India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పాలీసెట్-2024 రెండు విడతలు కౌన్సెలింగ్ పూర్తి కాగా, కళాశాలల్లో మిగులు సీట్లకు బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. విద్యార్థులు నేరుగా 9.30 గంటలకు కళాశాలను సంప్రదించాల్సి ఉంటుంది. జిల్లాలో ఐదు ప్రభుత్వ, ఐదు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాల, ఆమదాలవలస, టెక్కలి, సీతంపేట ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.
సర్కారు బడుల్లో ఎన్నికల సందడి మొదలుకానుంది. మంగళవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఆగస్టు 1న నోటిఫికేషన్ జారీ చేసి, ఆగస్టు 8న పేరెంట్స్ మానిటరింగ్ కమిటీ(పి.ఎం.సీ) నిర్వహించినట్లు జీవోలో స్పష్టం చేసింది. ఆగస్టు 1న తల్లిదండ్రుల జాబితాను ప్రచురించి, ఆగస్టు 5న అభ్యంతరాలను స్వీకరించి, అదే రోజు ఓటర్ల తుది జాబితా(తల్లిదండ్రులు) ప్రచురణ చేసి ఆగస్టు 8న పీఎంసీ ఎన్నికలను నిర్వహిస్తారు.
ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి తొలి విడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసింది. ఈ మేరకు కౌన్సిలింగ్ అలాట్ మెంట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొదటి విడతలో 2154 సీట్లకు 1847 ప్రవేశాలు జరిగాయి. అనంతరం తుది విడతలో 1903 మంది అభ్యర్థులకు ప్రవేశాలు జరిగాయి. మొత్తం జిల్లాలో 88.34 శాతం ప్రవేశాలు జరిగాయి.
టెక్కలి మండలం చాకిపల్లి గ్రామానికి చెందిన బొమ్మాళి జ్యోతి అనే మహిళ తనపై గ్రామానికి చెందిన కొంత మంది వ్యక్తులు దాడి చేశారని మంగళవారం టెక్కలి పోలీసులకు పిర్యాదు చేసింది. గ్రామానికి చెందిన పంగ చంద్రమౌళి, వాన నారాయణ, పొందర శ్రీనివాసరావు, యాళ్ల అప్పారావు, యాళ్ల హేమలత తనపై దాడి చేసి దుర్భాషలాడారని ఫిర్యాదులో పేర్కొంది. టీడీపీకి ఓటు వేశారని అక్కసుతోనే దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
శ్రీకాకుళం జిల్లా పైడిభీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతీ, యువకుడు మృతిచెందిన విషయం విదితమే. మృతులు మందస మండలం కడుముసాయి గ్రామానికి చెందిన సవర హర్యాని(25), సవర జీవన్ (21)గా పోలీసులు గుర్తించారు. ఇందులో వదిన, మరిది దుర్మరణం పాలయ్యారు. తణుకు నుంచి బైక్ పై గ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో ఘటన జరిగింది. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు.
రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకొని విద్యుత్ బిల్లును తగ్గించుకోవాలని జిల్లా విద్యుత్ పంపిణీ సంస్థ సూపరిండెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి కృష్ణమూర్తి తెలిపారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ దీనికి సంబంధించిన కరపత్రాలను మంగళవారం ఆవిష్కరించారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు కోసం, విద్యుత్ సమస్యలు పరిష్కారం కోసం 1912 టోల్ ఫ్రీ ఏర్పాటు చేశామన్నారు.
శ్రీకాకుళం జిల్లా పైడి భీమవరం జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలాస మండలం గొప్పిలి ప్రాంతానికి చెందిన యువతీ, యువకుడు మృతిచెందారు. జాతీయ రహదారి ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపుతప్పడంతో రోడ్డుపై పడి యువతి మృతిచెందగా.. ఫ్లై ఓవర్ పైనుంచి కిందపడి యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఏపీ సార్వతిక విద్యాపీఠం (APOS) ద్వారా 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్మీడియట్ తరగతులకు అడ్మిషన్ పొందడానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పదో తరగతి చేరుటకు 14 ఏళ్లు, ఇంటర్మీడియట్ చేరుటకు 15 ఏళ్లు నిండిన వారు అర్హులు. అప్లికేషన్ ప్రారంభం తేదీ 31-07-2024, అప్లికేషన్ చివరి తేదీ 27-08-2024. వెబ్ సైట్: www.apopenschool.ap.gov.in
చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎమ్మెల్యే కూన రవికుమార్ అన్నారు. ఆమదాలవలసలోని పాలపోలమ్మ అమ్మవారి ఆలయం ఆవరణలో జరుగుతున్న ‘ఆకలి’ చిత్ర షూటింగ్ను మంగళవారం ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. కళింగ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై అప్పారావు దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. కార్యక్రమంలో చిత్ర హీరోలు, హీరోయిన్స్, నటులు సనపల అన్నాజీరావు, కృష్ణారావు, టీడీపీ నాయకులు తంబి, రమేశ్ పాల్గొన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలో ఎంసీఏ రెండో సెమిస్టర్, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ రెండో సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. సెప్టెంబర్ 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మంగళవారం తెలిపారు. పరీక్షల టైం టేబుల్ను యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
Sorry, no posts matched your criteria.