Srikakulam

News September 2, 2024

శ్రీకాకుళం: 41 ఫిర్యాదులు స్వీకరణ- ఎస్పీ  

image

ప్రజా పిర్యాదు నమోదు మరియు పరిష్కార వేదికలో ఎస్పీ మహేశ్వరరెడ్డి 41 ఫిర్యాదులను సోమవారము శ్రీకాకుళంలో స్వీకరించారు. సివిల్ తగాదాల పై 15, ఆస్తి నేరాలపై 02, మోసపూరితమైన 03, కుటుంబ తగాదాలపై 05, ఇతరత్రా అంశాలపై 10, పాత ఫిర్యాదులు 6 అందాయి.
జిల్లా ఎస్పీతో పాటు శ్రీకాకుళం పట్టణ డీఎస్పీ వివేకానంద ప్రజలు నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులు పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News September 2, 2024

శ్రీకాకుళం డీఎంకు బంద్ నోటీసులు అందజేసిన ఉద్యోగులు

image

ఏపీ స్టేట్ బెవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 07 శనివారం రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాకుళం డివిజన్ డీఎం సుబ్బారావుకు ఉద్యోగులంతా బంద్ నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

News September 2, 2024

SKLM: జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి

image

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, విభిన్న ప్రతిభావంతుల శాఖ, జిల్లా ఉపాధి శాఖ వారి సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరు 3 వ తేదీన నిర్వహించబడుతున్న జాబ్ మేళా ప్రచార పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చేతులమీదుగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

News September 2, 2024

శ్రీకాకుళం: 7న మద్యం దుకాణాల బంద్

image

శ్రీకాకుళం జిల్లాలో ఈనెల 7న మద్యం షాపులు బంద్ కానున్నాయి. నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్‌బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని ఆరోపించారు.

News September 2, 2024

శ్రీకాకుళం: తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు

image

శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న ముగ్గురు తహశీల్దార్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతులు వచ్చాయి. రాష్ట్రంలో పలువురిని ఉద్యోగోన్నతి లభించగా.. వారిలో ముగ్గురు మన జిల్లాకు చెందిన తహశీల్దార్లు ఉన్నారు. సాదు దిలీప్ చక్రవర్తి, పప్పల వేణుగోపాలరావు, ఆమెపల్లి సింహాచలం ప్రమోషన్లు పొందారు.

News September 2, 2024

సెలవు విషయాన్ని ముందే చెప్పండి: శ్రీకాకుళం కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. సెలవు ఉందనే విషయాన్ని అన్ని స్కూళ్లు, కాలేజీల యజమానులు ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలని ఆదేశించారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి విద్యా సంస్థలు నిర్వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదేశించారు.

News September 2, 2024

గణేష్ ఉత్సవాలకు సింగల్ విండో సిస్టం: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల అనుమతి కొరకు https://ganeshutsav.net/ లేదా 7995095800కు వాట్సాప్‌లో మెసేజ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.

News September 1, 2024

శ్రీకాకుళం: ‘సోమవారం జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు’

image

భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు సోమవారం సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి, రీజినల్ ఇంటర్మీడియట్ అధికారికి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు.

News September 1, 2024

భారీ వర్షాలు.. శ్రీకాకుళం జిల్లా కంట్రోల్ రూం నంబర్లు ఇవే

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్‌హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్: 08942240557

News September 1, 2024

శ్రీకాకుళం: తీరం దాటిన వాయుగుండం 

image

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఒడిశా కళింగపట్నం మధ్యలో తీరం దాటింది. దీంతో రాబోయే 24 గంటలు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు. మరోవైపు వాయుగుండాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.