Srikakulam

News May 14, 2024

శ్రీకాకుళం: ఓటింగ్‌లో కదం తొక్కిన మహిళలు

image

జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో మహిళలు భారీగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాత్రి 10.30 గంటల సమయానికి మొత్తం 13,93,858 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోగా వారిలో అత్యధికంగా 7,21,692 మంది మహిళలు ఓటు వేశారు. వారి తర్వాత 6,72,149 మంది పురుషులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 74.30 శాతం పోలింగ్ నమోదైదనట్లు అధికారులు తెలిపారు.

News May 14, 2024

శ్రీకాకుళంలో పెరిగిన ఓటింగ్ శాతం

image

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సోమవారం అర్ధరాత్రి వరకు జరిగిన పోలింగ్‌లో 75.41శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా 2019లో 72.2 శాతంగా పోలింగ్ నమోదయింది. యువత, ఉద్యోగులు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొనడంతో ఈ సారి ఓటింగ్ శాతం పెగిరిందని అధికారులు తెలిపారు. ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

News May 14, 2024

ఎచ్చెర్ల నియోజకవర్గంలో అత్యధికంగా 87శాతం పోలింగ్

image

శ్రీకాకుళం జిల్లాలో తాజా సమాచారం ప్రకారం అత్యధికంగా ఎచ్చెర్ల నియోజకవర్గంలో 87శాతం పోలింగ్ నమోదవ్వగా, అత్యల్పంగా శ్రీకాకుళంలో 65.85 శాతం పోలింగ్‌ నమోదయింది. ఇచ్ఛాపురం-69.52, నరసన్నపేట-80.50, పలాస-74.94, పాతపట్నం-70.24, టెక్కలి-78.58, పాలకొండ-74.03, రాజాం-75.53, ఆముదాలవలస 79.49 శాతంగా నమోదయింది. కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైన నేపథ్యంలో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

News May 13, 2024

శ్రీకాకుళం: ముగిసిన ఎన్నికలు.. రిసెప్షన్ సెంటర్‌కు EVMలు

image

సార్వత్రిక ఎన్నికలు – 2024 శ్రీకాకుళం జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించారు. ఇప్పటికే ముగిసిన ఎన్నికల ప్రక్రియలో భాగంగా పోలింగ్ కేంద్రాలలో ఉన్న EVMలు జిల్లాలో ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలో శివాని ఇంజినీరింగ్ కళాశాలలో రిసెప్షన్ సెంటర్‌కు చేరుకుంటున్నాయి.

News May 13, 2024

శ్రీకాకుళంలో @ 8.43కు పోలింగ్ శాతం 

image

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం రాత్రి 8.43 గంటలకు మొత్తం 72.90 శాతం నమోదైందని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం 67.01%, పలాస 72.13%, టెక్కలి 76.51%, పాతపట్నం 68.66%, శ్రీకాకుళం 66.07%, ఆమదాలవలస 77.62%, ఎచ్చెర్ల 78.83%, నరసన్నపేట 79.18% నమోదైందని వారు పేర్కొన్నారు.. ఇప్పటికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు పూర్తి అయ్యాయాయి. 

News May 13, 2024

శ్రీకాకుళంలో @ 7 గంటలకు పోలింగ్ శాతం

image

శ్రీకాకుళం జిల్లాలోని రాత్రి 7 గంటలకు మొత్తం 71.25 పోలింగ్ శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం 65.86%, పలాస 70.21%, టెక్కలి 74.50%, పాతపట్నం 68.04%, శ్రీకాకుళం 64.61%, ఆమదాలవలస 74.66%, ఎచ్చెర్ల 77.30%, నరసన్నపేట 77.29% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

News May 13, 2024

శ్రీకాకుళం జిల్లాలో 5 గంటలకు పోలింగ్ శాతం

image

శ్రీకాకుళం నియోజకవర్గంలో సాయంత్రం 5 గంటలకు మొత్తం 67.48శాతం పోలింగ్ నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం : 64%, పలాస:69.1%, టెక్కలి: 73.00%, పాతపట్నం: 63.25%, శ్రీకాకుళం 61.00%, ఆమదాలవలస: 70.18%, ఎచ్చెర్ల: 70.00%, నరసన్నపేట: 71.46% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

News May 13, 2024

రాజాం: విధి నిర్వహణలో కుప్పకూలి పడిపోయిన టీచర్

image

రాజాం ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న టీచర్ రమణ ఉష్ణోగ్రత తీవ్రత, ఒత్తిడికి గురై సోమవారం అక్కడకక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే తోటి సిబ్బంది హుటాహుటిన రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య కోసం విజయనగరం తీసుకెళ్లారు. టీచర్ రమణ విజయనగరం వాసి.

News May 13, 2024

శ్రీకాకుళం: 3 గంటలకు పోలింగ్ శాతం

image

శ్రీకాకుళం నియోజకవర్గంలో మధ్యాహ్నం 3 గంటలకు మొత్తం 54.87 పోలింగ్ శాతం నమోదైందని సోమవారం అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇచ్ఛాపురం :52.04%, పలాస:52.48%, టెక్కలి: 60.00%, పాతపట్నం: 53.45%, శ్రీకాకుళం 54.00%, ఆమదాలవలస: 56.16%, ఎచ్చెర్ల: 54%, నరసన్నపేట: 57.13% నమోదైందని వారు పేర్కొన్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

News May 13, 2024

శ్రీకాకుళం: స్పీకర్ సతీమణి వ్యవహరంపై ఈసీకి ఫిర్యాదు

image

ఆమదాలవలస నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తమ్మినేని సీతారాం సతీమణి అయిన తమ్మినేని వాణిశ్రీ స్థానిక పోలింగ్ బూత్‌లు 158, 159లో రిగ్గింగ్‌కు పాల్పడేందుకు ప్రయత్నించడం చాలా దారుణమని టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఈసీకి లేఖ రాసినట్లు పేర్కొన్నారు. శాంతియుతంగా ఎన్నికలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరినట్లు పేర్కొన్నారు.