Srikakulam

News August 17, 2024

న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్మించిన జిల్లా జడ్జి

image

శ్రీకాకుళం జిల్లా కోర్ట్ ఆవరణలో శనివారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా జిల్లాలో గల న్యాయమూర్తులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 14న జరగబోయే లోక్ అదాలత్ కక్షిదారులకు ఒక మంచి అవకాశం అని, రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులను, సివిల్ కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసులను ఎక్కువ చేయాలని అతను కోరారు. కార్యక్రమంలో సన్యాసినాయుడు, ఇతర న్యాయమూర్తులు పాల్గొన్నారు.

News August 17, 2024

దువ్వాడ వాణికి 41ఏ నోటీసులు జారీ

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ భార్య దువ్వాడ వాణీకి శనివారం టెక్కలి పోలీసులు 41ఏ నోటీసులను జారీ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ శ్రీనివాస్ నివాసం ఆవరణలో నిరసన తెలుపుతున్న వాణీకి నోటీసులు అందజేసేందుకు టెక్కలి పోలీసులు వెళ్లారు. అయితే తానే స్వయంగా టెక్కలి పోలీస్ స్టేషన్‌కు వచ్చి నోటీసులు తీసుకుంటానని వాణి పోలీసులకు వివారించారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదంలో వాణిపై కేసు నమోదైన విషయం విధితమే.

News August 17, 2024

శ్రీకాకుళం: నెహ్రూ యువజన కేంద్రంలో జాబ్ మేళా

image

శ్రీకాకుళం నగరంలో నెహ్రూ యువజన కేంద్రంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొత్తలంక సుధా తెలిపారు. ఈ జాబ్ మేళాలో KL గ్రూప్ అమెజాన్ వేర్ హౌస్ కంపెనీ పాల్గొంటుందని 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన 18-35 సంవత్సరాల అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులని అలాగే ఎంపికైన వారికి నెలకు 18,000 జీతం ఉంటుందని తెలిపారు.

News August 17, 2024

శ్రీకాకుళంలో నేటి నుంచి సాఫ్ట్‌బాల్ చాంపియన్షిప్

image

రాష్ట్రస్థాయి జూనియర్స్ బాలబాలికల సాఫ్ట్‌బాల్ ఛాంపియన్షిప్ 2024 పోటీలకు శ్రీకాకుళం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పోటీలు ఆగస్టు 17 నుంచి 19వ తేదీ వరకు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో జరగనున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి క్రీడాకారులు కోచ్ మేనేజర్లు 496 మంది ఈ స్పోర్ట్స్ మీట్ కు హాజరు కావాలన్నారు. ఈ పోటీలో పాల్గొనే వారికి వసతి భోజనం ఏర్పాట్లు అని కూడా అధికారులు కల్పించనున్నారు.

News August 17, 2024

శ్రీకాకుళం: APEAP CET మూడో విడత కౌన్సెలింగ్

image

ఏపీఈఏపీ సెట్-2024 ప్రవేశాలకు సంబంధించి మూడో విడత కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్‌లు పూర్తవ్వగా హాజరు కాని అభ్యర్థులుకు మూడో విడత కౌన్సెలింగ్‌కు మరో అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం కళాశాలలో సీటు లభించిన విద్యార్థులు బ్రాంచీలు మార్చుకునే అవకాశం కల్పించనున్నారు. సమస్య ఉంటే శ్రీకాకుళం ప్రభుత్వం పాలిటెక్నిక్‌ను సంప్రదించాలని సమన్వయకర్త దామోదర్ రావు తెలిపారు.

News August 17, 2024

జలుమూరు: దర్యాప్తునకు హాజరు కావాలని దివ్యాంగులకు నోటీసులు

image

జలుమూరు మండలం సైరిగాం పంచాయతీలో పలువురు నకిలీ దివ్యాంగ ధ్రువపత్రాలతో పింఛను పొందుతున్నారని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 20న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సదరం ధ్రువపత్రాల నిర్ధారణకు హాజరు కావాలని 33 మంది పింఛనుదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దర్యాప్తునకు హాజరు కాకపోతే అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగిస్తామన్నారు.

News August 17, 2024

శ్రీకాకుళం: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

రేపు జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కత RCKAR ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై జరిగిన పాశవిక హత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో 24 గంటలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు IMD ఓ ప్రకటన విడుదల చేసింది.

News August 17, 2024

శ్రీకాకుళం: రేపు జిల్లా వ్యాప్తంగా వైద్య సేవలు బంద్

image

రేపు జిల్లా వ్యాప్తంగా 24 గంటలు పాటు వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కత RCKAR ప్రభుత్వ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న వైద్యురాలిపై జరిగిన పాశవిక హత్యాచారానికి నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నేతృత్వంలో 24 గంటలు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు IMD ఓ ప్రకటన విడుదల చేసింది.

News August 16, 2024

శ్రీకాకుళం జిల్లాలోని TODAY TOP NEWS

image

➤ పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి: ఎస్పీ మహేశ్వరరెడ్డి ➤ శ్రీకాకుళం రిమ్స్ పారామెడికల్ కోర్సుల్లో దరఖాస్తు ఆహ్వానం ➤ పలువురు పోలీసు సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ ➤ అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వండి: మంత్రి అచ్చెన్న ➤ విజయనగరం రైల్వే ట్రాక్పై జిల్లా వాసి అనుమానస్పద మృతి ➤ దివ్యాంగులకు కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం ➤ కొలిక్కిరాని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాదం

News August 16, 2024

కోటబొమ్మాళి: యువకుడు అనుమానాస్పద మృతి

image

విజయనగరం సమీపంలోని రాళ్లమళ్లపురం గ్రామం పరిధిలోని రైల్వే ట్రాక్‌పై శుక్రవారం కోటబొమ్మాళి మండలం చిన్నహరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన ఉప్పాడ జగదీశ్ (25) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రైల్వే పోలీసులు వివరాల ప్రకారం.. జగదీశ్‌ విశాఖపట్నంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడని వివరించారు. విజయనగరం ఎందుకు రావాల్సి వచ్చిందని, హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.