ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం సృష్టించింది. అటుగా వెళ్తున్న స్థానికులు మహిళలు మృతదేహాన్ని చూసి భయాందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News May 17, 2024

అర్ధరాత్రి శ్రీకాకుళంలో దారుణ హత్య

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని గూనపాలెంలో దారుణ హత్య జరిగింది. స్థానికంగా నివాసముంటున్న సీర సురేశ్ (34) గురువారం అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు అతడి గొంతు కోసి హతమార్చారు. మృతుడు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు.

News May 17, 2024

టెక్కలి: అమ్మవారి విగ్రహాల ధ్వంసం

image

టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలోని జీడి పేట గిరిజన గ్రామం సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లి ఆలయంలోని విగ్రహాలను 2 రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు శుక్రవారం నాటికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విగ్రహాలు ధ్వంసం చేయడం చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది. టెక్కలి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించినట్లు సమాచారం.

News May 17, 2024

SKLM: వికసించిన ‘మే’ పుష్పం

image

శ్రీకాకుళం జిల్లా నౌపడ సర్పంచ్ పిలకా బృందాదేవి, రవికుమార్ రెడ్డి ఇంటి ఆవరణలో గురువారం అరుదైన ‘మే’ పుష్పం వికసించింది. ఏడాదిలో ఒక్కసారి, ఒక పుష్పం మాత్రమే వికసిస్తుంది. విషయం తెలిసి ఈ పుష్పాన్ని చూసేందుకు గ్రామస్థులు వస్తున్నారు. ఇది ప్రతికూల వాతావరణంలో, ఇసుక నేలల్లో పెరిగి ఎండ వేడిమికి మే నెలలో మాత్రమే పూస్తుంది. అందువల్ల దీనిని మే పుష్పంగా పిలుస్తుంటారు.

News May 17, 2024

కంచిలి: మకరాంపురం క్రీడాకారుడు ఏపీఎల్‌కు ఎంపిక

image

కంచిలి మండలం మకరంపురం గ్రామానికి చెందిన బెందాళం సాత్విక్ ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్ 2024 కు ఎంపికయ్యారు. ఏపీఎల్‌కు జరిగిన వేలం పాటలో బెందాళం సాత్విక్ 1.6 లక్షలకు ఉత్తరాంధ్ర లయన్స్ తరఫున ఆడబోతున్నట్లు సాత్విక్ తండ్రి భోగేశ్  తెలిపారు. ఈ మేరకు మకరంపురం గ్రామంలో పలువురు క్రీడాకారులు అభినందనలు తెలిపారు.

News May 16, 2024

శ్రీకాకుళం: TODAY TOP NEWS

image

*టెక్కలి:130పైగా స్థానాల్లో విజయం: అచ్చెన్నాయుడు *రాజాంలో పైప్‌లైన్‌కు మరమ్మతులు *నరసన్నపేటలో అక్రమ నిర్మాణాలను అడ్డుకున్న అధికారులు *గార:కూర్మనాథుని కల్యాణోత్సవం ప్రారంభం *భామిని: వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడి మృతి *ఇచ్ఛాపురం: బ్యాగ్ కోసం వెళ్తే.. బైక్‌లో ఉన్న డబ్బు కొట్టేశారు * కౌంటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: కలెక్టర్ *కోటబొమ్మాళి: టీడీపీ నాయకులు నా కుటుంబంపై దాడి చేశారు: వైసీపీ ఏజెంట్

News May 16, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణ విజయవంతంపై కలెక్టర్ ప్రశంస

image

ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో జిల్లా ప్రజల సహాయ, సహకారాలు, భాగస్వామ్యం మరువలేనిదని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. ముఖ్యంగా అధికారుల సమన్వయం.. సమష్టి కృషితోనే అది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు.

News May 16, 2024

శ్రీకాకుళం: ఎన్నికలు ముగిస్తాయని నిర్లక్ష్యం వద్దు: డీఐజీ

image

ఈ నెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికలు తరువాత జరిగిన సంఘటనలు, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై విశాఖపట్నం రేంజ్ పరిధిలోని శ్రీకాకుళం, పలు జిల్లాల ఎస్పీలతో విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని VZM జిల్లా పోలీసు కార్యాలయంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికల తరువాత మన ప్రాంతం ప్రశాంతంగా ఉందన్న నిర్లక్ష్యంవద్దని, మరో 15రోజులు ప్రతీ ఒక్కరూ ఇదే స్ఫూర్తి, నిబద్ధతతో పని చేయాలని ఆదేశించారు. ఎస్పీ రాధిక ఉన్నారు.

News May 16, 2024

ఎచ్చెర్ల: స్ట్రాంగ్ రూములు ఏఎస్పీ పరిశీలన

image

ఎచ్చెర్లలోని శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను గురువారం ఉదయం ఏఎస్పీ ప్రేమ కాజల్ సందర్శించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం స్ట్రాంగ్ తనిఖీ చేపట్టి రూమ్స్ వద్ద భద్రత పరమైన అంశాలపై గార్డు, సిబ్బందికి పలు అంశాలు పై దిశానిర్దేశం చేశారు. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె ఆదేశించారు.