Srikakulam

News April 13, 2024

నందిగంలో కారు బోల్తా 

image

నందిగం మండలం జాతీయ రహదారిపై శనివారం ఉదయం కార్ అదుపుతప్పి బోల్తా పడింది. పైడి భీమవరం నుంచి పలాస వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పలాసలో జరుగు శుభకార్యానికి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కారు బుక్ చేసుకుని వెళ్తున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనపై నందిగం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

News April 13, 2024

శ్రీకాకుళం: ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య

image

శ్రీకాకుళం మండల పరిధిలోని డీసీసీబీ కాలనీలో నివాసం ఉంటున్న కింతలి శ్రీవాణి (30) శుక్రవారం తన ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ..శ్రీవాణి, ఆమె భర్త హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. అయితే ఆమెకు పిల్లలు లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.

News April 13, 2024

చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పర్యటన వివరాలు

image

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన ఖరారు అయ్యింది. ఈనెల 15న రాజాంలో సభ నిర్వహించిన అనంతరం టెక్కలి, పలాసలో జరిగే టీడీపీ ‘ప్రజాగళం’ సభకు చంద్రబాబు నాయుడు హాజరవుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధినేత ఎన్నికల ప్రచారానికి వస్తుండడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

News April 13, 2024

శ్రీకాకుళం :ఈనెల 15వ తేదీ నుంచి చేపల వేటపై నిషేధం

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.

News April 13, 2024

24న టెక్కలికి సీఎం జగన్.. బస్సు యాత్ర ముగింపు

image

వైసీపీ అధినేత, సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఈనెల 24న టెక్కలి చేరనుంది. ఈ యాత్ర ఆ రోజే ముగియనుంది. ఈ మేరకు వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం జగన్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో సీఎం టెక్కలి రానుండడంతో పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

News April 13, 2024

తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: కలెక్టర్

image

వేసవిలో ప్రజలకు నీటి కొరత లేకుండా సంబంధిత అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మందిరంలో సంబంధిత సిబ్బందితో సమావేశం నిర్వహించారు. మంచినీటి పథకాలు పని చేయలేదనే ఫిర్యాదు ఒక్కటీ ఉండకూడదన్నారు. నీటి నాణ్యతను గురించి పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. 

News April 12, 2024

పలాస: అనారోగ్యంతో విశ్రాంత ఉపాధ్యాయుడి మృతి

image

పలాస మండలం కిష్టుపురం గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు బుర్లె జగ్గారావు శుక్రవారం ఉదయం అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. దివంగత నేత అప్పయ్య నుంచి నేటి తరం రాజకీయ నాయకులతో పాటు పరోక్ష రాజకీయాల్లో పాలు పంచుకుంటూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఆయన మరణ వార్త విన్న సమీప గ్రామ ప్రజలు, ఆయన వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్న విద్యార్థులు వేలాదిమంది తరలివచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

News April 12, 2024

వాలంటీర్లు మా కార్యకర్తలే: మంత్రి ధర్మాన

image

శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సమావేశంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల మన పార్టీ కార్యకర్తలని అన్నారు. నామినేషన్ రోజు 25 మంది వాలంటీర్లను తీసుకురావాలని కోరారు. వాలంటీర్లను రాజీనామాలు చేయించండి అని కార్యకర్తలకు సూచించారు. వాలంటీర్లతో పని చేయించాలని జిల్లాలోని ఆ పార్టీ కేడర్‌కు సూచించారు. మళ్ళీ మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

News April 12, 2024

శ్రీకాకుళం: మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ పూర్తి

image

మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ నిర్దేశిత వెబ్సైట్లో పూర్తి అయిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. మనజీర్ జీలాని సమూన్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఈ.యమ్.ఎస్ 2.ఓ నిర్దేశిత వెబ్సైట్లో మొదటి విడత ఇవిఎం రెండమనైజేషన్ ప్రక్రియ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేసారు..

News April 12, 2024

రాజాంలో భారీగా న‌గ‌దు ప‌ట్టివేత‌

image

ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఐ దాడి మోహన్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం రాజాం మండలం పొగిరి చెక్ పోస్ట్ వద్ద పాలకండ్యం నుంచి రాజాం వెళ్తున్న కారులో తనిఖీ నిర్వహించారు. ఈ తనిఖీల్లో రూ.5,23,300 గుర్తించారు. సంబంధిత నగదుకు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.