Srikakulam

News April 21, 2024

శ్రీకాకుళం: 29 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 29 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలన్నారు.

News April 20, 2024

శ్రీకాకుళం: 29 నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ నాలుగో సెమిస్టర్ పరీక్షలు 29 నుంచి మే 9వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ ఉదయ భాస్కర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు గమనించాలన్నారు.

News April 20, 2024

పాలకొండ: విద్యుత్ షాక్‌తో రైతు మృతి

image

పాలకొండ మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. అంపిలి గ్రామానికి చెందిన అప్పలనాయుడు (58) తన పొలానికి నీరు పెట్టడానికి వెళ్లి, కరెంట్ షాక్‌తో  మృతి చెందాడని ఏఎస్ఐ రాజారావు తెలిపారు. భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.

News April 20, 2024

శ్రీకాకుళం జిల్లాలో మూడో రోజు నామినేషన్లు వేసింది వీరే

image

➤ శ్రీకాకుళం: JBNP అభ్యర్థిగా రాగోలు నాగశివ ➤ ఇచ్ఛాపురం: స్వతంత్ర అభ్యర్థిగా సుగ్గు చక్రవర్తి ➤ ఆమదాలవలస: BCYP అభ్యర్థిగా సిపాన శ్రీనివాసరావు ➤ JBNP అభ్యర్థిగా బురిడీ గౌరి శంకర్ ➤నరసన్నపేట: TDP అభ్యర్థిగా బగ్గు రమణ మూర్తి నామినేషన్లు వేశారు.
NOTE: జిల్లా మొత్తంగా శనివారం నాలుగు నియోజకవర్గాల నుంచి నామినేషన్లు వేశారు.

News April 20, 2024

శ్రీకాకుళం: కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

image

ఎన్నికల ప్రత్యేక వ్యయ పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్, ఎన్నికల పరిశీలకులు కోమల్ జిత్ మీనా, శరవణ కుమార్, నవీన్ కుమార్ సోనీలతో కలసి నూతన కలెక్టరేట్ సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కేంద్రాన్ని శనివారం సందర్శించారు. మీడియా మానిటరింగ్, మోడల్ కోడ్ కమిటీ, సోషల్ మీడియా, జిల్లా ఎక్స్పెండిచర్ కమిటీ, కంప్లైంట్స్, రిపోర్టింగ్, మీడియా సెంటర్ విభాగాలను పరిశీలించారు.

News April 20, 2024

శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన కలెక్టర్, ఎస్పీ

image

రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు నినా నిగమ్ జిల్లా పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం గౌరవ పూర్వకంగా ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ జి.ఆర్.రాధిక ఆహ్వానం పలికారు. అనంతరం జిల్లాలోని అనుసరిస్తున్న ఎన్నికల నియమావళి ప్రక్రియను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతీ అధికారి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.

News April 20, 2024

శ్రీకాకుళం: ప్రచార ఖర్చులపై నిరంతర నిఘా

image

ఎన్నికల ప్రచారానికి వ్యయ పరిమితికి మించి వెచ్చించే అవకాశం ఉన్న అభ్యర్థుల ఖర్చులపై నిరంతర నిఘా ఉంచాలని ఎన్నికల వ్యయ ప్రత్యేక పరిశీలకులు, విశ్రాంత ఐ.అర్.ఎస్ అధికారి నీనా నిగమ్ ఆయా నోడల్ ఏజెన్సీ అధికారులను ఆదేశించారు. జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఆమె సమావేశం నిర్వహించారు. ఓటర్లకు లంచం ఇచ్చే ప్రయత్నంలో నగదు, బహుమతుల పంపిణీపై సీ- విజిల్ లాంటి అప్లికేషన్ల ద్వారా ఫిర్యాదులు స్వీకరించాలన్నారు.

News April 20, 2024

పేరాడ తిలక్‌ ఆస్తుల వివరాలు ఇవే..

image

*నియోజకవర్గం: శ్రీకాకుళం పార్లమెంట్
*పార్టీ: వైసీపీ
*విద్యార్హత:డిగ్రీ
*కేసులు: ఏమీలేవు
*చరాస్తులు: రూ.51.47లక్షలు
*స్థిరాస్తులు: రూ.65.87లక్షలు
*వ్యవసాయేతర ఆస్తులు: రూ.9.30కోట్లు
*రుణాలు: రూ.34.51 లక్షలు
*NOTE: ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారం.

News April 20, 2024

శ్రీకాకుళం: రూ.1.37 లక్షల సొమ్ము సీజ్

image

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం బెండి గేటు సమీపంలో సాధారణ ఎన్నికల్లో భాగంగా ప్లయింగ్ స్క్వాడ్ శుక్రవారం అటుగా వచ్చిన వాహనాలను తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ కారులో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.1.37 లక్షలు సొమ్మును సీజ్ చేసి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన సొమ్మును వజ్రపుకొత్తూరు పోలీసులకు అందజేశామని ఫ్లైయింగ్ స్క్యాడ్ సిబ్బంది తెలిపారు.

News April 20, 2024

పలాస: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

image

పలాస రైల్వే స్టేషన్‌లో స్థానిక జీఆర్పీ పోలీసులు శుక్రవారం బిహార్‌కు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. భువనేశ్వర్ నుంచి విశాఖ వెళుతున్న ఇంటర్‌సీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా ఐదుగురు యువకులను జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారి వద్ద ఉన్న బ్యాగులు క్షుణ్ణంగా పరిశీలించగా 27 గ్రాముల బంగారం, ఐదు తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు.