Srikakulam

News April 2, 2024

శ్రీకాకుళం: అంగన్వాడీ కేంద్రాలకు ఒంటి పూట

image

ఈనెల 4వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట సెలవులు ఇస్తున్నట్లు ఐసీడీఎస్ సీడీపీఓ బి.శాంతి శ్రీ సోమవారం తెలిపారు. వేసవి నేపథ్యంలో జిల్లాలోని 16 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అన్ని కేంద్రాలకు ఈ నెల 31వ తేదీ వరకు ఒంటిపూట సెలవులు ఉంటాయన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవాల్సి ఉంటుందన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు కార్యకర్త కేంద్రంలో ఉండాలన్నారు.

News April 2, 2024

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం: డీజీపీ

image

సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నికల దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, సమాచారం సేకరణ వంటి అంశాలపై సోమవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి ఎస్పీ జీ.ఆర్ రాధిక, ఏఎస్పీ ప్రేమ్ కాజల్ పాల్గొన్నారు. అనంతరం ఏపీ డీజీపీ జిల్లాలోని పోలింగ్ వద్ద భద్రత వంటి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

News April 1, 2024

పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నాం: కలెక్టర్

image

సామాజిక పెన్షన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ చెప్పారు. జిల్లాలో 732 సచివాలయాల ద్వారా ఒక్కో సచివాలయానికి సగటున 456 చొప్పున పెన్షన్లను పంపిణీ చేయవలసి ఉంటుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు జిల్లా నుంచి కలెక్టర్ హాజరయ్యారు.

News April 1, 2024

శ్రీకాకుళం: విద్యార్థుల భద్రత కళాశాల యాజమాన్యానిదే : ఎస్పీ

image

కళాశాల, పాఠశాల, వసతి గృహలకు వచ్చిన విద్యార్థి విద్యార్థినీలు ప్రవర్తనను ప్రతి నిమిషం సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించాలని ఎస్పీ రాధిక సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె జిల్లాలోని వివిధ కళాశాలలు యాజమాన్యంతో విద్యార్థులు భద్రత, ఆత్మహత్యలు నివారణ వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. బోధనేతారా సిబ్బంది విద్యార్థి విద్యార్థినీలను కౌన్సెలింగ్ నెపంతో పిలిస్తే కాలేజ్ యాజమాన్యంకు చెప్పాలన్నారు.

News April 1, 2024

శ్రీకాకుళం: ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం

image

ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి ఉద్యోగికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల నిర్వహణ అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఆయన విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో హాజరయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి డా.మనజీర్ జిలానీ సమూన్ హాజరయ్యారు. ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్‌కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై సూచనలు చేశారు.

News April 1, 2024

పాలకొండ: చెరువులో పడి వ్యక్తి గల్లంతు

image

పాలకొండ నగర పంచాయతీ పరిధిలోని కోనేరులో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో స్నానం కోసం వెళ్లిన మింది ప్రభాస్(18) గల్లంతయినట్లు పాలకొండ అగ్నిమాపక అధికారి జె.సర్వేశ్వరరావు తెలిపారు. కోనేరులో ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పేర్కొన్నారు. చెరువు గట్టుపై సదరు ప్రభాస్ బట్టలు ఉన్నాయని వాటిని తండ్రి లక్ష్మణరావు గుర్తించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 1, 2024

శ్రీకాకుళం: పనసకు మంచి గిరాకీ

image

జిల్లా వ్యాప్తంగా పనస పంట సాగుచేస్తున్న ఉద్దానం ప్రాంతంలో పండే పనసకు మంచి గిరాకీ ఉంటుంది. కవిటి, కంచిలి, సోంపేట, ఇచ్ఛాపురం మండలాల్లో సుమారు 300 ఎకరాల్లో పనస పంట సాగు చేస్తుండగా.. 600 నుంచి 650 టన్నుల వరకు దిగుబడి వస్తోంది. ఈ పంట ఎక్కువగా ఒడిశా రాష్ట్రం బరంపురం, భువనేశ్వర్‌, కటక్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుండగా, కొద్ది మొత్తంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తరలిస్తున్నారు.

News April 1, 2024

టెక్కలి: పోక్సో కేసు నమోదు

image

తన కుమార్తెను ఓ వ్యక్తి వేధిస్తున్నారంటూ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు టెక్కలి సీఐ పి. పైడయ్య ఆదివారం పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భగవాన్ పురం గ్రామానికి చెందిన మహిళా డిగ్రీ కాలేజ్ కళాశాల మైదానానికి బాలిక వచ్చి వెళ్తుండగా టెక్కలికి చెందిన యువకుడు వేధిస్తుండేవాడని, దీనిపై బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ పైడియ్య కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News April 1, 2024

శ్రీకాకుళం: 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు

image

గత ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి జిల్లాలో 1,54,798 మంది రైతుల నుంచి 4,49,181 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన రైతులకు గాను రూ.980.56 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నారు. రైతులకు రవాణా ఇతర ఖర్చులు కూడా ఇందులోనే చెల్లించామని పేర్కొన్నారు.

News April 1, 2024

శ్రీకాకుళం: ఈనెల మూడో తేదీ నుంచి పింఛన్లు పంపిణీ

image

జిల్లాలో ఈనెల 3వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదివారం తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంతవరకు వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని వివరించారు. సచివాలయాల్లోనే పింఛన్ల సొమ్ము ఇస్తారని లబ్ధిదారులు ఆధార్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లి పింఛన్లు పొందవచ్చని సూచించారు.