Srikakulam

News August 30, 2024

శ్రీకాకుళం: అదనపు ఎరువుల కోసం ఆదేశాలు జారీ

image

ఇటీవల శ్రీకాకుళం జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో ప్రజా ప్రతినిధులు అధికారుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు ఎరువుల కొరత అంశాన్ని ప్రస్తావించడంతో స్పందించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మార్క్ ఫెడ్ ఉన్నాతధికారులను గురువారం ఆదేశించారు. జిల్లాకు 820 టన్నుల డిఏపి, 760 టన్నుల యూరియా సరఫరాకు చర్యలు చేపట్టారు. శుక్రవారం నుంచే రైతులకు పంపిణీ చేయాలన్నారు.

News August 30, 2024

కంచిలి: విష జ్వరానికి చిన్నారి బలి

image

కంచిలికి చెందిన ఆటో చోదకుడు లాబాల కామరాజు కుమార్తె ఝాన్సీ (7)కి ఈనెల 14న ఆమెకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు కంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. తీవ్రత ఎక్కువగా ఉండటంతో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలోని కేజీ హెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి కన్ను మూసింది. మండల పరిధిలో విషజ్వరాల వ్యాప్తి పెరుగుతోంది.

News August 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో గురువారం పలు మండలాలలో విస్తారంగా వర్షాలు కురిశాయి. శ్రీకాకుళంలో 26.0 మిల్లీమీటర్లు, ఆమదాలవలస 26.75, సంతబొమ్మాళి 29.5, రణస్థలం 16.0, కవిటి 8.5, పలాస 12.25, నందిగాం 7.5, ఇచ్ఛాపురం 19.75, ఎచ్చెర్ల 17.75, హిరమండలం 5.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయిందని సంబంధిత అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News August 30, 2024

బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి: కలెక్టర్ స్వప్నిల్ 

image

జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని కలెక్టర్‌ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. జిల్లా స్థాయి DCC, DLRC స‌మావేశం క‌లెక్ట‌రేట్లో గురువారం జ‌రిగింది. ఈ స‌మావేశంలో వివిధ స్వ‌యం ఉపాధి ప‌థ‌కాల అమ‌లు, రుణాల‌ మంజూరు, గ‌త‌ త్రైమాసికంలో సాధించిన ప్ర‌గ‌తిపై బ్యాంకులు, ప్ర‌భుత్వ‌ శాఖ‌ల‌వారీగా క‌లెక్ట‌ర్‌ స‌మీక్షించారు.  

News August 30, 2024

శ్రీకాకుళం జిల్లాలో ముమ్మరంగా వాహన తనిఖీలు

image

విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహించి, రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తున్నట్టు ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో లావేరు పోలీసు స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు వెంకటాపురం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీలు నిర్వహించారు. అతివేగం, ఓవర్ లోడ్‌తో వెళ్లిన వాహనాలను గుర్తించి రోడ్డు నియమాలు పాటించాలన్నారు.

News August 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు

image

ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రేపు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.

News August 29, 2024

ప్రతి అర్జీ పరిష్కారం అవ్వాలి: మంత్రి అచ్చన్న

image

సచివాలయంలో ప్రజల నుంచి గురువారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అరాచక పాలనతో నష్టపోయిన పలువురు బాధితులు తమ బాధలు తెలియజేశారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి అర్జీ తప్పకుండా పరిష్కారం అవ్వాలని సూచించారు. అర్జీల పరిష్కరంలో అలసత్వం వహించరాదన్నారు.

News August 29, 2024

రూ.40 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్: కలెక్టర్ దినకర్

image

శ్రీకాకుళం జిల్లాలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా పాత్రునివలసలో కేంద్ర ప్రభుత్వ నిధులతో దీని నిర్మాణం పూర్తి చేసి రెండేళ్లలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పాత్రునివలసలో నిర్మిస్తున్న క్రీడా వికాస ప్రాంగణంతో అన్ని క్రీడాలను ఒకే చోటుకు తీసుకువస్తామని చెప్పారు.

News August 29, 2024

సీఎం చంద్రబాబును కలిసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

సీఎం చంద్రబాబును గురువారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. చంద్రబాబును కలిసినప్పుడల్లా మరింత ఉత్సాహం వస్తుందని సామాజిక మాధ్యమాల్లో కేంద్ర మంత్రి తెలిపారు.

News August 29, 2024

శ్రీకాకుళం: జిల్లాకు మూడు ప్రైవేట్ ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటు

image

శ్రీకాకుళం జిల్లాలో మూడు ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ఎఫ్ఎం సేవలను ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాతృభాషలో స్థానిక కంటెంట్‌ను పెంచడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో పాలసీ కింద 730 ఛానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో త్వరలో జిల్లాలో మూడు ఎఫ్ఎం స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.