Srikakulam

News April 25, 2024

ఎచ్చెర్ల : ఈవీఎం స్ట్రాంగ్ రూములను పరిశీలించిన పోలీస్ అబ్జర్వర్లు

image

ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామ సమీపంలోని శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాలలో ఈవీఎం స్ట్రాంగ్ రూములను ఎన్నికల పోలీస్ అబ్జర్వర్లు దిగంబర్ పి ప్రధాన్ సచ్చింద్ర పటేల్ గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం కౌంటింగ్ సెంటర్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక, పలువురు జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం విచ్చేసిన ఎన్నికల అబ్జర్వర్లు

image

సార్వత్రిక ఎన్నికలు – 2024 ఎన్నికల పార్లమెంట్ నియోజకవర్గం VZM జిల్లా పోలీస్ అబ్జర్వర్ సచ్చింద్ర పటేల్, VZM జిల్లా జనరల్ అబ్జర్వర్ టాట్ పర్వేజ్ ఇక్బాల్ రోహేళ్ల గురువారం సాయంత్రం జిల్లాకు విచ్చేశారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ ను ఇరువురు మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం ఎన్నికల అంశాలపై చర్చించుకున్నారు.

News April 25, 2024

ఓపెన్ టెన్త్‌లో ఫలితాల్లో శ్రీకాకుళం 17వ స్థానం

image

ఓపెన్ స్కూల్, టెన్త్ & ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో జిల్లాలో టెన్త్ పరీక్షలకు 767 మంది హాజరుకాగా 280 (36.51) శాతం మంది పాసయ్యారు. ఇంటర్మీడియట్ పరీక్షలకు 1705 మందికి 561 (32.90%) మంది ఉత్తీర్ణులయ్యారని గురువారం జిల్లా విద్యాశాఖాధికారి తెలిపారు. ఫలితాల్లో శ్రీకాకుళం టెన్త్ 17వ స్థానం, ఇంటర్మీడియట్‌లో 23వ స్థానంలో నిలిచిందని వారు వెల్లడించారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: 3వ సెమిస్టర్ ఫలితాల విడుదల

image

ఎచ్చెర్ల డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలోగల డిగ్రీ మూడో సెమిస్టర్ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను గురువారం సాయంత్రం యూనివర్సిటీ డీఎన్ విడుదల చేశారు. ఈ పరీక్ష ఫలితాలను జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. అదేవిధంగా డిగ్రీ మొదటి, 5వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కొద్ది రోజుల్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూం పరిశీలన

image

నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని గురువారం పరిశీలించారు. కంట్రోల్ రూంలో మీడియా సర్టిఫికేషన్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ పలు శాఖలను ఆయన పరిశీలించారు.

News April 25, 2024

ఎచ్చెర్ల: రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి

image

ఎచ్చెర్లలోని చిలకపాలెం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ప్రమాదంలో ఆటో డ్రైవర్ మజ్జి అచ్చెప్పడు మృతి చెందాడు. పొందూరులోని లోలుగు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌గా పోలీసులు గుర్తించారు. ఆటోను వెనుక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అదుపు తప్పి బోల్తా పడింది. చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి ఆయనను తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News April 25, 2024

శ్రీకాకుళం: పరిశీలకులకు ఫిర్యాదు చేయొచ్చు

image

సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పరిశీలకులను భారత ఎన్నికల కమిషన్‌ నియమించిందని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీలు చేస్తున్న వ్యయానికి సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉంటే మండల పరిశీలకులకు నేరుగా కానీ ఫోన్‌లో గాని ఫిర్యాదు చేయవచ్చని ఆయన పేర్కొన్నారు.

News April 25, 2024

శ్రీకాకుళం: కొమ్మ లేకున్న కాసింది మామిడి

image

మామిడి కాయలు కొమ్మలకు కాయడం సహజం. ఎల్‌ఎన్‌పేట మండలం చింతలబడవంజ గ్రామంలోని ధనలక్ష్మీ అనే గృహిణి ఇంటి బయట మామిడి వృక్షాన్ని నరికేశారు. అయినా కాండానికి గుత్తులుగా కాసిన మామిడి కాయలు అటుగా వెళ్లే చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

News April 25, 2024

వంగర: పెళ్లి ట్రాక్టర్ బోల్తా.. ఒకరు మృతి

image

బలిజిపేట మండలం పెద్ద పింకీ గ్రామానికి చెందిన కొంత మంది వంగర మండలం పట్టు వర్ధనం గ్రామానికి శుభకార్య నిమిత్తం గురువారం వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా పట్టువర్ధనం గ్రామ శివారులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో సత్తమ్మ అనే మహిళ అక్కడిక్కడే మృతి చెందగా పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని 108 సహాయంతో క్షతగాత్రులను రాజాంలో పలు హాస్పిటళ్లకు తరలించారు.

News April 25, 2024

శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికలు- 2024 నేపథ్యంలో జిల్లా ఎన్నికల పోలీసు పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన అధికారి దిగంబర్ పి ప్రధాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు గురువారం జిల్లాకు చేరుకున్న ఆయనకు జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అతిథి గృహంలో మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందజేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలీసు శాఖ పరమైన పలు అంశాలపై చర్చించారు.