Srikakulam

News May 16, 2024

విశాఖలో యాక్సిడెంట్.. వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు మృతి

image

<<13252907>>మధురవాడ<<>>లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉత్తరాంధ్ర వెంకటేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు గుమ్మడి మధు (51) మృతి చెందారు. భామిని మండలం కాట్రగడకు చెందిన మధు విశాఖలో స్థిరపడ్డారు. నగరంలో పని ముగించుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ఎండాడ నుంచి ఆనందపురం వైపు వెళ్తున్న లారీ ఆయనను ఢీకొట్టింది. జీవీఎంసీ చెత్త తరలించే లారీగా సీసీ కెమెరాలో పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 16, 2024

శ్రీకాకుళం: డిగ్రీ ఫలితాల్లో పాసైన వారి వివరాలు

image

డా. బి.ఆర్ అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను బుధవారం వర్శిటీ అధికారులు విడుదల చేశారు. మొత్తం 8,299 మంది విద్యార్థుల్లో 4,911 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. బీఏ కోర్సులో 884 మందికి 271 మంది, బీకాంలో 1,365 విద్యార్థులు పరీక్ష రాయగా 591, బీఎస్సీలో 5,641 మందికి 3,754 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వర్శిటీ అధికారులు వెల్లడించారు.

News May 16, 2024

130పైగా స్థానాల్లో విజయం: అచ్చెన్నాయుడు

image

సార్వత్రిక ఎన్నికల్లో కూటవి విజయం తథ్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 130కి పైగా స్థానాల్లో విజయం సాధింస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అవినీతి, అరాచకాలతో విసిగిపోయిన ప్రజలు వైసీపీపై తమ వ్యతిరేకతను ఓటు ద్వారా తెలిపారన్నారు. పార్వతీపురంలో ఓ కార్యక్రమానికి బుధవారం హాజరైన ఆయన.. విలేకర్లతో ఈ వ్యాఖ్యలు చేశారు.

News May 16, 2024

SKLM: స్ట్రాంగ్ రూముల భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

image

ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సందర్శించే భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కేంద్ర పోలీస్ బలగాలు సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ఠ బందోబస్తు, 24×7 సీసీ కెమెరాల పర్యవేక్షణ పై ఎస్పీ ఆరా తీశారు.

News May 15, 2024

ఎచ్చెర్ల: డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను ఎగ్జామినేషన్ డీన్ ఎస్ ఉదయ్ భాస్కర్ బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jnanabhumi.ap.gov.in/ పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను నమోదు చేసి ఫలితాలను చూడవచ్చని ఆయన అన్నారు.

News May 15, 2024

శ్రీకాకుళం: ఓటరు ఎటువైపు?

image

ఎన్నికలలో పోలింగ్ ప్రక్రియపై విభిన్న ఊహాగానాలు, విశ్లేషణలు చక్కర్లు కోడుతున్నాయి. శ్రీకాకుళంలో సోమవారం ఉదయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుబ్యాంకు బాగా పోలైందని, సాయంత్రం నుంచి ప్రభుత్వ అనుకూల ఓటింగ్ భారీగా నమోదయిందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. పోలింగ్ విధానాన్ని విశ్లేషిస్తూ ఆయా పార్టీల నాయకులు విజయం తమదంటే.. తమదంటూ ప్రచారం చేసుకుంటున్నారు. మరి మీ జిల్లా ఓటర్లు ఎటువైపు ఉన్నారో కామెంట్ చెయ్యండి?

News May 15, 2024

SKLM: స్ట్రాంగ్ రూముల భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ పరిశీలన

image

ఈనెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఈవీఎంలను భద్రపరిచే ఎచ్చెర్ల శివాని ఇంజినీరింగ్ కళాశాలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములను బుధవారం జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సందర్శించే భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం కేంద్ర పోలీస్ బలగాలు సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించి స్ట్రాంగ్ రూమ్ కి నలువైపులా పోలీస్ పటిష్ఠ బందోబస్తు, 24×7 సీసీ కెమెరాల పర్యవేక్షణ పై ఎస్పీ ఆరా తీశారు.

News May 15, 2024

సంతబొమ్మాళి: APRJCలో సత్తా చాటిన విద్యార్థినులు

image

సంతబొమ్మాళి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెద్దిన భవానిAPRJC బైపీసీలో రాష్ట్రస్థాయిలో 53వ ర్యాంకు సాధించింది. పాలిటెక్నిక్‌లో 550 ర్యాంకు సాధించింది. అలాగే బడే నరసాపురానికి చెందిన సుంకరి రజిత ఏపీఆర్‌జె‌సీ బైపీసీలో 143 ర్యాంక్ సాధించింది. వీరికి గ్రామ సర్పంచ్ దుక్క భూషణ్ రెడ్డి, షణ్ముఖ మాస్టర్, ఫాల్గుణ రెడ్డి, సిమ్మాన్న మాస్టర్‌లు మిఠాయిలు తినిపించి అభినందించారు.

News May 15, 2024

నిప్పులకొలిమిలా శ్రీకాకుళం

image

శ్రీకాకుళం జిల్లా నిప్పులకొలిమిలా మారింది. ఉదయం నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలు రోజురోజుకీ తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రెండు రోజులుగా వాతావరణంలో వేడి ఎక్కువ కావడంతో వృద్ధులు, చిన్నారులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

News May 15, 2024

శ్రీకాకుళం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మందస మండలం బిన్నలమదనాపురం-బాలిగాం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కంచిలి మండలం గుండమూరుకు చెందిన లక్ష్మణరావు(43) 20 ఏళ్లుగా పలాసలో ఉంటున్నాడు. ఈ క్రమంలో ఓటు వేయడానికి 13న బైక్‌పై సొంత గ్రామానికి వచ్చాడు. ఓటు వేసిన అనంతరం తిరుగు ప్రయాణంలో ఆయన బైక్‌ను కారు ఢీకొంది. ప్రమాదంలో లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య హైమావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.