Srikakulam

News May 11, 2024

శ్రీకాకుళం: సకల సౌకర్యాలతో పోలింగ్ కేంద్రాలు

image

పోలింగ్ శాతం పెంచేందుకు వీలుగా ఓటర్లను ఆకర్షించేలా ఎంపిక చేసిన పోలింగ్ కేంద్రాల్లో సకల సౌకర్యాలు కల్పించమని కలెక్టర్ మనజీర్ జీలాని సమూన్ పేర్కొన్నారు. 8 నియోజకవర్గాల్లో 31 పోలింగ్ కేంద్రాలను ప్రత్యేకంగా సిద్ధం చేశామన్నారు. యువత కోసం నాలుగు, మహిళల కోసం పింక్ స్టేషన్లు 8, దివ్యాంగుల కోసం రెండు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి వీల్ చైర్లు సిద్ధం చేశామని కలెక్టర్ వెల్లడించారు.

News May 11, 2024

శ్రీకాకుళం: ప్రచారం @ మరో 2 గంటలే

image

ఎన్నికల ప్రచార పర్వం మరో 2 గంటల్లో ముగియనుంది. అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. అభ్యర్థుల తరఫున జగన్, చంద్రబాబు, పవన్ రాకతో శ్రీకాకుళం జిల్లా వార్తల్లో నిలిచింది. ఎన్నికల్లో మొదట అసమ్మతి సెగ ఉండగా తర్వాత సద్దుమణిగింది. ఈ రోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగియనుండగా అభ్యర్థులు ప్రచారాలను ముమ్మరం చేశారు.

News May 11, 2024

శ్రీకాకుళం: 2000 మంది పోలీసులతో బందోబస్తు: ఎస్పీ 

image

మే13న జరగనున్న పోలింగ్‌కు 2000 మంది పోలీసులు, 11 పారా మిలటరీ బృందాలు, 2 ఫ్లటూన్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జీ.ఆర్ రాధిక శనివారం పేర్కొన్నారు. 7 అంతరాష్ట్ర, 4 అంతర జిల్లాల చెక్‌పోస్టులు పని చేస్తున్నాయన్నారు. నియోజకవర్గానికి మూడు చొప్పున 24 ఎస్ ఎస్టి, ఎఫ్‌ఎస్‌టీ బృందాలు పని చేస్తున్నాయని, ఇప్పటి వరకూ రూ.4.39 కోట్ల విలువైన నగదు, బంగారం, వెండి, మద్యం లాంటివి సీజ్ చేశామని తెలిపారు.

News May 11, 2024

శ్రీకాకుళం: 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు

image

జిల్లాలో 2358 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిలో 298 ప్రాంతాలలో 520 పోలింగ్ స్టేషన్లను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ జీ.ఆర్ రాధిక గుర్తించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంతరాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 268 మంది సెక్టార్ ఆఫీసర్లు, 707 మంది మైక్రో అబ్జర్వర్లు నిరంతరాయంగా పోలింగ్ పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తారు. హింస జరిగే అవకాశం ఉండే పోలింగ్ కేంద్రాల్లో నిఘా ఉందన్నారు.

News May 11, 2024

శ్రీకాకుళం: 1655 పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు

image

జిల్లాలో 70.18 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాటు చేశామని ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ సరళిని లైవ్ ద్వారా జిల్లా కేంద్రంలోని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తామని, మొత్తం 1655 పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ జరుగుతుందన్నారు. నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, ఇంటర్నెట్ ఉండేలా పూర్తి చర్యలు తీసుకున్నామని అన్నారు.

News May 11, 2024

శ్రీకాకుళం: రాజకీయ పార్టీలకు ఎస్పీ సూచనలు

image

పోలింగ్ రోజున పోలింగ్ కేంద్రాల ప్రవేశ మార్గం నుంచి 200 మీటర్ల దూరంలో మాత్రమే తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ రాధిక సూచించారు. ఆ ప్రదేశంలో ఎక్కువమంది గుమిగూడకూడదని, ఆయా నియోజకవర్గాల్లో బయట నియోజకవర్గాల నుంచి వచ్చిన వ్యక్తులు ఎవ్వరూ ఉండేందుకు వీలు లేదని అన్నారు. లాడ్జిల్లో, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌‌‌‌లో ఉండేవారు వెళ్లిపోవాలని ఎస్పీ ఆదేశించారు.

News May 11, 2024

శ్రీకాకుళం జిల్లాలో 18.92 లక్షల ఓటర్లు.. 2,358 పోలింగ్ కేంద్రాలు

image

నిష్పక్షపాతంగా ప్రతీ ఒక్కరూ ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలాని సమూన్ పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలు 2024కు సంబంధించి ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్లపై ఆయన కలెక్టర్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 18.92 లక్షల ఓటర్లకు 2358 పోలింగ్ కేంద్రాలు కేటాయించినట్లు ఆయన స్పష్టం చేశారు.

News May 11, 2024

నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం

image

జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ప్రచారాలు నేటితో ముగియనున్నాయి. ఈ మేరకు మరో 2 రోజులు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిబంధన ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం ముగించాలి. శనివారం సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ప్రచారం ముగియనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోపాటు వైసీపీ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులంతా ముమ్మర ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ మనజీ జిలానీ సమూన్‌ తెలిపారు.

News May 11, 2024

నందిగాం: గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం మద్దిలోడు పేట గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం ఉదయం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.

News May 11, 2024

REWIND: టెక్కలిలో అత్యధిక మెజారిటీ NTRదే..

image

టెక్కలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు గెలుపొందారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలో నిలిచిన ఎన్టీఆర్ 40,890 ఓట్ల మెజారిటీతో టెక్కలి ఎమ్మెల్యేగా గెలిచారు. నాటి నుంచి నేటి వరకు జిల్లాలో ఏ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కూడా అంత మెజారిటీతో గెలవలేదు. ఎన్టీఆర్ పోటీ చేసిన నేలగా టెక్కలికి గుర్తింపు ఉంది.