Srikakulam

News May 8, 2024

శ్రీకాకుళంలోనే అత్యధిక సర్వీస్ ఓట్లు

image

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 68,185 మంది సర్వీస్ సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకోగా.. వారిలో శ్రీకాకుళం జిల్లా నుంచే అత్యధికంగా 16,448 మంది ఉన్నారు. నేవీ, ఆర్మీ ఎయిర్‌పోర్స్‌తో పాటు సాయుధ దళాలో ఈ జిల్లా నుంచే ఎక్కువ మంది ఎంపికై సేవాలందిస్తుంటారు. పలాసలో 3,030, టెక్కలి 2,919, ఆమదాలవలస 2,240 నరసన్నపేటలో 2,228 మంది ఓటర్లు నమోదు చేస్తుకున్నారు.

News May 8, 2024

SKLM: గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు సీట్ల కేటాయింపు

image

సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు పరీక్ష రాసిన విద్యార్థులు సాధించిన మార్కుల బట్టి సీట్లను కేటాయించినట్లు జిల్లా కో ఆర్డినేటర్ ఎన్.బాలాజీ నాయక్ తెలిపారు. జిల్లాలో 800 సీట్లకు గాను 720 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన వివరించారు. వారి ఫోన్‌లకు సందేశాలను పంపించామని స్పష్టం చేశారు. ఈ నెల 9వ తేదీలోగా విద్యార్థులు ఆయా గురుకులాల్లో వివరాలు తెలపాలన్నారు.

News May 8, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం

image

ఎన్నికల నియమ నిబంధనల మేరకు ముందస్తు ప్రణాళికలు పూర్తి చేసి, మే 13న ఎన్నికల నిర్వహణకు అన్ని విధాల సర్వ సన్నద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయ సమావేశం మంగళవారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి ఆయా నోడల్‌ అధికారుల టీంలు సమన్వయంతో అప్రమత్తంగా ఉంటూ పని చేయాలని స్పష్టం చేశారు.

News May 8, 2024

శ్రీకాకుళం: సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా

image

సోషల్‌ మీడియా పోస్టులపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, కంట్రోల్ రూమ్ సిబ్బంది మరింత అప్రమత్తంగా పనిచేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోనీ ఆదేశించారు. మంగళవారం సాయంత్రం ఆయన శ్రీకాకుళం కలెక్టరేట్‌లోని కంట్రోల్ రూమ్ సందర్శించారు. ఎంసీసీ నోడల్‌ అధికారులతో ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వాట్సాప్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా యాప్స్‌పై ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

News May 7, 2024

ఉద్దాన ప్రాంత సమస్యలను తీర్చాం: సీఎం జగన్

image

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కట్టుబడింది వైసీపీ ప్రభుత్వమేనని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఇచ్చాపురం సభలో ఆయన మాట్లాడుతూ..‘రూ.4,400 కోట్లతో మూలపేట పోర్ట్ దగ్గర పనులు, ఉత్తరాంధ్రలో 4 మెడికల్ కాలేజీలు, సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం, కురుపాంలో ట్రైబల్ ఇంజినీరింగ్, ITDA పరిధిలో 5 మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌లు, ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు.. ఇవన్నీ చేసింది వైసీపీ ప్రభుత్వంలోనే’ అని తెలిపారు.

News May 7, 2024

శ్రీకాకుళం పార్లమెంట్ ఓటర్లు ఏ పార్టీ వైపో.!

image

సార్వత్రిక ఎన్నికలు-2024 కి సంబంధించి జిల్లాలో కొత్త ఓటర్ల జాబితా ఖరారైంది. జిల్లా మొత్తం 18,75,934 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషుల ఓటర్లు 9,29,859 మంది ఉన్నారు.. కాగా 9,45,945 మంది మహిళా ఓటర్ల ఉండగా ఇతరులు 130 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ కొత్త జాబితాలో పురుషుల కంటే 16,086 మంది మహిళలే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ కొత్త ఓటర్ల ఏ పార్టీకి మద్దతు తెలుపుతారో వెచి చూడాల్సిందే..!

News May 7, 2024

శ్రీకాకుళం: కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన రద్దు

image

శ్రీకాకుళం జిల్లాలో ఎచ్చెర్ల మండలం అరిణాం అక్కివలస వద్ద ఎన్నికల ప్రచార సభ వాతావరణం పరిస్థితుల దృష్ట్యా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పర్యటన రద్దు అయ్యిందని ఎచ్చెర్ల నియోజకవర్గ కూటమి అభ్యర్థి నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు. కార్యకర్తలు, పార్టీ శ్రేణులు గమనించాలని కోరారు.

News May 7, 2024

శ్రీకాకుళం: నలుగురు వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు

image

జిల్లా వైద్యారోగ్య శాఖలో నలుగురు ఉద్యోగుల తీరు వివాదాస్పదమైంది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల బృందం సోమవారం పలు ఆసుపత్రులలో తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో జనసేన నాయకుడు దానేటి శ్రీధర్‌కు చెందిన ఆస్పత్రులను కూడా తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆయనతో ఫొటో దిగడంతో నలుగురు వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చామని డీఎంహెచ్‌ఓ తెలిపారు.

News May 7, 2024

శ్రీకాకుళం జిల్లాలో మూడు రోజులు వర్షాలు

image

వాతావరణంలో వచ్చిన మార్పులతో పాలకొండ మండల పరిధిలో ఉన్న ఎం సింగుపురం, మల్లివీడు, పద్మాపురం, భాసూరు పరిసర ప్రాంత గ్రామాల్లో మంగళవారం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శ్రీకాకుళం రూరల్, ఆమదాలవలస, కొత్తూరు, ఇచ్ఛాపురం, పాలకొండ, నరసన్నపేట, నందిగాం తదితరు మండలంలో మంగళ, బుధ, గురువారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ MD రోణంకి కూర్మనాధ్ తెలిపారు.

News May 7, 2024

శ్రీకాకుళం: సీఎం జగన్ షెడ్యూల్ ఇదే..

image

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం ఇచ్ఛాపురంలో పర్యటించనున్నారు. విశాఖపట్నం నుంచి హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 2 గంటలకు ఇచ్ఛాపురం చేరుకుంటారు. స్థానిక విద్యుత్తు ఉపకేంద్రం వద్ద నుంచి మున్సిపల్ కూడలి వరకు రోడ్ షో నిర్వహిస్తారు. అనంతరం బహిరంగ సమావేశంలో మాట్లాడతారు. 3.30 గంటలకు ఇచ్ఛాపురం నుంచి విశాఖ బయలుదేరి వెళ్తారని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ తెలిపారు.