India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం టూ టౌన్ కానిస్టేబుల్ మాధవ్ మంగళవారం మృతిచెందారు. ఇటీవల స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విజయవాడ ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో ఈరోజు ఉదయం మృతిచెందారు. జిల్లాలోని పలువురు పోలీసులు ఆయనకు సంతాపం తెలిపారు. కాగా, రణస్థలం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ఎం.సతీశ్ కూడా అనారోగ్యంతో ఈరోజు వేకువజామున మృతిచెందారు.
తన మాటలు, రచనలతో ఉత్తరాంధ్ర మాండలిక విశిష్టతను జిల్లాకు చెందిన రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) విశ్వవ్యాప్తి చేశారు. శ్రీకాకుళంలో 1922 జులై 30న జన్మించి, న్యాయవాది వృత్తిలో స్థిరపడి తన వద్దకు వచ్చే క్లయింట్లు, అణగారిన వర్గాలు, పేదల జీవితాలనే తన కథా వస్తువులుగా చేసుకొని ఎన్నో సృజనాత్మక, కవితాత్మక రచనలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు.
రణస్థలం మండల పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ మృతి చెందిన ఘటన జరిగింది. వివరాలకు వెళితే స్థానిక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎం.సతీష్ ఇటీవల అనారోగ్యం పాలయ్యారు. ఈ క్రమంలో ఆయన వైద్య సహాయం పొందుతున్నారు. అయితే మంగళవారం వేకువజామున ఆయన మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో స్థానిక పోలీసులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం హుకుంపేట గ్రామానికి చెందిన కొమర యర్రన్న గోవాలో వేటకు వెళ్లి బోటులో కాలు జారి కిందపడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. ఎర్రన్న మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరారు.
లావేరు మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఒకే గదిలో మూడు అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ముగ్గురు కార్యకర్తలు, ముగ్గురు ఆయాలు, పిల్లలకు వచ్చే సరకులు, ఆట వస్తువులు, సిలిండర్లు ఉన్నాయి. ఫలితంగా చిన్నారులకు అవస్థలు తప్పలేదు. అక్కడ సిలిండర్ల ఉండటంతో ఏదైనా ప్రమాదం సంభవిస్తే పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. కొత్త భవనం పనులు 90 శాతం పూర్తయ్యాయని సీడీపీవో ఝాన్సీబాయ్ తెలిపారు.
పొందూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో జూనియర్ అసిస్టెంట్గా బినామీ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై సోమవారం పోలీసులు విచారణ చేపట్టారు. పాఠశాలలో దివ్యాంగుల కోటాలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించిన మహిళకు బదులుగా ఈయన విధులు చేస్తున్నాడు. పాఠశాలలో కొంతమంది విద్యార్థినులకు వాట్సాప్లో అసభ్య మెసేజ్లు పెడుతున్నారని టీచర్లు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేయాల్సిందిగా ఎస్ఐను SP ఆదేశించారు.
పూండి-నౌపడ సెక్షన్లో పలు రైళ్లను రీషెడ్యూల్ చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ అధికారులు తెలిపారు. ఆగస్టు 1న భువనేశ్వర్-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ (12830) గంట ఆలస్యంగా మధ్యాహ్నం 1.10 గంటలకు, ఆగస్టు 3న పూరీ-గాంధీధాం (22974) గంటన్నర ఆలస్యంగా మ. 12.45 గంటకు, భువనేశ్వర్-తిరుపతి (22879) గంట ఆలస్యంగా మ.1.10 గంటకు బయలుదేరుతుంది. ఈ నెల 29, ఆగస్టు 1,3 తేదీల్లో విశాఖ-పలాస-విశాఖ మాత్రమే రాకపోకలు సాగిస్తుంది.
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రజల నుంచి 200 అర్జీలను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
➤ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నంగా ఉంది: మంత్రి అచ్చెన్న➤ బడ్జెట్పై భయమెందుకు బాబు: ధర్మాన కృష్ణ దాస్➤ 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి చర్యలు తీసుకోవాలి: కలెక్టర్➤ ఆగస్టు 3న రెండో విడత IIIT మెరిట్ జాబితా➤ APSRTCలో అప్రెంటిస్ల కోసం దరఖాస్తు➤ ఎస్పీ ప్రజా ఫిర్యాదుకు 58 ఫిర్యాదులు➤ సోంపేట టీడీపీ సీనియర్ నాయకుడు మృతి➤ గారలో సాగునీటి కోసం తోపులాట.. వృద్ధుడు మృతి
APSRTCలో అప్రెంటిషిప్ కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా అధికారి సోమవారం తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రికల్, డ్రాఫ్ట్ మెన్ , సివిల్ ట్రేడుల్లో దరఖాస్తుకు అవకాశాలు ఉన్నట్లు తెలిపారు. వివరాలకు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్ను చూడాలన్నారు. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 16.
Sorry, no posts matched your criteria.