India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మండలంలోని కొండభీంపురం గ్రామానికి చెందిన టీ.ఢిల్లీశ్వరరావు అనే వ్యక్తిపై విజయనగరం జిల్లా బొండపల్లిలో బుధవారం రాత్రి ఒక మహిళ పిర్యాదు మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. 2021 నుంచి తనని ప్రేమించి ఇప్పుడు పెళ్లికి నిరాకరించి వేరే పెళ్లి చేసుకునేందుకు సిద్ధం అవుతూ.. తనని మోసం చేస్తున్నాడు మహిళ ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కె.లక్ష్మణరావు తెలిపారు.
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ కారులో మద్యం సీసాలను తరలిస్తున్న అయిదుగురిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం గ్రామీణ మండలం సింగుపురం రహదారిలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో కారులో ఆరు మద్యం సీసాలు ఉన్నట్లు గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు కారును సీజ్ చేసినట్లు రూరల్ ఎస్సై వాసుదేవరావు తెలిపారు.
ఎచ్చెర్ల నియోజకవర్గంలో మిత్ర పక్షాల ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ నుంచి ఎన్. ఈశ్వరావును అధిష్ఠానం బుధవారం రాత్రి నిర్ణయించింది. వీరి స్వగ్రామం రణస్థలం మండలం బంటుపల్లి పంచాయితీ నడుకుదిటిపాలెం. అతని తండ్రి నడుకుదిటి అప్పలకొండ 1982 నుంచి టీడీపీలో ఉన్నారు. ఎన్. ఈశ్వరావు MBA, MCOM పూర్తి చేశారు. ఈయన విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షులుగా పని చేస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మండలంలోని మూగిపురం మండల పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చౌదరి లక్ష్మీ నారాయణ ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకుంటామని నరసన్నపేట ఆర్వో జీవీఎస్ రామ్మోహన్ రావు తెలిపారు. ఈ మేరకు సారవకోట ఎంపీడీవో ఇచ్చిన నివేదిక మేరకు చర్యలు ఉంటాయని అన్నారు. దీనిపై జిల్లా ఎన్నికల అధికారి కూడా నివేదించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఎచ్చెర్ల నియోజకవర్గ బీజేపీ-జనసేన-టీడీపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా నడుకుదిటి ఈశ్వరరావును (ఎన్ఈఆర్) బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. రణస్థలం మండలం బంటుపల్లి పంచాయతీ నడుకుదిటిపాలెంకు చెందిన ఈయన తొలిసారిగా 2014లో టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల తరువాత.. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ పట్ల ఆకర్షితుడైన ఎన్ఈఆర్ బీజేపీలో చేరారు. ఈయన ప్రస్తుతం విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షునిగా కొనసాగుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఈవీఎం గోదాములను జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలసి బుధవారం తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా అక్కడి భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గోదాములను తెరిపించి, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన బ్లాకులను, ఈవీఎంలను పరిశీలించారు.
పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన మద్దిల జోగారావు (40), జమ్మూకశ్మీర్ ఉదంపూర్లోని యూనిట్లో జేసీఓ క్యాడర్లో విధులు నిర్వహిస్తున్నాడు. సోమవారం రాత్రి విధి నిర్వహణలో ఉండగా ఆత్మహత్య చేసుకున్నట్లు మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. జమ్మూకశ్మీర్ నుంచి ఈ రోజు సాయంత్రానికి మృతదేహం స్వగ్రామానికి తీసుకొస్తున్నట్లు సమాచారం.
ఆమదాలవలసలో 1978 నుంచి 11 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ నియోజకవర్గంలో జరిగిన అన్ని ఎన్నికలలో కంటే 2009లో బొడ్డే పల్లి సత్యవతి ఐ.కాంగ్రెస్ నుంచి ప్రజారాజ్యం అభ్యర్థి తమ్మినేని సీతారాంపై16,209 ఓట్ల అత్యధిక మెజార్టీతో విజయ కేతనం ఎగురవేశారు. 2024 ఎన్నికలకు ఇక్కడ YCP నుంచి తమ్మినేని సీతారాం, TDP నుంచి కూన రవికుమార్ బరిలో ఉన్నారు. ఈసారి వీరు ఆ మెజార్టీని దాటగలరని మీరు అనుకుంటున్నారా..కామెంట్ చేయండి
ఎచ్చెర్ల కూటమి సీటు ఇంకా కేటాయించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. 2014లో YCP అభ్యర్థి జి.కిరణ్ కుమార్పై,TDP అభ్యర్థి కళావెంకట్రావు గెలుపొందారు. 2019లో కూడా వీరే ప్రత్యర్థులుగా ఉండగా ఈసారి TDPపైYCP జెండా ఎగిరింది. 2024 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసేందుకు YCP నుంచి గొర్ల కిరణ్ కుమార్ను అధిష్ఠానం బరిలో దింపింది. మరి కూటమి నుంచి ఎవరు పోటీ ఇస్తారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఈనెల 31న విశాఖలో జరిగే చెన్నై సూపర్కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ఈరోజు ఉ.10 గంటల నుంచి పేటీఎం ఇన్సైడర్ వెబ్సైట్ ద్వారా ప్రారంభం కానున్నాయి. టికెట్ల ధరలు రూ.1,000, రూ.1,500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.5వేలు, రూ.7,500గా నిర్ణయించారు. ఆన్లైన్లో మాత్రమే టికెట్ల అమ్మకాలు జరుగుతాయి. రేపు CSK జట్టు, ఎల్లుండి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశాఖ రానున్నట్లు సమాచారం.
Sorry, no posts matched your criteria.