Srikakulam

News July 16, 2024

శ్రీకాకుళం: ఉగ్ర దాడిలో మరో జవాన్ మృతి

image

జమ్మూకశ్మీర్‌లో సోమవారం జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలానికి చెందిన డొక్కరి రాజేశ్(25) అనే జవాన్ కూడా మృతిచెందారు. ఇదే ఘటనలో నందిగం మండలానికి చెందిన సనపల జగదీశ్వరరావు అనే జవాన్ మృతి చెందిన విషయం విదితమే. కాగా సంతబొమ్మాళి మండలానికి చెందిన రాజేశ్ మృతిచెందటంతో టెక్కలి నుంచి ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు.

News July 16, 2024

చంపుతామంటూ బెదిరింపు కాల్స్: దువ్వాడ శ్రీనివాస్

image

టెక్కలి నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలకు గుర్తుతెలియని వ్యక్తులు చంపుతామంటూ బెదిరింపు కాల్స్ చేస్తున్నారని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం నుంచి వైసీపీ కార్యకర్తలపై దాడులకు సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షులు అజయ్ కుమార్, తదితరులు ఉన్నారు.

News July 16, 2024

శ్రీకాకుళం: MBA పరీక్షల ఫలితాలు విడుదల

image

ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో జనవరి- 2024లో నిర్వహించిన MBA 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. MBA -ఫారిన్ ట్రేడ్, రూరల్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ & ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్రాంచ్‌ల ఫలితాలు విడుదల చేశామని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది. పరీక్ష ఫలితాలకై అధికారిక వెబ్‌సైట్ https://results.andhrauniversity.edu.in/ చెక్ చేసుకోవాలని సూచించింది.

News July 16, 2024

శ్రీకాకుళం: ఇగ్నోలో అడ్మిషన్ల గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. సోమవారంతో గడువు ముగియగా, జులై 31 వరకు గడువు పొడిగించినట్లు వర్శిటీ వర్గాలు తెలిపాయి. వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

News July 16, 2024

శ్రీకాకుళం: గెస్ట్ ఫ్యాకల్టీ కోసం ఇంటర్వ్యూ లు

image

శ్రీకాకుళం జిల్లాలోని డా.బి.ఆర్ అంబేడ్కర్ గురుకులంలో గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీ కోసం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి బాలాజీ నాయక్ ఒక ప్రకటనలో సోమవారం తెలిపారు. కొల్లివలసలో జేఎల్ మ్యాథ్స్, కంచిలిలో జేఎల్ కెమిస్ట్రీ, ఎచ్చెర్లలో జేఎల్ జువాలజీ, పాతపట్నంలో టీజీటీ బయాలజీ, పీజీటి సోషల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. ఈనెల 18న ఉదయం 10గంటలకు ఆదివారం పేట కార్యాలయంలో హాజరు కావాలని కోరారు. 

News July 16, 2024

శ్రీకాకుళం: రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక

image

విజయవాడ డివిజన్‌లో ట్రాఫిక్ నిర్వహణ కారణాల రీత్యా శ్రీకాకుళం, పలాస మీదుగా వెళ్లే నం.12509 SMV బెంగుళూరు- గౌహతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ ప్రయాణించే మార్గాన్ని మార్పు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ట్రైన్‌ జులై 29 నుంచి ఆగస్టు 30 వరకు విజయవాడ- తాడేపల్లిగూడెం మీదుగా కాక విజయవాడ- గుడివాడ- భీమవరం మార్గం గుండా నిడదవోలు చేరుకుంటుందన్నారు.

News July 16, 2024

సిక్కోలులో రూ.215 కోట్లు జరిమానా వేసి లాక్కున్నారు: సీఎం

image

శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఆక్రమణలపై సీఎం చంద్రబాబు సోమవారం శ్వేతపత్రం విడుదల చేశారు. జిల్లాలో ఎంఎస్‌సీ గ్రానైట్‌కు రూ. 215 కోట్లు జరిమానా వేశారని అన్నారు. చివరకు రైల్వేకోడూరు మాజీ MLA కి వంశధార గ్రానైట్ పేరిట సొంతం చేసుకున్నారని ఆరోపించారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారెవ్వరినీ వదిలేదిలేదని హెచ్చరించారు.

News July 16, 2024

ఉగ్రవాదుల దాడిలో శ్రీకాకుళం జవాన్ మృతి

image

ఉగ్రవాదులదాడిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన జవాన్ వీరమరణం పొందారు. నందిగం మండలం వల్లభరాయుడుపేట గ్రామానికి చెందిన సనపల జగదీశ్వరరావు(40) ఆర్మీలో పనిచేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పరిధిలోని అనంతనాగ ప్రాంతంలో నిన్న ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. జవాన్ భార్య సమత దిమిలాడ సచివాలయంలో మహిళా పోలీసుగా పనిచేస్తున్నారు. ఆయనకు మోక్షప్రియ, దీక్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

News July 16, 2024

శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: APSDMA

image

వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతాన్ని ఆనుకుని దక్షిణ ఒడిశా తీరం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) తెలిపింది. ఈ అల్పపీడనం కారణంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని తాజాగా హెచ్చరించింది. 

News July 16, 2024

శ్రీకాకుళం: పోస్టాఫీసులో ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.