Srikakulam

News April 15, 2024

వైసీపీకి రాజీనామా చేసిన దువ్వాడ దంపతులు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ సోమవారం పలాసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా సేవలందించినా గడిచిన కొంతకాలంగా జరిగిన అవమానాలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News April 15, 2024

నెల్లూరు వద్ద ముగ్గురు శ్రీకాకుళం వాసుల మృతి

image

నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు చనిపోయారు. టెక్కలికి చెందిన రామయ్య(44), జలుమూరు(M) నగిరికటకానికి తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వెళ్లారు. ముగ్గురూ కలిసి బైకుపై ఆ జిల్లాలోని పొదలకూరుకు పనికి వెళ్లారు. తిరిగొస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లో చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.

News April 15, 2024

నరసన్నపేట: పెయింటర్ అనుమానాస్పద మృతి

image

నరసన్నపేటలోని ఒక పెయింటర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. నరసన్నపేట పట్టణంలో పెయింటర్‌గా పనిచేస్తున్న గండి సోమేశ్వరరావు కుటుంబ కలహాలు కారణంగా ఈనెల 11వ తేదీన విశాఖపట్నం వెళుతున్నట్లుగా కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే ఆదివారం సాయంత్రం అతని మృతదేహం కనిపించింది. మండలంలోని సత్యవరం వద్ద మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్సై అశోక్ బాబు తెలిపారు.

News April 15, 2024

శ్రీకాకుళంలో నేడు చంద్రబాబు పర్యటన

image

నారా చంద్రబాబు నాయుడు నేడు శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు సాయంత్రం 5.15 గంటలకు చేరుకుంటారు. అనంతరం బస్సులో ఇందిరా చౌక్ కూడలి వద్దకు చేరుకుని 6 నుంచి 7.30 గంటల వరకు ప్రసంగిస్తారు. 7.40 గంటలకు సభా కూడలి నుంచి బస్సులో పలాస టీడీపీ నూతన కార్యాలయానికి వెళ్లి అక్కడే బస చేస్తారు. తరువాత రోజు శ్రీకాకుళం నాయకులతో సమీక్ష నిర్వహిస్తారు.

News April 15, 2024

అంబేడ్కర్ ఆశయాలు భావితరాలకు ఆదర్శం: ఆర్.నారాయణ మూర్తి

image

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు ఆదర్శనీయమని సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణ మూర్తి అన్నారు. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ఆదివారం రాత్రి హిరమండలం మండలం కొండరాగోలు గ్రామంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు అంబేడ్కర్ విగ్రహాలను నిర్మించడం గొప్ప విషయం అన్నారు. గ్రామస్తులు నారాయణమూర్తికి ఘన స్వాగతం పలికారు.

News April 14, 2024

చంద్రబాబుని నమ్మి మోసపోవద్దు: మంత్రి ధర్మాన

image

అధికారం కోసం చంద్రబాబు అనేక తప్పుడు ప్రచారాలు చేస్తూ, మాయమాటలు చెబుతున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి గ్రామంలో ఆదివారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు ఇచ్చిన జగనన్నకు ఓటు వేయాలన్నారు.

News April 14, 2024

శ్రీకాకుళం జిల్లాలో వ్యక్తి వ్యక్తి అనుమానాస్పద మృతి

image

బూర్జ మండలం పెద్దపేట పంచాయతీ బొమ్మిక గ్రామంలో సవర చంద్రయ్య(48) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానిక ఎస్సై జీవీ ప్రసాద్ ఆదివారం తెలిపారు. చంద్రయ్య భార్య ఎస్.పున్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. చంద్రయ్య మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News April 14, 2024

మరో కోడి కత్తి డ్రామాకు తెర లేపిన జగన్: అచ్చెన్న

image

ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం జగన్ మరో కోడి కత్తి డ్రామాకు తెరలేపారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెనాయుడు అన్నాడు. ఆదివారం పలాసలోని పార్టీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతోందని తెలిసే జగన్ కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 160 స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  

News April 14, 2024

అంబేడ్కర్ సేవలు చిరస్మరణీయం:డీఆర్‌ఓ

image

శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో ఆదివారం ఘనంగా అంబేడ్కర్ జయంతిని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా డీఆర్ఓ గణపతి రావు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నవీన్ పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2024

శ్రీకాకుళంలో తీవ్ర వడగాల్పులు

image

రాష్ట్రంలో వడగాల్పుల తీవ్రత పెరగనుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ 151 మండలాల్లో మోస్తరుగా.. 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఉంటాయని అంచనా వేసింది. రేపు 135 మండలాల్లో స్వల్పంగా.. 33 మండలాల్లో తీవ్రంగా వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ఇవాళ కోస్తా, రాయలసీమల్లో ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. శ్రీకాకుళంలో వడగాల్పులు ఉండనున్నాయి. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని సూచించింది.