India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లా బొరివంకకు చెందిన మజ్జి శివ పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి అక్కడ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఇటీవల మృతిచెందాడు. అతని మృతదేహం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. పోలీసు, ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దుబాయ్ కోర్టు తగిన నిర్ణయం తీసుకోవడానికి రెండు వారాల సమయం పడుతుందని తెలుస్తోంది. దీంతో ఇక్కడ శివ బంధువులు చివరి చూపు కోసం ఎదురుచూస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి రెండో విడత కౌన్సిలింగ్లో సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. గత నెల 24 నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా 29న సీట్లను కేటాయించారు. సీటు పొందిన విద్యార్థులు కాలేజీల్లో చేరేందుకు మంగళవారంతో గడువు ముగుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 149 డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
దుబ్బు దశలో ఉన్న వరి పైరు ఇటీవలే కురిసిన వర్షాలకు నీట మునిగింది. ఈక్రమంలో పంటకు రైతులు బూస్టర్ ఎరువులు వేయాలని శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ బాబు ఒక ప్రకటనలో సూచించారు. ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలని శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి చెప్పారు. ఎటువంటి సందేహాలు ఉన్నా రైతులు తమను సంప్రదించాలని కోరారు.
దుబ్బు దశలో ఉన్న వరి పైరు ఇటీవలే కురిసిన వర్షాలకు నీట మునిగింది. ఈక్రమంలో పంటకు రైతులు బూస్టర్ ఎరువులు వేయాలని శ్రీకాకుళం మండలం రాగోలు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ బాబు ఒక ప్రకటనలో సూచించారు. ఎకరాకు 30 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ వేయాలని శాస్త్రవేత్త భాగ్యలక్ష్మి చెప్పారు. ఎటువంటి సందేహాలు ఉన్నా రైతులు తమను సంప్రదించాలని కోరారు.
తుపాను హెచ్చరికల నేపధ్యంలో గత మూడు నాలుగు రోజులుగా అన్నదాతలు ఆందోళన చెందారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు తుపాను ముప్పు తప్పిందనే సమాచారంతో పంట సస్యరక్షణ చర్యలు ముమ్మరం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనల ప్రకారం మడుల్లో నీటి నిల్వ అధికంగా లేకుండా లోతట్టు ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు. ఇదే సమయంలో పలు చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నందున రసాయన మందుల పిచికారీ పనుల్లో అన్నదాతలు నిమగ్నమయ్యారు.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధిపై ఇంటర్నేషనల్ పరిశోధనలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీ పర్యావరణ నిపుణుడు ప్రొఫెసర్ లెక్స్ వాన్ జీన్ సోమవారం పలాసకు వచ్చారు. కాశీబుగ్గ కిడ్నీ రీసెర్చ్ సెంటర్లో పరిశోధనలు చేయనున్న టీంకు ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అలాగే కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పరిశోధనకు అవసరమైన పరికరాలను సైతం జీన్ అమెరికా నుంచే తీసుకువచ్చారు. స్థానికంగా ఉన్న నీరు, ధూళిపై పరిశోధనలు చేస్తారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని మండలాలలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తెలిపారు. సోమవారం ఈ సందర్భంగా స్థానిక కలెక్టర్ కార్యాలయంలో పొలం పిలుస్తుంది పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయంలో మెలకువలు తెలిపేందుకు వ్యవసాయ అధికారులు చొరవ చూపాలని సూచించారు. వర్షాల వల్ల ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించాలన్నారు.
వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానంను అందుబాటులోకి తీసుకువచ్చిందని శ్రీకాకుళం రెవెన్యూ అధికారి ఎమ్ అప్పారావు తెలిపారు. ఈ మేరకు తన ఛాంబర్లో సోమవారం సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. శ్రీకాకుళం ఆర్డీఒ సి హెచ్ రంగయ్య, డీఎస్పీ వివేకానంద, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఓబులేసు, టౌన్ సీఐలు ఉన్నారు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్.. మీకోసం ఫిర్యాదుల పరిష్కారం వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అర్జీదారుల నుంచి 132 విజ్ఞప్తులను స్వీకరించినట్లు వెల్లడించారు. ఇందులో రెవెన్యూ, పౌరసరఫరాల సేవలు, పెన్షన్లు, భూ సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర ఫిర్యాదులు ఉన్నాయన్నారు. సంబంధిత అధికారులకు వీటిని పరిష్కరించాలని ఆదేశించారు
శ్రీకాకుళంలోని జెడ్ పి సమావేశ మందిరంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ‘పొలం పిలుస్తోంది’అనే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో రైతులకు వ్యవసాయ సాగులో నూతన పద్ధతుల వినియోగంపై అవగాహన కల్పిస్తారన్నారు. తద్వారా వ్యవసాయం లాభసాటిగా మారుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Sorry, no posts matched your criteria.