India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం జిల్లాలో శాఖాపరమైన పరీక్షలు ఆదివారం నుంచి 3 కేంద్రాల్లో 6 రోజుల పాటు నిర్వహించనున్నట్లు డీఆర్వో గణపతిరావు పేర్కొన్నారు. నేటి నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు జరిగే పరీక్షలకు మొత్తం 1,715 మంది ఉద్యోగులు హాజరవుతారన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. అభ్యర్థులు గంటన్నర ముందు కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం సముద్రతీరంలో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ పనులను తిరిగి ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే జరిపి హార్బర్ పనులకు అడ్డంకి లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం కలెక్టర్ ఆయన ఛాంబర్లో మత్స్యశాఖ అధికారులతో సమావేశమయ్యారు. హార్బర్ పనులను ప్రారంభించి ప్రతి 15 రోజులకు ఒకసారి తనకు నివేదిక అందించాలన్నారు.
యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా నైపుణ్యాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్కిల్ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్లపై చర్చించేందుకు కలెక్టరేట్లో శనివారం నిర్వహించిన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. యువత ఆకాంక్షలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
అక్రమ ఇసుక తరలిపోకుండా జిల్లా, మండల కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీతో ఇసుక రవాణాకు సంబంధించి ధర నిర్ణయంపై కలెక్టర్ జిల్లా ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో శనివారం సమీక్షించారు. ఇసుక అక్రమంగా తరలిపోకుండా మండలాల్లో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు.
జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు ఏపీఎస్సీపీసీఆర్ సభ్యుడు గొండు సీతారాం తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. జనవరి 26న జాతీయ ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ్ బాల్ పురస్కారాలను ప్రదానం చేసేందుకు దరఖాస్తులను జులై 31లోగా పంపించాలని మొదట గడువు విధించారని, ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారని తెలిపారు.
జిల్లాలోని దాదాపు 5,25,912 మంది రైతులకు పంట బీమా చేయించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో మొత్తం 6,47,504 ఎకరాల పంట భూమి ఉంది. టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్య రూ.360 కోట్లను వివిధ రూపాల్లో రైతులకు లబ్ధి చేకూర్చింది. YCP ప్రభుత్వం కొందరికి బీమా చెల్లించకపోవడంతో రైతులు నష్టపోయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఏడాది రైతులందరికి లబ్ధి చేకూర్చేలా అధికారులు కసరత్తు ప్రారంభించారు.
శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. తొలి రోజు సర్టిఫికెట్ల పరిశీలనకు 515 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 461 మంది హాజరయ్యారు. 54 మంది గైర్హాజరయ్యారు. హాజరైన వారిలో 296 బీసీ, 56 ఎస్సీ, 78 ఈడబ్ల్యూఎస్, 22 ఎస్టీ, 9 మంది ఓసీ విద్యార్థులు ఉన్నట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ బాలాజీ తెలిపారు.
కొనుగోలుదారునికి ఇసుక రేటు అందుబాటులో ఉంటుందని భూగర్భ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో ఇసుకపై ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్లో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు ఉచితంగా ఇసుక సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా మీదుగా భువనేశ్వర్, సికింద్రాబాద్ మధ్య ప్రయాణించే విశాఖ ఎక్స్ప్రెస్లకు అదనంగా 2 జనరల్ కోచ్లు జత చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.17015/17016 విశాఖ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం 2 జనరల్ కోచ్లతో నడుస్తుండగా 2 బోగీలు జతచేసి మొత్తంగా 4 జనరల్ కోచ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. 17016 రైలుకు నవంబర్ 14 నుంచి, 17015కు నవంబర్ 16 నుంచి 2 అదనపు జనరల్ కోచ్లతో నడుపుతామన్నారు.
సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాలని శ్రీకాకుళం జిల్లా పొందూరు సీపానగద్దెంనాయుడుపేటకు చెందిన అప్పలనాయుడు సినిమాలో అవకాశాలు రాకపోవడంతో చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. చోరీ చేసిన డబ్బుతో జల్సాలు చేయడం, జూదమాడటమే కాకుండా షార్ట్ ఫిల్మ్లు తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేవాడు. నిందితుడిని తెలంగాణ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అతడి నుంచి 75 తులాల బంగారు, రూ.4 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
Sorry, no posts matched your criteria.