India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో గణపతి నవరాత్రుల ఉత్సవాలకు సింగిల్ విండో ద్వారా అనుమతుల కోసం ఇప్పటి వరకూ 1302 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. కలెక్టరేట్లో గురువారం సాయంత్రం జరిగిన వినాయక చవితి ఉత్సవాల అనుమతులు, ముందస్తు చర్యలు, నిమజ్జనం ఏర్పాట్లపై పలాస, టెక్కలి, శ్రీకాకుళం ఆర్డీవోలు, డీఎస్పీలు, మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
సంతబొమ్మాలి మండలం మేఘవరం సమీపంలో బంజీరు తోట వద్ద గురువారం 104 వాహనం ద్వారా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. అయితే 104 వాహనంలో నాగుపాము ఒక్కసారిగా కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు. అది కాస్త ఇంజిన్ లోకి వెళ్లి ఇరుక్కుపోవడంతో దాన్ని బయటికి తీసేందుకు ప్రయత్నిస్తూ..శిబిరాన్ని నిలిపివేసినట్లు సిబ్బంది తెలిపారు.
ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గురువు ప్రభావం ఉంటుంది. విద్యార్థి భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఆ గురువు ఒక మార్గదర్శకుడిలా ఉంటాడు. అలాంటి గురువులను స్మరించుకునే ఈ రోజు గురుపూజోత్సవం జరుపుకుంటున్నాం. శ్రీకాకుళం జిల్లాలో 78 మంది ఉపాధ్యాయులను ఈ రోజు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులతో సత్కరించనున్నారు. మరి మీ విద్యార్థి జీవితంలో మీకిష్టమైన ఉపాధ్యాయుడు ఎవరని భావిస్తున్నారో కామెంట్ చేయండి.
శ్రీకాకుళం జిల్లాలో గంజాయి సరఫరాను అరికట్టేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. ఈ మధ్య ఇచ్ఛాపురం, టెక్కలిలో 196 కిలోల గంజాయి లభ్యమైంది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి సరకు రాకుండా ప్రత్యేక బృందాన్ని నియమించి దాడులు నిర్వహించేందుకు సిద్దమయ్యామని తెలిపారు. అయితే నగరానికి చెందిన 9మందిని అందుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
నాగావళి లక్షన్నర క్యూసెక్కుల ప్రవాహానికొస్తే సిక్కోలులో బెజవాడ తరహా ముంపు రానుంది. కృష్ణా పార్కు, రైతు బజారు, డీసీసీబీ, బాకర్ సాహెబ్ పేట, నీలమ్మ, చౌదరి సత్యనారాయణ, నాయుడు చెరువు గట్టు, విశాఖ ఏ,బీ,ఫ్రెండ్స్, వంశధార,వరం,మహాలక్ష్మినగర్ కాలనీలు, ఆర్టీసీ కాంప్లెక్స్, పొట్టి శ్రీరాములు, అరసవల్లి మిల్లు, డే అండ్ నైట్ కూడలిలు, చిన్నబరటాం, మండల,రెల్ల, సానా,గూనపాలెం వీధులు ప్రతి ఏటా ముంపునకు గురవుతున్నాయి.
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం జిల్లాలో పర్యటిస్తారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర మంత్రి గురువారం ఉదయం న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకొని, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియం గురుపూజోత్సవం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని తెలిపారు.
ఓ టెక్కలి కుర్రాడు హీరోగా మారాడు. అతని సినిమా శుక్రవారం విడుదల కానుంది. ఆ హీరో కోళ్ల గణేశ్(చిన్నా). ఆ సినిమా స్పీడ్ 220. టెక్కలికి చెందిన గణేశ్ గత కొద్ది రోజులుగా చిత్రసీమలో రాణించడానికి ప్రయత్నించాడు. చివరకు హీరోగా మారాడు. ఇదే సినిమాలో గణేశ్తో పాటు హేమంత్ రెడ్డి మరో హీరోగా నటించారు. స్నేహం, ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్తో సినిమా తీశామని.. అందరూ ఆదరించాలని గణేశ్ కోరాడు.
జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా 78 మంది ఎంపికయ్యారని డీఈఓ తిరుమల చైతన్య బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హెచ్ఎం క్యాటగిరిలో 9 మంది, ఎస్ఏ(స్కూల్ అసిస్టెంట్) కేటగిరిలో 32 మంది, ఎస్జీటీ కేటగిరిలో 27 మంది, పిఈటి/పిడి కేటగిరీలో 8 మంది, కేజీబీవీ కేటగిరిలో ఇద్దరు ఎంపికయ్యారని తెలిపారు. వీరికి ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా సత్కరించి అవార్డులు ప్రదానం చేస్తామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 7వ తేదీన ప్రభుత్వ వైన్స్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా బంద్ చేపట్టనున్న విషయం తెలిసిందే. అయితే విజయవాడలోని వరదల కారణంగా బంద్ను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం ఏపీఎస్ బిసియల్ డిపో మేనేజర్ సుబ్బారావుకు బుధవారం వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.
తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి అవసరమయ్యే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ టెండర్లు దక్కించుకున్నారు. మూడు రోజుల కిందట గ్లోబల్ విధానంలో టెండర్లు పిలిచారని అన్నారు. రోజుకు మూడు టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూ తయారీకి అవసరమవుతుందన్నారు. సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతికి పలాస జీడిపప్పు సరఫరా అయిందని ఆయన గుర్తు చేశారు.
Sorry, no posts matched your criteria.