Srikakulam

News August 27, 2024

శ్రీకాకుళంలో TODAY TOP NEWS

image

➥ ఉద్యోగాలపై కేంద్రం మంత్రి కీలక వ్యాఖ్యలు
➥ 6 నెలల్లో శ్రీకాకుళం-ఆమదాలవలస రోడ్డు పూర్తి
➥ తమ్మినేని పై ఎమ్మెల్యే కూన రవి ఘాటు వాక్యాలు
➥ హిరమండలం వంశధార కాలువలో దూకి వ్యక్తి మృతి
➥ ఇంజీనీరింగ్ ప్రవేశాలకు ఈనెల 30లోగా సెల్ఫ్ రిపోర్ట్
➥ పాలకొండ సబ్ కలెక్టర్‌గా యశ్వంత్ ➥ బాధితుని వద్దకి వెళ్లి సమస్యలు తెలుసుకున్న ఎస్పీ
➥ జి.సిగడాంలో రైలు నుంచి జారీ మహిళ మృతి
➥ బూర్జ ఆయకట్టలో దెబ్బతిన్న షెల్టర్లు

News August 27, 2024

శ్రీకాకుళం: ఈనెల 30లోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి

image

ఇంజినీరింగ్ ప్రవేశాల మూడో విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల అలాట్మెంట్‌లను అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా సీటు వచ్చిన అభ్యర్థులు కళాశాలల్లో ఈనెల 30వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. జిల్లాలో మొత్తం నాలుగు ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. వాటిలో మొత్తం సీట్లు 2154 కాగా 1903 ప్రవేశాలు జరిగాయి. 252 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వివరాలకు SKLM ప్రభుత్వ పాలిటెక్నిక్ సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.

News August 27, 2024

పలాస: ప్రయాణికులకు ఊరటనిచ్చే వార్త చెప్పిన రైల్వే

image

ప్రయాణీకుల రద్దీ మేరకు పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా హైదరాబాద్‌(HYB), కటక్(CTC) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నం. 07165 HYB- CTC ట్రైన్‌ను నేడు మంగళవారం నుంచి సెప్టెంబరు 17 వరకు, నం. 07166 CTC- HYB ట్రైన్‌ను రేపు బుధవారం నుంచి సెప్టెంబరు 18 వరకు నడుపుతామన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు ఏపీలో గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర స్టేషన్‌లలో ఆగుతాయన్నారు.

News August 27, 2024

హిరమండలం: వంశధార కాలువలో దూకి యువకుడి ఆత్మహత్య

image

హిరమండలం మైత్రీ కాలనీకి చెందిన జోగి దుర్గాప్రసాద్ అనే యువకుడు వంశధార కుడి ప్రధాన కాలువలో దూకిగా సంఘటనలో మంగళవారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. స్థానిక ఎస్సై నారాయణస్వామి మాట్లాడుతూ.. మద్యానికి బానిసైన దుర్గాప్రసాద్‌ను తల్లి సావిత్రమ్మ మందలించింది. దీంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకునేందుకు సోమవారం కాలువలో దూకాడు. వెంటనే గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు.

News August 27, 2024

బూర్జ: షట్టర్లతో పాటు రెగ్యులేటర్ల‌కు లీకులు

image

బూర్జ మండలం నారాయణపురం ఆనకట్ట షట్టర్లు దెబ్బతినడంతో పాటు రెగ్యులేటర్ల లీకులు ఏర్పడటంతో శివారు ఆయకట్టుకు సాగునీరు అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఖరీఫ్‌లో రెగ్యులేటర్ల మరమ్మతులు చేపట్టినట్లయితే ఫలితం ఉంటుందని రైతులు అంటున్నారు. అయితే దీనిపై సంబంధిత అధికారులకు సమాచారం అందించినప్పటికీ పట్టించుకోకుండా వదిలేశారని వాపోయారు. దీనిపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.

News August 27, 2024

పొందూరు: దిల్లీ కార్యాచరణకు సిద్ధం కావాలి

image

పొందూరు మండల కేంద్రంలో విజయనగరం, శ్రీకాకుళం, మన్యం జిల్లాల సహారా ఏజెంట్లు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల బాధితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సహారా బ్యాంక్ ఖాతాదారుల తరఫున త్వరలో ఢిల్లీలో చేపట్టబోయే కార్యాచరణకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని సహారా కస్టమర్స్ అండ్ ఫీల్డ్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బైపల్లి సత్యరాజు కోరారు.

News August 27, 2024

పాలకొండ సబ్ కలెక్టర్‌గా యస్వంత్ రెడ్డి

image

పాలకొండ సబ్ కలెక్టర్‌గా సి.యస్వంత్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. యస్వంత్ రెడ్డి 2022 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధికారి. గతంలో ఐఏఎస్ అధికారి నూరల్ కమర్ పాలకొండలో సబ్ కలెక్టర్‌గా విధులు నిర్వహించారు. పాలకొండ సబ్ కలెక్టర్ ఐఏఎస్ అధికారిని నియమించడం ఇది రెండోసారి. ప్రస్తుతం పాలకొండ ఆర్‌డిఓగా విధులు చేస్తున్న వివి రమణని బదిలీ చేశారు.

News August 27, 2024

శ్రీకాకుళం జిల్లాలో రెండు కొత్త ఇసుక స్టాక్ పాయింట్లు

image

గార మండలం శాలిహుండం, బూర్జ మండలం ఖండ్యాంలో కొత్తగా రెండు ఇసుక స్టాక్ పాయింట్లను మంగళవారం నుంచి ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ స్టాకు పాయింట్ల నుంచి ఇసుక పొందేందుకు ముందుగా సంబంధిత బుకింగ్ పాయింట్ల వద్ద నమోదు చేసుకుని స్లిప్పులను పొందాలని సూచించారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఇసుక అందుబాటులో ఉంటుందని తెలిపారు.

News August 26, 2024

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన

image

శ్రీకాకుళం జిల్లాలో వర్షం పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రేపు జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. ప్రజలు, రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

News August 26, 2024

పరవాడ సినర్జిన్ ఫార్మా ప్రమాదం.. కన్నీటిని మిగిల్చిన విషాదం

image

పరవాడ సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న కెమిస్ట్ సూర్యనారాయణ మృతి చెందాడు. మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వంగర మండలం కోనంగిపాడు గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 15 రోజుల క్రితం మృతుడి భార్య సునీత మగ బిడ్డకు జన్మనిచ్చింది. అనారోగ్య కారణంగా అప్పటి నుంచి భార్య కుమారుడు శ్రీకాకుళంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.