India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రాజాం నియోజకవర్గం సంతకవిటి మండల పరిధిలోని గోళ్లవలస గ్రామంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ సమావేశంలో నియోజకవర్గం కూటమి అభ్యర్థి కొండ్రు మురళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వం అంటూనే రాష్ట్రంలో జగన్ రైతులను నట్టేట ముంచారన్నారు. పంటలు ఎండిపోవడంతో పాటు పశువులకు తాగునీరు లేని దుస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కోళ్ల అప్పలనాయుడు పాల్గొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని సోమవారం ఉదయం కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు మొండేటి స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన వారికి దేవాలయం అధికారులు ఘనస్వాగతం పలికి.. అనంతరం స్వామి వారి దర్శనం చేయించారు. ఆలయ అర్చకులు వారికి స్వామి వారి జ్ఞాపికను, తీర్థప్రసాదాలు అందజేశారు.
పోలాకి మండలం బార్జిపాడుకు చెందిన గురయ్య(70) నిన్న రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల మేరకు.. శ్యామసుందరపురంలో ఉన్న కుమార్తెను ఉగాదికి రావాలని పిలవడానికి వెళ్లి.. తిరుగు ప్రయాణం అయ్యారు. అక్కవరం సమీపంలో రోడ్డు దాటుతుండగా వ్యాన్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం టెక్కలి ఆస్పత్రికి తరలించారు.
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రాలను టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్ ఆదివారం పరిశీలించారు. మండలంలోని లింగాలవలస, శెలిగాం, పోలవరం, రాధవల్లభాపురం, గంగధరపేట, రావివలస, ధర్మనీలాపురం, తలగాం, తేలినీలాపురంలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎన్నికల సిబ్బంది ఉండేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఓటర్లకు కల్పించే సదుపాయాలను పర్యవేక్షించి పరిశీలించారు.
పోలాకి మండలం జడూరు జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై నిర్వహిస్తున్న వాహన తనిఖీలలో భాగంగా నగదు స్వాధీనం చేసుకున్నామని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి రాజు తెలిపారు. ఆదివారం అన్ని చెక్పోస్ట్ల వద్ద తనిఖీలు చేపట్టారు. పోలాకి వద్ద ఆటోలో ప్రయాణం చేస్తున్న ఒక మహిళ వద్ద నుంచి రూ. 78 వేల నగదు ఎటువంటి అనుమతులు రసీదులు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నగదును నరసన్నపేట ఎన్నికల అధికారికి అప్పగించామన్నారు.
శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి సెంటర్ హెడ్ పిచ్చిక సాగరిక ఒంగోలులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఆమె కుమార్తె ప్రియ(6) మృత్యువాత పడగా, కుమారుడికి, ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. నిన్న రాత్రి శ్రీకాకుళం నుంచి కడపలోని రైల్వే కోడూరు స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో వారు బయలుదేరారు.
ఆదివారం తెల్లవారుజామున నిద్ర మత్తులో ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
టెక్కలి మండలం అక్కవరం జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం లారీ ఢీకొని ముంజేటి గురయ్య(70) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్యాంసుందరపురం గ్రామంలోని తన కుమార్తెను చూసి తిరిగి వస్తున్న క్రమంలో అక్కవరం జాతీయ రహదారిపై శ్రీకాకుళం వెళ్తున్న గుర్తుతెలియని ఓ లారీ ఢీకొనడంతో వృద్ధుడు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఘటన స్థలాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు.
వేసవి కాలం ఆరంభం కావడంతో వంశధార నీటి జలాలు అడుగంటి పోతున్నాయి. దీనికితోడు కొంత కాలంగా వర్షాలు లేకపోవడంతో నదులు జల కళను కోల్పోతున్నాయి. తీర గ్రామాల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయి. వంశధార ప్రాజెక్టుకు సైతం నీటి జాడలు తగ్గిపోతోంది. ప్రస్తుతం నిల్వ ఉన్న దాంట్లో 150 క్యూసెక్కులు ఎడమ కాలువ ద్వారా అధికారులు విడిచిపెడుతున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు ఈ వేసవి నుంచి కొత్త వేతనం అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిందని కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ తెలిపారు. ప్రస్తుతం వారికి రోజుకు రూ.272 అందుతున్న కూలీ రూ.300కు పెరగనుందని చెప్పారు. సోమవారం నుంచి జిల్లాలో 1.82 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతారని అన్నారు. ఉపాధి పనులు ఆయా ఎంపీడీవోలు, ఏపీడీలు పర్యవేక్షించాలన్నారు.
రాజాంలోని క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న తెలగవీధి, పుచ్చలవీధికి చెందిన ఇద్దరు వ్యక్తుపై కేసు నమోదు చేసి రూ.18,500 నగదు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు రాజాం టౌన్ సీఐ మోహనరావు శనివారం రాత్రి తెలిపారు. బెట్టింగ్ నిర్వహణకు సంబంధించిన పుస్తకాలను సైతం స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. బెట్టింగ్కు పాల్పడిన, అసాంఘిక చర్యలు జరిగినా వెంటనే డయల్ 100 సమాచారం ఇవ్వాలన్నారు.
Sorry, no posts matched your criteria.