India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సచివాలయంలో ప్రజల నుంచి గురువారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో అరాచక పాలనతో నష్టపోయిన పలువురు బాధితులు తమ బాధలు తెలియజేశారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రతి అర్జీ తప్పకుండా పరిష్కారం అవ్వాలని సూచించారు. అర్జీల పరిష్కరంలో అలసత్వం వహించరాదన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఖేలో ఇండియా పథకంలో భాగంగా పాత్రునివలసలో కేంద్ర ప్రభుత్వ నిధులతో దీని నిర్మాణం పూర్తి చేసి రెండేళ్లలో క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. పాత్రునివలసలో నిర్మిస్తున్న క్రీడా వికాస ప్రాంగణంతో అన్ని క్రీడాలను ఒకే చోటుకు తీసుకువస్తామని చెప్పారు.
సీఎం చంద్రబాబును గురువారం కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సీఎంను కలిసిన ఆయన పలు అంశాలపై చర్చించినట్లు ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. చంద్రబాబును కలిసినప్పుడల్లా మరింత ఉత్సాహం వస్తుందని సామాజిక మాధ్యమాల్లో కేంద్ర మంత్రి తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో మూడు ఎఫ్ఎం స్టేషన్లు ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా 234 నగరాలు, పట్టణాల్లో ఎఫ్ఎం సేవలను ప్రారంభించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మాతృభాషలో స్థానిక కంటెంట్ను పెంచడమే కాకుండా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రైవేట్ ఎఫ్ఎం రేడియో పాలసీ కింద 730 ఛానెల్స్ ఏర్పాటు చేయనున్నారు. దీంతో త్వరలో జిల్లాలో మూడు ఎఫ్ఎం స్టేషన్లు అందుబాటులోకి రానున్నాయి.
ఉత్తర మధ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాని ఆనుకొని అల్పపీడనం ఏర్పడింది. అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, 30,31 తేదీలలో శ్రీకాకుళం వ్యాప్తంగా తీవ్రమైన వర్షాలు కురుస్తాయని తెలిపింది. సంబంధించిన ఛాయాచిత్రాలను వాతావరణశాఖ విడుదల చేసింది.
తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్పై జైలు నుంచి విడుదల అయిన విషయం విదితమే. కాగా ఈ మేరకు సుప్రీంకోర్టులో జరిగిన కవిత బెయిల్ పిటీషన్ వాదనలో కవిత తరుపు న్యాయవాదుల బృందంలో సోంపేట మండలం పాత్రపురం గ్రామానికి చెందిన అడ్వకేట్ డా.దువ్వాడ రమేష్ ఉన్నారు. సీనియర్ అడ్వకేట్ మోహిత్ రావు నేతృత్వంలో న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించగా అందులో రమేష్ సభ్యునిగా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సభాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవుతారని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో సెప్టెంబరు నెల పింఛన్ల పంపిణీ పూర్తి అయిన తరువాతే గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది బదిలీలకు సంబంధించి రిలీవింగ్ పత్రాలు ఇవ్వాలని ఎంపీడీఓలు, మున్సిపల్ కమీషనర్లకు బుధవారం ఆశాఖ స్టేట్ డైరెక్టర్ శివప్రసాద్ ఉత్తర్వులు జారీచేశారు. పింఛన్ల పంపిణీలో సచివాలయ ఉద్యోగులు కీలకంగా ఉన్న నేపథ్యంలో పింఛన్ల పంపిణీ తరువాత బదిలీ అయిన వారిని ప్రస్తుత స్థానం నుంచి రిలీవ్ చేయాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 30వ తేదీన వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. శ్రీకాకుళ నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విశిష్ట అతిథిగా రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, సభాధ్యక్షులుగా స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరవుతారని తెలిపారు.
వైసీపీతో పాటు MLC పదవికి పోతుల సునీత రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీనిపై టీడీపీ పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష స్పందించారు. ‘ఊసరవెల్లి లాంటి నాయకులను టీడీపీలోకి తీసుకోవద్దు. ఇలాంటి వాళ్లని పార్టీలో చేర్చుకుంటే కష్టపడిన వారిని అనుమానించినట్లే అవుతుంది. దయచేసి ఇలాంటి వారిని తీసుకోవద్దని టీడీపీ పెద్దలను కోరుతున్నట్లు ఆమె ‘X’ లో పేర్కొంది.
Sorry, no posts matched your criteria.