India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పొందూరు తోలాపి గ్రామానికి చెందిన బొనిగి రమణారావు ఛత్తీసగఢ్ CRPF జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన పండగ సెలవులకు స్వగ్రామానికి వచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం వాష్ రూమ్కు వెళ్లారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఆమదాలవలసలో ఓ మైనర్ బాలికపై అదే వీధికి చెందిన కోటిపల్లి రాజు (23) మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన విధితమే. ఈ మేరకు సోమవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తామని అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు పోలీసులు ఉన్నారు.

బాలికను ప్రేమ పేరుతో గర్భిణిని చేసిన ఘటన ఆమదాలవలస మండలంలో వెలుగు చూసింది. పట్టణానికి చెందిన కె.రాజు ప్రేమ పేరుతో బాలికకు దగ్గరయ్యాడు. రెండేళ్లుగా ఆమె తల్లిదండ్రులు లేని సమయంలో లైంగికంగా దాడి చేస్తూ వస్తున్నాడు. ఈక్రమంలో బాలిక గర్భం దాల్చింది. తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై పోక్సో కేసు నమోదు చేశామని డీఎస్పీ సీహెచ్ వివేకానంద వెల్లడించారు. నిందితుడు రాజు పరారీలో ఉన్నాడు.

శ్రీకాకుళం జిల్లాలో జనవరి 8న జరుగనున్న పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు వాయిదా వేసినట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజు వివిధ శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 11న నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. PET, PMT నోటిఫికేషన్ షెడ్యూల్ మేరకు జనవరి 8 తేది మినహా మిగిలిన తేదీల్లో PET పరీక్షలు యథావిధిగా జరుగుతాయన్నారు. అభ్యర్థులు గమనించాలని ఎస్పీ స్పష్టం చేశారు.

గార మండలం శ్రీకూర్మం పంచాయతీ జెల్లపేటకు చెందిన గండ్రేటి కృష్ణమ్మ (74) ప్రమాదవశాత్తు ఉప్పు గెడ్డలో జారి పడి మృతి చెందింది. శనివారం గార వెళ్తానని చెప్పిన కృష్ణమ్మ బందరువానిపేట వద్ద ఉన్న ఉప్పు గెడ్డలో పడి మరణించడంతో కుటుంబీకులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికుల సమాచారంతో ఎస్ఐ జనార్దన్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని బయటకు తీసి కేసు నమోదు చేశారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం పాలవలసలో గంగిరెద్దుల రాకతో సంక్రాంతి సందడి మొదలైంది. ‘అయ్యవారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు’ అని ఎద్దుల బసవన్నలు ప్రజలను ప్రసన్నం చేసుకుంటున్నారు. అందర్నీ దీవించి వాళ్ళు ఇచ్చిన పండగ కానుకలని స్వీకరిస్తూ వెళుతున్నారు. సన్నాయి చప్పుళ్ల నడుమ గంగిరెద్దుల నృత్యం చేశాయి. ప్రతీ ఏటా ఈ గంగిరెద్దులతో రాకతో గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంటోంది.

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నరసాపురానికి చెందిన వీర జవాన్ ఆదినారాయణ భార్య కమలమ్మకు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో పురస్కారం అందజేసింది. ఢిల్లీలో యుద్ధస్మారక స్తూపం వద్ద ఈ పురస్కారాన్ని అందజేశారు. 11వ అస్సాం రైఫిల్ బెటాలియన్కు చెందిన ఆయన ఉగ్రవాదుల ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆదినారాయణకు నివాళులర్పిస్తూ భార్య కమలమ్మకు పురస్కారాన్ని అందజేశారు.

శ్రీకాకుళం బలగ ప్రభుత్వ డీఎల్ టీసీ/ ఐటీఐ కాలేజ్లో జనవరి 7న ఏపీ నైపుణ్యా శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యా అధికారి యు. సాయికుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా పలు కంపెనీల్లో 75 పోస్టులు భర్తీ చేయనున్నారు. SSC, INTER పూర్తిచేసిన 18-35 ఏళ్ల కలిగిన M/F అభ్యర్థులు అర్హులని అన్నారు. ఈ అవకాశం నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక మునిసిపల్ మైదానంలో ఆదివారం ప్రారంభించిన డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం వాయిదా వేయటం జరిగిందని డీఆర్డిఏ పీడీ పీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కొన్ని సమస్యలు కారణంగా దీనిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమాన్ని సోమవారానికి మార్చామని, దీనిని గమనించాలని స్పష్టం చేశారు.

జిల్లాలో సిక్కోలు డ్వాక్రా బజార్ పేరిట ఈ నెల 5వ తేదీ ఆదివారం 7 రోడ్ల కూడలిలోని మున్సిపల్ మైదానంలో స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించి, అమ్మకానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బజార్లో చేనేత వస్త్రాలు, హస్తకళలు, చేతి వంటల ఆహార పదార్థాలు తదితర ఉత్పత్తుల ప్రదర్శన అమ్మకాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.
Sorry, no posts matched your criteria.