India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఆయన భార్య శ్రావ్య పేరిట రూ.23. 29 కోట్ల ఆస్తులున్నాయని నామినేషన్ పత్రాలతో పాటు దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. బీటెక్, ఎంబీఏ చదివినట్లు తెలిపారు. దంపతుల పేరిట రూ.6.78 కోట్ల చరాస్తులు, రూ.16.51 కోట్ల స్థిరాస్తులు, 2,335 గ్రాముల బంగారం, రూ.2.98 కోట్ల రుణాలు ఉన్నాయని పేర్కొన్నారు.
రాజాం-శ్రీకాకుళం ప్రధాన రహదారి మెట్టవలస బస్ షెల్టర్ వద్ద బుధవారం ఓ మహిళ అపస్మారక స్థితిలో పడి ఉండడంతో స్థానికులు గమనించి 108కి సమాచారం అందించారు. 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించి రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించింది. వివరాలు తెలిసిన వారు రాజాం పోలీసులను సంప్రదించాలని కోరారు.
శ్రీకాకుళం టీడీపీ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కలమట వెంకటరమణమూర్తి నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైంది. పాతపట్నం టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆయనకు కేటాయించకపోవడంతో ఇండిపెండెంట్గా నామినేషన్ వేసేందుకు కలమట సిద్ధమయ్యారు. మంగళవారం చంద్రబాబుతో జరిగిన భేటీతో కలమట వెనక్కి తగ్గారు. చంద్రబాబు ఆదేశానుశారం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు.
సాధారణ ఎన్నికల నేపథ్యంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, కంట్రోల్ రూమ్ (ఎన్నికల నియంత్రణ కేంద్రం)లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ బుధవారం పరిశీలించారు. అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
*టెక్కలి: ముగిసిన సీఎం జగన్ బస్సుయాత్ర
*ఆమదాలవలస: తమ్మినేనికి రోజులు దగ్గరపడ్డాయి: చంద్రబాబు
*జలుమూరు: శ్రీముఖలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
*పాతపట్నం: నామినేషన్ నిర్ణయం వెనక్కి తీసుకున్న కలమట
*పాలకొండ: రిటర్నింగ్ ఆఫీసర్గా శుభం బన్సాల్
*శ్రీకాకుళం: ఎంపీ అభ్యర్థిగా రామ్మోహన్ నామినేషన్
*ఎల్.ఎన్.పేట: ఈదురు గాలులతో వర్షం
*ఎచ్చెర్ల: ఆలయంలో 30 తులాల బంగారం చోరీ
శ్రీకాకుళం:ఆదిత్యుని సన్నిధిలో కూచిపూడి
➤పలాస:JBNP-అనిల్ కుమార్, ➤ ఇచ్ఛాపురం: YCP- పిరియా విజయ, TDP- అశోక్, INCP- చక్రవర్తి రెడ్డి, BCYP-బడి ముఖలింగం ➤ టెక్కలి: INCP-విక్రాంత్, JBNP- పరమేశ్వరరావు ➤ శ్రీకాకుళం: YCP – ప్రసాదరావు, BSP-సూర్యనారాయణ,➤ ఆమదాలవలస: JCVIVP- రేవతి, ➤ పాతపట్నం: BSP- కృష్ణారావు, ➤ ఎచ్చెర్ల: BJP అభ్యర్థిగా – ఈశ్వరరావు .. NOTE:- పై వారితో పాటుగా ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ వేశారు.
ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన (స్క్రుటినీ) ఉంటుందని.. అదే విధంగా 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు వీలుంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆర్వో లు, నోడల్ అధికారులతో నిర్వహించారు. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం సింబల్ అలాట్మెంట్ జరుగుతుందని వివరించారు.
ఎచ్చెర్ల మండలంలోని కుంచాల కురమయ్యపేట దేవీ ఆశ్రమంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు 30 తులాల బంగారం, 100 తులాల వెండి, రూ.44 లక్షల నగదు చోరీకి గురైనట్లు అర్చకుడు బాల భాస్కర శర్మ తెలిపారు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగిందని బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోని సీసీ ఫుటేజ్ని దొంగలు ధ్వంసం చేశారు. ఈ మేరకు క్లూస్ టీం ఆలయంలో వివరాలు సేకరిస్తున్నారు.
శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు, కలమట వెంకటరమణ, కింజరాపు హరి వరప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ మేరకు నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలాని సమూన్కు అందజేశారు.
శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలిద్దరూ జిల్లాలోనే ఉన్నారు. నిన్న పాతపట్నం ప్రజాగళం సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఈరోజు శ్రీకాకుళం మున్సిపల్ గ్రౌండ్ లో మహిళలతో ముఖాముఖి నిర్వహించనున్నారు. సీఎం జగన్ కూడా శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నారు. మేమంతా బస్సు యాత్ర భాగంగా ఈరోజు ఎచ్చెర్ల నుంచి శ్రీకాకుళం బైపాస్ మీదుగా టెక్కలి చేరుకుని.. అక్కడ సభలో ప్రసంగించనున్నారు.
Sorry, no posts matched your criteria.