Srikakulam

News May 6, 2024

రైలు ప్రమాదంలో గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం రైల్వే స్టేషన్‌కు సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు జీఆర్పీ ఎస్ఐ షరీఫ్ ఆదివారం తెలిపారు. అతని వయసు సుమారుగా 60-65 ఏళ్లు ఉంటుందని ఎస్సై తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలం చోక్కా, లుంగీ ధరించిన్నట్లు పోలీసులు తెలిపారు.

News May 6, 2024

నరసన్నపేట ఎన్నికల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ

image

నరసన్నపేట నియోజకవర్గం లో కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో భాగంగా రెండో రోజు ఆదివారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ క్రమంలో నిబంధనలను ఉల్లంఘించిన ఆర్ వో రామ్మోహన్‌రావు, మెప్మా పీడీ కిరణ్ కుమార్, సారవకోట తాహశీల్దార్ భాగ్యలక్ష్మికి ఆదివారం రాత్రి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై సమగ్రమైన నివేదికలో అందజేయాలంటూ నోటీసులో ఆయన స్పష్టం చేశారు.

News May 6, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి ఇంటి వద్ద ఓటింగ్

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం నుంచి ఇంటి వద్ద ఓటింగ్ జరగనుంది. 85 ఏళ్లు పైబడినవారు, దివ్యాంగులు ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు. జిల్లాలో 85 ఏళ్ల పైబడిన ఓటర్లు 11, 421 మంది, దివ్యాంగు ఓటర్లు 21, 517 మంది ఉండగా వారిలో హోం ఓటింగుకు 495 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 85 ఏళ్ల పైబడిన వారు 310 మంది దివ్యాంగులు 185 మంది ఇంటి వద్దనే ఫొటోకు వినియోగించుకోనున్నారు.

News May 6, 2024

ఈ నెల7న ఇచ్ఛాపురం రానున్న సీఎం జగన్

image

సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి ఈనెల 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి రానున్నారు. ఈ పర్యటనను పార్టీ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని ఆ పార్టీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ఇచ్ఛాపురం మున్సిపల్ జంక్షన్ వద్ద మధ్యాహ్నం బహిరంగ సభ నిర్వహించనున్నారు.

News May 6, 2024

శ్రీకాకుళం: 7, 8 తేదీల్లో పోస్టల్ ఓటుకు అవకాశం

image

రాష్ట్ర ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలతో ఎన్నిక‌ల విధుల్లో పాల్గొనే సిబ్బంది పోస్ట‌ల్ బ్యాలెట్ సౌక‌ర్యాన్ని కచ్చితంగా వినియోగించుకొనేందుకు ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ఎన్నికల విధులలో పాల్గొనే సిబ్బంది వివిధ కారణాల చేత 4, 5, 6 తేదీలలో ఓటు హక్కు వినియోగించుకోలేకపోతే 7, 8వ తేదీల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వారి కార్యాలయంలో ఓటు వేయొచ్చన్నారు.

News May 5, 2024

శ్రీకాకుళం: హోం ఓటింగ్‌కు 495 మంది దరఖాస్తు

image

సార్వత్రిక ఎన్నికలలో భాగంగా హోం ఓటింగ్ ప్రక్రియ జిల్లాలో సోమవారం జరగనుంది. దానికి సంబంధించి అధికారులు వివరాలు వెల్లడించారు.
85 ఏళ్ల పైబడిన ఓటర్లు: 11,421
దివ్యాంగుల ఓటర్లు: 21,517
మొత్తం ఓటర్లు: 32,938
హోం ఓటింగ్‌కి దరఖాస్తు చేసుకున్న ఓటర్లు:
85 ఏళ్ల పైబడినవారు: 310
దివ్యాంగ ఓటర్లు: 185
మొత్తం ఓటర్లు: 495. హోమ్ ఓటింగ్ కోసం జిల్లాలో 188 ప్రత్యేక బృందాలను నియమించారు.

News May 5, 2024

శ్రీకాకుళంలో రేపు మోస్తారు వర్షాలు

image

శ్రీకాకుళం జిల్లాలో ఉదయం 7 నుంచే సూర్యుడు చెలరేగిపోతున్న విషయం తెలిసిందే. ఫ్యాన్లు, ఏసీలు వేసుకున్నా ఊరట అంతంత మాత్రంగానే ఉంటుంది. ఈ క్రమంలో భానుడి ప్రతాపానికి ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ ఓ చల్లటి కబురు పంపింది. సోమవారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ ఎండీ రోణంకి కూర్మనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

News May 5, 2024

మెళియాపుట్టి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

మెళియాపుట్టి మండలం చీపురుపల్లి గ్రామానికి చెందిన నందిగాం మధు (38) ఆదివారం ద్విచక్ర వాహన ప్రమాదానికి గురై తలకు బలమైన గాయమైంది. వెంటనే స్థానికులు 108 వాహనంలో టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి పరిస్థితి విషమించడంతో జిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News May 5, 2024

కృష్ణుడి ఫొటోతో ప్రచారం.. MLA పదవి కోల్పోయి

image

ఒక్క ఫొటో.. MLA పదవిని కోల్పోయేలా చేసింది. 1989లో పాతపట్నంకు జరిగిన ఎన్నికల్లో TDP అభ్యర్థి కలమట మోహనరావు గెలుపొందారు. NTR కృష్ణుడి వేషంలోని బొమ్మతో ప్రచారం చేసి ఓటర్లను ఆకర్షించారని కాంగ్రెస్ అభ్యర్థి ధర్మాన నారాయణ హైకోర్టుకు వెళ్లారు. తీర్పుతనకు వ్యతిరేఖంగా వచ్చిందని కలమట సుప్రీంకోర్టుకు వెళ్లారు. తీర్పువచ్చేలోపే 1994లో వచ్చిన ఎన్నికల్లో మరోసారి గెలిచారు. 1996లో తీర్పురాగా కలమట పదవి కోల్పోయారు.

News May 5, 2024

శ్రీకాకుళం : ఈ నెల 7న రాజ్ నాథ్ సింగ్ రాక

image

కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈనెల 7న శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి NDA కూటమి తరుపున బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నడుకుదిటి ఈశ్వరరావుకు మద్దతుగా ఆయన ప్రచారం చేయనున్నారు. ఆ రోజు 11.50కి విశాఖపట్నం ఎయిర్ పోర్టు నుంచి హెలీకాప్టర్లో బయలుదేరి 12.10కి ఎచ్చెర్ల హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12.20 గంటల నుంచి 1.10 వరకు ఎచ్చెర్ల బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు.