India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. సెలవు ఉందనే విషయాన్ని అన్ని స్కూళ్లు, కాలేజీల యజమానులు ముందుగానే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పాలని ఆదేశించారు. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి విద్యా సంస్థలు నిర్వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఆదేశించారు.
శ్రీకాకుళం జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించి అన్ని రకాల అనుమతులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో విధానం ప్రజల్లోకి అందుబాటులోకి తీసుకువచ్చి సులభతరం చేసిందని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవాల అనుమతి కొరకు https://ganeshutsav.net/ లేదా 7995095800కు వాట్సాప్లో మెసేజ్ చేసి దరఖాస్తు చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలకు సోమవారం సెలవును ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి, రీజినల్ ఇంటర్మీడియట్ అధికారికి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున సెలవు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో కింది జాగ్రత్తలు పాటిద్దాం.
☞ శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, గోడలు, స్తంభాల వద్ద ఉండొద్దు.
☞ వర్షం పడేటప్పుడు చెట్ల కిందికి వెళ్లకండి.
☞ నదులు, కాలువలు, మ్యాన్హోళ్ల వద్ద జాగ్రత్త.
☞ రోడ్డుపై నీరుంటే జాగ్రత్తగా వెళ్లండి.
➠ కంట్రోల్ రూం నంబర్: 08942240557
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ఒడిశా కళింగపట్నం మధ్యలో తీరం దాటింది. దీంతో రాబోయే 24 గంటలు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి రోణంకి కూర్మనాధ్ తెలిపారు. ఈ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు తెలిపారు. మరోవైపు వాయుగుండాన్ని ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
నాలుగు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి గార మండలంలోని కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశాలు ఉన్నాయనే వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బలమైన గాలులు, తీరం దాటిన అనంతరం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టింది.
తుఫాన్ వర్షాలకు సహాయక చర్యలు అందించేందుకు ప్రత్యేక అధికారులను నియమించినట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ శనివారం ప్రకటించారు. రణస్థలంకు లక్ష్మణమూర్తి (9121251111), గారకు బీ శాంతిశ్రీ (9440814582), పోలాకి ఆర్ వెంకట్రామన్ (8919364818), సంతబొమ్మాళి రామ్మోహనరావు(9440422302), వజ్రపుకొత్తూరు ఉమామహేశ్వరరావు (9866530885), మందస నగేష్ (7093930101), సోంపేట సత్యనారాయణ (9502225511)లను నియమించారు.
శ్రీకాకుళం జిల్లా ఖోఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన (ఆదివారం) శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల ఆవరణలో జరగనున్న సబ్ జూనియర్ జిల్లా జట్లు ఎంపికలు వర్షం కారణంగా వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆ సంఘం అధ్యక్షుడు నాగ భూషణరావు తెలిపారు. ఎంపికలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని క్రీడాకారులు గమనించాలన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, భార్య దువ్వాడ వాణీ వివాదం ఎపిసోడ్లో శనివారం ఒక బిగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్తో సన్నిహితంగా ఉంటున్న దివ్వెల మాధురి రోడ్డు ప్రమాదానికి గురైన సమయంలో దువ్వాడ శ్రీనివాస్ మాధురికి ఫోన్ చేశారు. “దువ్వాడ వాణీ వేధింపుల కారణంగానే నేనే ఆత్మహత్య ప్రయత్నం చేసానని శ్రీనివాస్ మాధురికి సలహా ఇచ్చిన ఆడియో తాజాగా బయటకు రావడం చర్చనీయాంశమైంది.
శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం నేపద్యంలో శనివారం సాయంత్రం హిరమండలం బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ గేట్లను మూసివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రధానంగా వంశధార ఎడమ, కుడి ప్రధాన కాలువల గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ బీ.రాంబాబు తెలిపారు. జిల్లాలోని సాగునీటి కాలువల ద్వారా నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో తుఫాన్ కారణంగా వరద పోటెత్తే ఆవకాశం ఉండడంతో గేట్లను మూసివేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.