Srikakulam

News April 9, 2024

శ్రీకాకుళం: BCY ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే

image

శ్రీకాకుళం జిల్లా భారత చైతన్య యువజన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను మంగళవారం ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ప్రకటించారు. శ్రీకాకుళం అభ్యర్థి పొనీల ప్రసాద్, ఇచ్ఛాపురం అభ్యర్థి బడ్డి మురళి, ఆమదాలవలస అభ్యర్థి సీపాన శ్రీనివాసరావులను ఆయన ప్రకటించారు. మొదటి జాబితాలో మొత్తం 32 నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించారు.

News April 9, 2024

శ్రీకాకుళం: అత్యల్ప పోలింగ్ ఇక్కడే.. ఈసారి పెరిగేనా?

image

ఉమ్మడి శ్రీకాకుళంలో జిల్లాలో 2019ఎన్నికలలో నియోజకవర్గాల వారీగా పోలింగ్ శాతం ఇలా ఉంది. ఇచ్ఛాపురం- 69.5, పలాస-72.8, టెక్కలి-78.5, పాతపట్నం-70, ఆమదాలవలస-79, ఎచ్చెర్ల-84, నరసన్నపేట-79.6, రాజాం-73.8 పాలకొండ -73.9 శాతంగా నమోదైంది. కాగా శ్రీకాకుళంలో అత్యల్పంగా 69 శాతం నమోదైంది. ఈ సారి ఆ శాతం పెరిగేలా అధికారుల చర్యలెలా ఉన్నాయి. కామెంట్ చేయండి.

News April 9, 2024

శ్రీకాకుళం: ముగిసిన పదో తరగతి మూల్యాంకనం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ సోమవారంతో ముగిసిందని డీఈవో వెంకటేశ్వరరావు వెల్లడించారు. జిల్లాకు కేటాయించిన 1,98,449 జవాబు పత్రాలను మొత్తం మూడు కేంద్రాలలో మూల్యాంకన ప్రక్రియ చేపట్టామన్నారు. 1,075 మంది ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు.

News April 9, 2024

ఇచ్చాపురం: ఎర్నాకులంకు కొత్త రైలు సేవలు

image

బ్రహ్మపురం- ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైలు(06087/06088) సేవలు సోమవారం ఇచ్చాపురంలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. 22 సెకండ్ క్లాస్ భోగిలతో కూడిన ఈ రైలు ఇచ్చాపురం స్థానిక రైల్వే స్టేషన్లో ఆగింది. బ్రహ్మపురలో మధ్యాహ్నం 12:40 నిమిషాలకు ప్రారంభమైన ఈ రైలు ఇచ్చాపురం, పలాస,శ్రీకాకుళం, విజయనగరం, దువ్వాడ, విజయవాడ, గూడూరు, మీదుగా తమిళనాడు, ఎర్నాకులం కు చేరుతుంది.

News April 9, 2024

శ్రీకాకుళం: 98.98 శాతం పింఛన్లు పంపిణీ పూర్తి

image

శ్రీకాకుళం జిల్లాలో సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ ప్రక్రియ సోమవారం నాటికి 98.98 శాతం పూర్తయింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రక్రియను చేపట్టారు. పింఛన్లు పంపిణీ ప్రత్యేక కాస్త ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా 732 గ్రామ వార్డు సచివాలయాల్లో పంపిణీ పూర్తి చేశారు. జిల్లాలో 3,21, 689 మంది గాను 3,18,392 పింఛన్లు పంపిణీ చేశామని డీఆర్డిఏ పీడీ తెలిపారు.

News April 9, 2024

కంచిలి: చెరువులో పడి వ్యక్తి మృతి

image

కంచిలి మండల కేంద్రంలో మటన్ చెరువులో సోమవారం ప్రమాదవశాత్తు మునిగి బుడ్డేపు నీలాద్రి మరణించాడు. మృతుడు, అతని భార్య జానకి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. బహిర్భూమికి కోసం వెళ్లిన నీలాద్రి చెరువులో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కంచిలి ఎస్సై జి. రాజేష్ తెలిపారు.

News April 9, 2024

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు:కలెక్టర్

image

నీటి ఎద్దడి నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ అన్నారు. విజయవాడ నుంచి సోమవారం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. నీటి సమస్యలు కోసం జిల్లాలో కంట్రోల్ రూమ్ నెంబర్లను 91001 20602, 63099 00660 ఏర్పాటు చేశామన్నారు.

News April 8, 2024

టెక్కలి: వడదెబ్బతో వృద్ధుడి మృతి

image

ఎండ తీవ్రతకు తట్టుకోలేక టెక్కలి మండలం మాధినివానిపేట గ్రామానికి చెందిన నక్క లచ్చయ్య(76) అనే వృద్ధుడు సోమవారం మృతి చెందాడు. ఆరుబయట స్నానానికి వెళ్లిన సమయంలో ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురై వృద్ధుడు కుప్పకూలిపోయాడు. గ్రామస్థులు అక్కడికి చేరుకున్న సపర్యలు చేసేలోపే వృద్ధుడు మృతి చెందాడు. ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని టెక్కలి జిల్లా ఆసుపత్రి వైద్యులు సూచిస్తున్నారు.

News April 8, 2024

టికెట్ మార్పుపై సర్వే చేపట్టడం సంతోషం: కలమట

image

పాతపట్నం నియోజకవర్గ TDP టికెట్ మార్పు విషయంపై పునఃపరిశీలన చేస్తోందని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ఈ మేరకు సోమవారం ఐవీఆర్ఎస్ నుంచి కాల్స్ వస్తున్నాయని స్పష్టం చేశారు. పార్టీ నేతల అభిప్రాయాలు తెలుసుకునేందుకు TDP అధిష్ఠానం ఉదయం నుంచి ఐవీఆర్ఎస్ సర్వే చేపడుతుందన్నారు. సీక్రెట్‌గా సర్వే చేయడంపై ఉత్కంఠ నెలకొంది. అయితే పాతపట్నం టికెట్ మామిడికి టీడీపీ కేటాయించిన విషయం తెలిసిందే.

News April 8, 2024

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు:కలెక్టర్

image

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని, ఫిర్యాదు వచ్చిన వెంటనే చర్యలు చేపట్టి 24 గంటల్లో దాని పరిష్కారించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ స్పష్టం చేశారు. సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఆర్ఓలు, ఎఆర్ఓలు, నోడల్ అధికారులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. అధికారులు, సిబ్బంది ముందస్తు అనుమతులు లేకుండా వారు పని చేస్తున్న కేంద్రాన్ని విడిచి వెళ్లరాదన్నారు.