Srikakulam

News March 26, 2024

ఆమదాలవలస: విరిగిన ఆటో చక్రం… తప్పిన ప్రమాదం

image

ఆమదాలవలస నుంచి శ్రీకాకుళం వెళ్లే ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తిస్థాయిలో జరగకపోవడంతో గోతుల రహదారిలోనే ప్రయాణించాల్సి వస్తుందని పలువురు వాహనదారులు వాపోతున్నారు. తాజాగా సోమవారం రాత్రి గోతిలో దిగబడిన ఆటో ముందు చక్రం విరిగిపడింది. అయితే ఆ సమయంలో వెనుక నుంచి వస్తున్న లారీ డ్రైవర్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పిందని ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణ తెలిపారు. రహదారిని బాగు చేయాలని కోరారు.

News March 25, 2024

శ్రీకాకుళం: అక్కడ ఒకరోజు తర్వాత హోలీ 

image

పర్లాకిమిడి గజపతి రాజులుచే నిర్మించిన లివిరి గోపీనాధస్వామి ఆలయంలో ఒడిశా సంప్రదాయం ప్రకారం మంగళవారం హోలీ జరుపుకుంటారు. తిరువీధి, వంశధార నదిలో చక్రతీర్థ స్నానాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. గోపినాధస్వామి హోలీ ఉత్సవానికి ఆంధ్రా, ఒడిశా నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. ఈ ఉత్సవంలో పర్లాకిమిడి మహారాజు వంశీయులు పాల్గొనడం ఆనవాయితీగా వస్తుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. 

News March 25, 2024

శ్రీకాకుళం: పాము కాటుతో మహిళ మృతి

image

కోటబొమ్మాళి మండలం హరిశ్చంద్రపురం పంచాయతీ చిన్న హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన చింతాడ చెల్లమ్మ (46) పాము కాటుతో సోమవారం మృతి చెందింది. ఇటీవల పొలం పనులు చేస్తుండగా పాము కాటు వేసింది. శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు దుర్గారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్సై షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

News March 25, 2024

శ్రీకాకుళం: రూ.రెండు లక్షల నగదు, కారు సీజ్

image

సరుబుజ్జిలి మండలం అమృతలింగానగరం వద్ద కారులో తరలిస్తున్న రెండు లక్షల రూపాయల నగదు, కారును సీజ్ చేసినట్లు ఎస్సై బి.నిహార్ తెలిపారు. బూర్జ, సరుబుజ్జిలి మండలాలకు సంబంధించిన 2024 సాధారణ ఎన్నికల ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్ -1 సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా హిరమండలానికి చెందిన రత్నాల రమ మోహనరావు బిల్లులు లేకుండా తరలిస్తున్న సొమ్మును పట్టుకున్నట్లు ఎస్సై చెప్పారు. దీనిపై కేసు నమోదు చేశామన్నారు.

News March 25, 2024

శ్రీకాకుళం: ‘గంజాయి తరలిస్తున్న నలుగురు అరెస్ట్’

image

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న నలుగురు యువకులను పాతపట్నం పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఒడిశాలోని మోహన బ్లాక్ పరిధిలోని అడవ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పాతపట్నం నుంచి హైదరాబాద్ కేంద్రానికి గంజాయి తరలిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేయగా వారు చిక్కారు. వారి నుంచి సుమారు రూ.1,20,000/- విలువ గల 24 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

News March 25, 2024

పాలకొండ: కట్టె జనుము సాగుతో రైతులకు అపార నష్టం

image

కట్టె జనము సాగుతో రైతులకు అపారనష్టం వాటిలిందని పాలకొండ అభ్యుదయ రైతు ఖండాపు ప్రసాదరావు సోమవారం తెలిపారు. సుమారు 50 శాతం మంది రైతులు అపరాల పంటలకు బదులుగా కట్టె జనుము సాగు చేశారని అన్నారు. గొంగళి పురుగు ఆశించడంతో కాయలు నాశనం అయ్యాయని పేర్కొన్నారు. జిల్లా పునర్విభజన అనంతరం రైతులకు సలహాలు సూచనలు ఏరువాక కేంద్రం శాస్త్రవేత్తల నుంచి దూరమయ్యాయని వాపోయారు.

News March 25, 2024

టీడీపీ ప్రమాదంలో చిక్కుకున్న మాట వాస్తవం: మాజీ మంత్రి

image

శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ ప్రమాదంలో చిక్కుకున్న మాట ఎవరు అవునన్నా,  కాదన్నా వాస్తవమేనని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. శ్రీకాకుళంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లా టీడీపీ ముఖ్య నేతలు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించడమే దీనికి కారణమన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి చర్యలు తీసుకోకుండా, ఆయనకు సీటు ఇవ్వడం తగదన్నారు.

News March 25, 2024

శ్రీకాకుళం: జాతీయ రహదారిపై వ్యాన్ బోల్తా

image

పలాస మండలం శాసనాం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఓ ఐచర్ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ చిన్నకు గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తూ.. వాహనాన్ని క్రేన్ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించారు.

News March 25, 2024

శ్రీకాకుళం నుంచి ఆరుసార్లు గెలిచారు

image

ప్రస్తుత రాజకీయాల్లో హ్యాట్రిక్ కొట్టడమే గగనంగా మారిపోయింది. అలాంటిది శ్రీకాకుళం లోక్‌సభ స్థానం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు 1952 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా కాంగ్రెస్ అభ్యర్థి పి.ఎల్.ఎన్.రాజును పోటీ చేసి గెలుపొందారు. తర్వాత 1957-84 ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేదు. ఆయనది ఆమదాలవలస మండలం అక్కులపేట.

News March 25, 2024

శ్రీకాకుళం: విద్య అందరికీ అందుబాటులో ఉండాలి

image

విద్యారంగంలో లౌకిక భావజాలం అవసరమని, విద్య అందరికీ అందుబాటులో ఉండేలా రూపొందించాలని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నగరంలోని అంబేడ్కర్ కళా వేదికలో అప్పారి వెంకటస్వామి 23వ వర్ధంతి సందర్భంగా విద్యారంగం-లౌకిక భావజాలం అనే అంశంపై సదస్సు ఆదివారం నిర్వహించారు. సమాజంలో ఉత్పత్తి క్రమం ప్రారంభించి 12 వేల సంవత్సరాలు మాత్రమే అయిందన్నారు.