India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
మోసపూరిత హామీలు ఇవ్వడం, అధికారంలోకి రాగానే వాటిని మర్చిపోవడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ దుయ్యబట్టారు. ఈ మేరకు సోమవారం ఆయన పోలాకిలో ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా మరో 3 నెలలు ఓటాన్ అకౌంట్కు వెళ్లిందన్నారు. సూపర్ సిక్స్ను అమలు చేయకుండా ఉండేందుకు ఆయన కొత్త ఎత్తుగడ వేశారన్నారు.
ఆర్జీయూకేటి పరిధిలో శ్రీకాకుళంలో 863 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందిన విషయం తెలిసిందే. ఈ మేరకు రెండో విడత మెరిట్ జాబితా వివరాలను ఆగస్టు 3వ తేదీన ప్రకటించనున్నారు. తొలి విడత కౌన్సెలింగ్లో సీటు పొందిన విద్యార్థులు క్యాంపస్ మార్పు కావాలంటే rgukt.in వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. వెబ్సైట్ లింక్ ఈనెల 30వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉంటుందని డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ తెలిపారు.
గతంలో ఎదురైన సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ 1వ తేదీ నాడే శతశాతం జరగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆగస్టు 1వ తేదీ ఉదయం 5.30కి పంపిణీ ప్రారంభించి మొదటి రోజునే శత శాతం పంపిణీ జరగాలన్నారు.
కళింగపట్నం ఓడరేవు శ్రీకాకుళం గార మండలంలో ఉంది. బంగాళాఖాతం బడ్డున ఉన్న ప్రాచీన ఓడరేవుగా ప్రసిద్ధి. రాష్ట్రమంతటా పేరుగాంచిన శ్రీకళాంజలి సాంస్కృతిక సంస్థ ఇక్కడిదే. ఇక్కడే వంశధార నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇక్కడ మదీనా సాహేబ్ సమాధి ఉంది. బ్రిటిష్ వారు లైట్ హౌస్ను 1876 నిర్మించారు. దీనిని మళ్లీ ప్రభుత్వం 1982లో పునర్నిర్మించింది. కళింగపట్నం బీచ్ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.
గార మండలం కోళ్లపేట గ్రామంలో సాగునీటి కోసం జరిగిన తోపులాటలో వృద్ధుడు మృతి చెందిన ఘటన జరిగింది. గ్రామానికి చెందిన తట్ట తౌడు(70) తన పొలానికి వెళ్తున్న సాగునీరు వంజల సునీత పొలం మీదుగా వెళుతుండడంతో నీటిని తౌడు తన పొలానికి మళ్లించాడు. ఇది తెలుసుకున్న సునీత పొలం వద్దకు వచ్చి ఘర్షణకు దిగి ఒకరికొకరు తోసుకోగా తౌడు కిందపడి గాయపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
పాతపట్నంకు చెందిన శోభనాపురపు రాజేశ్వరరావు గత కొంతకాలంగా కుటుంబంతో పాటు విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో నివాసం ఉంటున్నాడు. అతని కుమారుడు శోభనాపురపు యువరాజు (23) పెదవాల్తేరుకు చెందిన మైనర్ బాలికను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. అతని మాయమాటలతో ప్రేమలో పడిన అమ్మాయిని ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు యువకుడు పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
సారవకోట మండలంలోని అంగూరు, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకుల పోస్టుల భర్తీ ప్రక్రియ వచ్చే నెల 3వ తేదీలోగా పూర్తిచేయాలని ఉన్నతాధికారులు సూచించినట్లు ఉపాధిహామీ పథకం ఏపీవో నారాయణరావు తెలిపారు. అంగూరు క్షేత్ర సహాయకుడు మృతి చెందగా ఆ పోస్టు ఖాళీ అయ్యిందని, అన్నుపురం, గొర్రిబంద క్షేత్ర సహాయకులు ఇటీవల రాజీనామా చేసినట్లు చెప్పారు. కిడిమి పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ న్యాయస్థానంలో విచారణలో ఉందన్నారు.
జిల్లాలో ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయని వాటి వివరాలను సంపూర్ణంగా తనకు అందజేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పర్మాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. ఆదివారం జిల్లా పర్యాటక శాఖ ఏడీ, నడిమింటి నారాయణరావు తన సిబ్బందితో కలిసి జేసీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జేసీ మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర కలిగిన జిల్లాలో పర్యాటక కేంద్రాలతోపాటు పలు చారిత్రక ఆలయాలు ఉన్నాయని వాటి వివరాలు తెలపాలన్నారు.
సీతంపేటలోని ఆడలి వ్యూ పాయింట్ పనులను ITDA, PO రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఆడలి వ్యూ పాయింట్ పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం సీతంపేట సంతను పరిశీలించి, పైనాపిల్, ఇతర ఉత్పత్తుల ధరలను గిరిజనులను గురుకుల పాఠశాలను పరిశీలించి, తాగు నీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వం పరిధిలో అగ్నివీర్, అగ్నిపథ్ స్కీం కింద ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో దరఖాస్తు చేసుకోవడానికి గడువు నేటితో ముగియనుంది. ఈనెల 8 నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకు గడువు ముగియనుంది. అవివాహిత యువత ఇంటర్, 10వ తరగతిలో 50శాతం ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు agnipathvayu.cdac.in వెబ్ సైట్ను సందర్శించాలన్నారు.
Sorry, no posts matched your criteria.