Srikakulam

News April 5, 2024

శ్రీకాకుళం: నాలుగు నియోజకవర్గాలో అభ్యర్థుల ప్రకటన

image

జైభారత్ నేషనల్ పార్టీ శ్రీకాకుళం జిల్లాలోని నాలుగు చోట్ల అసెంబ్లీ అభ్యర్థులను శుక్రవారం ప్రకటించింది. పలాస -బద్రి సీతమ్మ యాదవ్, టెక్కలి -బైపల్లి పరమేశ్వర్ రావు, శ్రీకాకుళం-రాగోలు నాగ శివ, రాజాం -కుపిలి చైతన్య కుమార్ లు పోటీ చేయనున్నారు.

News April 5, 2024

శ్రీకాకుళం: ఫించన్లు 85 శాతం పంపిణీ

image

శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఈ నెల అన్ని రకాల పింఛన్లు కలిపి మొత్తం 3,21,689 మందికి సంబంధించి సొమ్ము విడుదల చేశారు. గురువారం 2,77,353 (86.22శాతం) అందించారు. ఇంకా 44,336 మందికి పింఛన్‌ డబ్బులను అందించాల్సి ఉంది. సంతబొమ్మాళి (81.40 శాతం), లావేరు (81.56 శాతం), కోటబొమ్మాళి (81.59 శాతం), ఎల్‌ఎన్‌పేట (82.57 శాతం), గార (83.02 శాతం), సోంపేట (83.76 శాతం), తదితర మండలాలు పంపిణీలో అట్టడుగున ఉన్నాయి.

News April 5, 2024

పాతపట్నం: 81 ఓట్లతో MLAగా గెలిచి!

image

శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గానికి 1952 నుంచి 2019 వరకు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. 1952లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన పెంటన్నాయుడు, కెఎల్పి ఎమ్‌ఎస్‌నారాయణపై 81 ఓట్ల అతి స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. అలాగే 1989లో కె.మోహన్‌రావు (టీడీపీ), డి.నారాయణరావు (కాంగ్రెస్)పై 274 ఓట్లతో ఓడించి MLA అయ్యారు.

News April 5, 2024

శ్రీకాకుళం: టీ షర్ట్ కోసం అన్నదమ్ముల గొడవ.. అన్న మృతి

image

సంతబొమ్మాళి మండలం కాకరాపల్లికి చెందిన రమేశ్(31), సురేశ్ (25) అన్నదమ్ములు. గురువారం రాత్రి రమేశ్ టీ షర్ట్ ను సురేశ్ వేసుకున్నాడు. దీంతో వారి మధ్య ఘర్షణ జరిగింది. రమేశ్‌ను తమ్ముడు సురేశ్ నెట్టివేయడంతో తలకు రాయి తగిలి, తీవ్ర గాయమైంది. స్థానికులు శ్రీకాకుళంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం రమేశ్ మృతిచెందినట్లు ఎస్సై సిద్ధార్థ తెలిపారు.

News April 5, 2024

శ్రీకాకుళంలో భానుడి భగ భగ

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. ఎండతీవ్రతకు పట్టణంతో పాటుగా ఆమదాలవలస, రణస్థలం, ఎచ్చెర్ల, చిలకపాలెం, టెక్కలి, రాజాం, పొందూరు ప్రధాన రహదారులపై జనసంచారం పలుచబడింది. ఎండ వేడిమికి వృద్ధులు, పిల్లలు, వాహనదారులు అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 5, 2024

శ్రీకాకుళం: రేపటి నుంచి పాఠశాలల్లో వార్షిక పరీక్షలు

image

జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలో వార్షిక పరీక్షలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఒకటో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఈ వార్షిక పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలు ఈనెల 19వ తేదీతో ముగియనున్నాయి. ప్రశ్న పత్రాలు మండల రిసోర్స్ కార్యాలయం నుంచి పాఠశాల సముదాయాలకు.. అక్కడ నుంచి సంబంధిత పాఠశాలకు ఈ ప్రశ్న పత్రాలు వెళతాయని అధికారులు తెలిపారు.

News April 5, 2024

కాంగ్రెస్‌లో చేరిన కిల్లి కృపారాణి

image

వైసీపీకి ఇటీవలే రాజీనామా చేసిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్‌లో చేరారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో వైఎస్ షర్మిల బస్సు యాత్రలో కృపారాణి, ఆమె భర్త కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఈ సందర్భంగా షర్మిల పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు తులసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News April 5, 2024

నేడు కాంగ్రెస్‌లో చేరనున్న డా.కిల్లి కృపారాణి

image

టెక్కలికి చెందిన మాజీ కేంద్ర మంత్రి డా.కిల్లి కృపారాణి శుక్రవారం కడప జిల్లా బద్వేల్‌లో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆమె కార్యాలయ వర్గాలు తెలిపాయి. బద్వేల్‌లో ఏపీపీసీసీ చీఫ్ YS.షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో ఆమె సమక్షంలో కృపారాణి పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. కాగా ఇప్పటికే కృపారాణి బద్వేల్ చేరుకున్నారు. ఈసారి టెక్కలి అసెంబ్లీ నుండి కృపారాణి పోటీ చేస్తారని సమాచారం.

News April 5, 2024

శ్రీకాకుళం: ACCIDENT.. కానిస్టేబుల్ మృతి

image

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస అవుట్ పోస్టులో జీఆర్పీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న బొడ్డేపల్లి గన్నయ్య(44) గురువారం రాత్రి రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. విధుల్లో భాగంగా విజయనగరం వెళ్లి తిరిగి వస్తుండగా ఆర్టీసీ కాలనీ రోడ్డు వద్ద లారీ ఢీకొట్టగా చనిపోయారు. మృతుని భార్య ఫిర్యాదుమేరకు శ్రీకాకుళం రూరల్ ఎస్సై కేసు నమోదు చేశారు.  

News April 5, 2024

శ్రీకాకుళం: న్యాయమూర్తులకు స్థానచలనం

image

శ్రీకాకుళం జిల్లాలో పలువురు న్యాయమూర్తులకు స్థానచలనం కల్పిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్ గురువారం ఉత్తర్వులిచ్చారు. శ్రీకాకుళం 1వ అదనపు జిల్లా జడ్జి శ్రీదేవిని కాకినాడ జిల్లా పోక్సోకోర్టు న్యాయమూర్తిగా, వైజాగ్ మెట్రోపాలిటీ మెజిస్ట్రేట్ హిమబిందును శ్రీకాకుళం ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్‌గా, వైజాగ్ 1వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ యుగంధర్‌ను శ్రీకాకుళం అదనపు సీనియర్ సివిల్ జడ్జిగా బదిలీచేశారు.