Srikakulam

News May 3, 2024

శ్రీకాకుళం: హింసకు తావు లేని ఎన్నికలే లక్ష్యం

image

రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, రీ పోలింగ్ జరగకుండా ఉండేలా పని చేయడమే ప్రధాన లక్ష్యం కావాలని భారత ఎన్నికల కమిషన్, సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు. శుక్రవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పార్లమెంట్ నియోజకవర్గ సాధారణ పరిశీలకులు సీనియర్ అధికారి శేఖర్ విద్యార్థి హాజరయ్యారు.

News May 3, 2024

శ్రీకాకుళం: ఈ నెల 7న నారా లోకేశ్ రాక

image

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం కార్యక్రమానికి ఈ నెల 7న శ్రీకాకుళం విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా నగరంలోని 80 అడుగుల రోడ్డులో బహిరంగ ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ శుక్రవారం పరిశీలించారు. లోకేశ్ రాకకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. యువగళం సభ విజయవంతం చేయాలని కోరారు.

News May 3, 2024

శ్రీకాకుళం: సీ-విజల్ ద్వారా 624 ఫిర్యాదులు

image

ఎన్నికల కోడ్ నుంచీ ఇప్పటి వరకూ జిల్లాలో 624 ఫిర్యాదులు సి. విజిల్ ద్వారా నమోదు అయ్యాయని అధికారులు శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వాటిని పరిష్కరించాయి. మొత్తం ఫిర్యాదులలో 437 మాత్రమే సరైనవని నిర్ధారించారు. మరోవైపు 187 కేసులను జిల్లా నియంత్రణ కేంద్రం ఫేక్ ఫిర్యాదులన్ని ధృవీకరించి తొలగించారు.

News May 3, 2024

టెక్కలిలో మహిళకు కరెంట్ షాక్

image

టెక్కలి- మెలియాపుట్టి రోడ్డులోని ఓ రైస్ మిల్లులో పనిచేస్తున్న పోలాకి సుందరమ్మ అనే మహిళ శుక్రవారం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రగాయాలయ్యాయి. మండాపోలం కాలనీకి చెందిన సుందరమ్మ మిల్లులో పని చేస్తుండగా విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంట్ షా్క్ తగిలింది. గమనించిన స్థానికులు మహిళను చికిత్స నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

రాజాం : తాను మరణిస్తూ… వేరొకరికి సాయం

image

రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన వృద్ధురాలు బండి సత్యవతి (73) గురువారం రాత్రి అనారోగ్య కారణంగా మృతి చెందారు. కుమారుడు బండి నర్సింహులు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో వచ్చిన వైద్యులు మృతదేహం నుంచి నేత్రాలను సేకరించారు. తాను చనిపోయినా తన కళ్లు వేరొకరికి ఉపయోగపడాలనే గొప్ప ఆశయంతో నేత్రదానం చేసిన కుటుంబ సభ్యుల ఆశయాన్ని స్థానికులు అభినందిస్తున్నారు.

News May 3, 2024

పలాస : బాల పురస్కార్ దరఖాస్తుల ఆహ్వానం

image

మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో సాంస్కృతిక, కళలు, క్రీడలు, సమాజ సేవ, పాండిత్యం, సాహసరంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలు https://awards. gov. in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని ఐ.సి.డి.ఎస్ జిల్లా పథక సంచాలకులు బి. శాంతి శ్రీ తెలిపారు. అర్హులైన బాలల ద్వారా జూలై 31వ తేదీలోగా దరఖాస్తులు పంపాలని కోరారు.

News May 3, 2024

శ్రీకాకుళం: ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకం

image

ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల (సూక్ష్మ పరిశీలకులు) పాత్ర కీలకమని కేంద్ర ఎన్నికల పరిశీలకులు, సీనియర్ శేఖర్ విద్యార్థి అన్నారు. శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అధ్యక్షతన గురువారం మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించారు. అబ్జర్వర్లు పోలింగ్‌ విధానాన్ని పరిశీలిస్తూ ఎక్కడైనా తప్పిదాలు ఉల్లంఘనలు జరిగితే అధికారులకు చెప్పాలన్నారు.

News May 3, 2024

శ్రీకాకుళం: స్ట్రాంగ్ రూమ్ మ్యాప్ల పరిశీలన

image

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్ల మ్యాప్లను ఎన్నికల పరిశీలకులు శేఖర్ విద్యార్థి, తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహెల్ల, జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జిలానీ సమూన్ పరిశీలించారు. అనంతరం పలువురు సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొన్నారు. వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్, ఎస్పీ జి.ఆర్ రాధిక ఉన్నారు.

News May 2, 2024

పాలకొండకు చేరుకున్న పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు పాలకొండ నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. కొద్దిసేపటి క్రితమే పవన్ పాలకొండకు చేరుకున్నారు. పవన్‌కు దారి పొడవున అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పవన్ ప్రజలకు అభివాదం చేస్తూ వారాహిలో ముందుకు వెలుతున్నారు. మరికొద్ది సేపట్లో పవన్ ప్రసంగించనున్నారు. పవన్ వెంట పలువురు జిల్లా నేతలు ఉన్నారు.

News May 2, 2024

మరికొద్ది సేపట్లో శ్రీకాకుళం జిల్లాకు పవన్ కళ్యాణ్

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. దీనిలో భాగంగా నేడు సాయంత్రం 4 గంటలకు పాలకొండ నియోజకవర్గంలో ఒడమ జంక్షన్‌‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నారు. ఈ సభకు భారీగా జనసైనికులు రానున్నారు. ఇప్పటికే పవన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.