Srikakulam

News July 23, 2024

ఏపీ నష్టాన్ని పూడ్చే దిశగా కేంద్ర బడ్జెట్: కేంద్ర మంత్రి రామోహ్మన్

image

ఏపీకి గత ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాన్ని పూడ్చే దిశగా తాజా కేంద్ర బడ్జెట్ అడుగులు వేస్తోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ అన్నారు. పార్లమెంట్ వెలుపల ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలనలో ఏపీ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఏపీకి సహాయం అందిచకపోతే అభివృద్ధి సాధించడం కష్టం అన్నారు. ప్రధాని మోదీ అర్థం చేసుకొని ఏపీ అభివృద్ధికి ముందుకొచ్చారు. ఈ సందర్భంగా కేంద్రాన్ని ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.

News July 23, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి B.Ed సెమిస్టర్ పరీక్షలు

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో B.Ed.(M.R) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. జిల్లా వ్యాప్తంగా 14 కళాశాలలకు సంబంధించి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను 23 నుంచి 29వ తేదీ వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని అధికారులు తెలిపారు.

News July 23, 2024

శ్రీకాకుళం: ఉద్యోగం పేరుతో రూ.13.50లక్షలకు టోకరా..

image

ఉద్యోగం పేరుతో ఓ పంచాయితీ కార్యదర్శి రూ.13.50లక్షలు కాజేసిన ఘటన మందస మండలంలో సోమవారం వెలుగుచూసింది. లోహరిబంద పంచాయతీ కార్యదర్శి సతీశ్ బాబు కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురి నుంచి నగదును డిమాండ్ చేశాడు. ఇది నిజమే అని నమ్మిన కొందరు నిరద్యోగులు అతనికి నగదును ముట్టజెప్పారు. అప్పటి నుంచి ఆయన సరిగా స్పందించకపోవడంతో బాధితులు సోమవారం కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

News July 23, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ డివిజన్‌లో నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నందున పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా వెళ్లే పూరి- ఓఖా ఎక్స్‌ప్రెస్‌ను దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.20819 ట్రైన్‌ను ఆగస్టు 4 నుంచి విజయవాడ మీదుగా కాక గుణదల, రాయనపాడు మీదుగా నడుపుతామన్నారు. ఆగస్టు 4 నుంచి ఈ రైలు విజయవాడ మీదుగా వెళ్లదని, సమీపంలోని రాయనపాడులో ఈ రైలుకు స్టాప్ ఇచ్చామని రైల్వే అధికారులు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం జిల్లాలో TODAY TOP NEWS

image

➣ ఈనెల 23 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆధార్ క్యాంపులు➣ టెక్కలిలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత➣ వరద నీటిపై అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ స్వప్నిల్ ➣ కేసులకు భయపడేవారు ఎవరూ లేరు: స్పీకర్ తమ్మినేని➣ఎచ్చెర్లలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య➣ మీకోసం పరిష్కార వేదికకు 151 అర్జీలు➣ పోటీ పరీక్షల్లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచాలి: రామ్మోహన్➣ ఐటీడీఏ పీవోగా రాహుల్ కుమార్ రెడ్డి➣ జలుమూరులో రూ.9 లక్షల నగదు చోరీ

News July 22, 2024

శ్రీకాకుళం జిల్లా పోలీస్ పరిష్కార వేదికకు 55 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించే ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ప్రజలు నుంచి 55 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదుల విషయంలో అలసత్వం లేకుండా చట్ట ప్రకారం తక్షణ చర్యలు చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని కోరారు.

News July 22, 2024

శ్రీకాకుళం: ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కళాశాలకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ గ్రామానికి చెందిన గరుగు పవన్ కుమార్(17) కళాశాలకు వెళ్లకుండా ఇంట్లో ఫోన్లో ఆటలు ఆడుకుంటున్నారని మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని మరణించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎచ్చెర్ల పోలీసులు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం: ‘ఆధార్ క్యాంపులు అందరు వినియోగించుకోవాలి’

image

ఆధార్ స్పెషల్ క్యాంపులు అందరు వినియోగించుకోవాలి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆధార్ స్పెషల్ క్యాంపులను ఈనెల 23 నుంచి 27 తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అందరూ ఆధార్ స్పెషల్ క్యాంపులు వినియోగించుకోవాలన్నారు. 

News July 22, 2024

శ్రీకాకుళం: వర్షాల కారణంగా పలు రైళ్ల దారి మళ్లింపు

image

కొత్తవలస-కిరండూల్ రైల్వే మార్గంలో భారీ వర్షాల నేపథ్యంలో పలు రైళ్లు దారి మళ్లించారు. నం.18514 విశాఖపట్నం-కిరండూల్ ఎక్స్‌ప్రెస్, నం.18513 కిరండూల్ -విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు అరుకు మీదుగా వెళ్లేవి. వీటిని ముందస్తు జాగ్రత్తగా రాయగడ, విజయనగరం మీదుగా ఈనెల 24 వరకు కొనసాగిస్తారు. రైళ్లు కిరండూల్ వరకు వెళ్లకుండా దంతేవాడ నుంచి రాకపోకలు సాగిస్తాయని రైల్వే అధికారులు తెలిపారు.

News July 22, 2024

శ్రీకాకుళం: విద్యార్థులకు గమనిక.. ఫలితాల విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ ఏయూ విశ్వవిద్యాలయం పరిధిలో న్యాయవిద్య LLB 3,6,7 సెమిస్టర్‌ల ఫలితాలను ఎగ్జామినేషన్స్ డీన్ ఉదయ్ భాస్కర్ సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫలితాలను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. అనంతరం మూడో సెమిస్టర్‌లో 20 మంది, ఆరో సెమిస్టర్‌లో 18 మంది, 7 సెమిస్టర్‌లో 21 మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు.