Srikakulam

News March 18, 2024

ఆమదాలవలస: ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ కచ్చితంగా పాటించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. ఆమదాలవలస రెవెన్యూ కార్యాలయంలో సోమవారం ఎన్నికల నియమావళి పై నియోజకవర్గ స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. పోటీలో నిలిచే అభ్యర్థుల ఎన్నికల ఖర్చులకు సంబంధించిన వివరాలను సక్రమంగా సమర్పించాలన్నారు. సమస్యలుంటే 90323 18521 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

News March 18, 2024

కోటబొమ్మాలి: స్వేచ్ఛగా ఓటు వేయండి: కలెక్టర్

image

ఓట‌ర్లు త‌మ ఓటుహ‌క్కును నిర్భ‌యంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సమూన్ పిలుపునిచ్చారు. కోటబొమ్మాళి మండలంలో ఆయన రిజర్వు పోలీసు దళాల ఫ్లాగ్ మార్చ్ లో సోమవారం మధ్యాహ్నం పాల్గొన్నారు. ఓటర్లు ఎటువంటి భ‌య‌బ్రాంతుల‌కు, ప్ర‌లోభాల‌కు గురికావ‌ద్ద‌ని సూచించారు.

News March 18, 2024

శ్రీకాకుళం: ఎన్నికల విధులకు మాజీ సైనికులు పేర్లు నమోదు:ఎస్పీ

image

సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించడానికి మాజీ సైనిక ఉద్యోగస్థులు ముందుకు రావాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక కోరారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో సైనిక బోర్డులో సభ్యత్వం ఉన్న మాజీ సైనిక ఉద్యోగస్థులతో ఎన్నికల విధులపై సమీక్షించారు. జిల్లాలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల బందోబస్తు విధులకు 60ఏళ్ల లోపు మాజీ సైనికులు వివరాలతో ఈ నెల 25లోగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు.

News March 18, 2024

టెక్కలి: ఎన్నికల కోడ్ అమలపై అధికారులకు సూచనలు

image

టెక్కలిలో సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలానీ సామున్ పర్యటించారు. స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద రెవెన్యూ అధికారులు, పోలీసులతో సమీక్షించిన ఆయన ఎన్నికల కోడ్ అమలుపై అధికారులకు సూచనలు చేశారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుపై ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణ ఉండాలన్నారు. ఈయనతో పాటు టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్, జిల్లా పోలీసు అధికారులున్నారు.

News March 18, 2024

శ్రీకాకుళం: బార్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా విజయలక్ష్మి భాయి

image

హైకోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆమదాలవలస బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆమదాలవలస బార్ అసోసియేషన్ అధ్యక్షురాలుగా కనితి విజయలక్ష్మి భాయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి సాధు ధనుంజయరావు వెల్లడించారు. రాష్ట్రంలో ఎన్నికైన తొలి మహిళ అధ్యక్షురాలుగా ఆమె రికార్డు సృష్టించారు. ఉపాధ్యక్షులుగా రమణమూర్తి, కార్యదర్శిగా ఎ.విజయ్ కుమార్, సహాయ కార్యదర్శిగా బీ.మోహన్‌రావు ఎన్నికైనట్లు ప్రకటించారు.

News March 18, 2024

శ్రీకాకుళం: పదో తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

image

శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ సోమవారం పరిశీలించారు. విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఆయా గదుల్లో తిరుగుతూ.. పరీక్ష నిర్వహణ తీరును పర్యవేక్షించారు. విద్యార్థుల హాజరును కలెక్టర్ ఆరా తీశారు. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని ఎలాంటి పొరపాట్లకు తావివొద్దన్నారు.

News March 18, 2024

సీతంపేట: లారీ ఢీ.. ఇంటర్ విద్యార్థి మృతి

image

సీతంపేట మండలం కడగండి గ్రామ యువకుడు పాలక కళ్యాణ్, మరో ఇద్దరు 15వ తేదీ ఇంటర్ పరీక్ష రాసి అనంతరం స్నేహితుని రూమ్‌లో ఉండి.. ఆదివారం భామిని నుంచి ఇంటికి వచ్చే క్రమంలో లారీ ఢీకొంది. స్థానికులు వెంటనే 108లో శ్రీకాకుళం రిమ్స్‌కి తీసుకువెళ్లారు. మార్గమధ్యలో ఒకరు చనిపోగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు కమ్ముకున్నాయి. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News March 18, 2024

శ్రీకాకుళం: పోలీసు స్పందన కార్యక్రమం రద్దు

image

సార్వత్రిక ఎన్నికల నియమావళి (మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్) అమలులో ఉన్నందున, శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించాల్సిన పోలీసు స్పందన కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక సోమవారం తెలియజేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంతకాలం స్పందన కార్యక్రమం నిర్వహించబడదని ప్రజలు, ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News March 18, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి పాఠశాలలకు ఒంటిపూట బడులు

image

వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా.. పాఠశాలల్లో నేటినుంచి ఒంటి పూట నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కే వెంకటేశ్వరరావు ఆదివారం వెల్లడించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయని స్పష్టం చేశారు. పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పనిచేస్తాయని పేర్కొన్నారు.

News March 18, 2024

టెక్కలి పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్‌లు

image

టెక్కలిలోని ఐదు గ్రామ సచివాలయాల సిబ్బందితోపాటు, మండలంలోని పలువురు గ్రామీణ ప్రాంత పంచాయతీ కార్యదర్శులకు ఆదివారం టెక్కలి ఎంపీడీఓ కె. విజయలక్ష్మి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. టెక్కలి మేజర్ పంచాయతీతో పాటు గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలుకు సంబంధించిన విధులకు గ్రామ సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు హాజరుకాకపోవడంపై నోటీసులు జారీ చేశారు. ఇదే అంశాన్ని టెక్కలి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నివేదించారు.