Srikakulam

News July 15, 2024

శ్రీకాకుళం: పోస్టాఫీసులో ఉద్యోగాలు

image

పదవ తరగతి అర్హతతో బీపీఎం/ఏబీపీఎం ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 79 పోస్టులను పోస్టల్ డిపార్ట్‌‌మెంట్ భర్తీ చేయనుంది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఎంపికైన వారికి బీపీఎం అయితే రూ.12 వేలు+అలవెన్సులు, ఏబీపీఎం అయితే రూ.10 వేలు+అలవెన్సులు జీతంగా ఇవ్వనున్నారు. పూర్తి వివరాలకు www.appost.gdsonline వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

News July 15, 2024

శ్రీకాకుళం: B.Ed మొదటి సెమిస్టర్ పరీక్షలు టైం టేబుల్ విడుదల

image

శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ స్పెషల్ B.Ed.(M.R) కోర్సులకు సంబంధించి మొదటి సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారులు సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్షలు ఈనెల 23వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నట్లు పేర్కొన్నారు. కావున B.Ed అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నట్లు చెప్పారు.

News July 15, 2024

నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దుతా: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

image

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో నూతన ఎస్పీ మహేశ్వర్ రెడ్డి జిల్లా అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, పలువురు అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. ముందుగా అధికారులను పరిచయం చేసుకొని, జిల్లా పరిస్థితులపై సమీక్షించారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ఎస్పీ తెలిపారు. నేర రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ అధికారులంతా కలిసికట్టుగా పనిచేసి, సహకరించాలని కోరారు.

News July 15, 2024

శ్రీకాకుళం: ఈనెల 17న జిల్లా సాఫ్ట్ బాల్ జట్టు ఎంపిక

image

శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈనెల 17న ఉదయం 9 గంటలకు సీనియర్ సాఫ్ట్ బాల్ రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా జట్టు (పురుషులు, స్త్రీలు) ఎంపికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహారాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు ఆగస్టు 10 నుంచి 12వ తేదీ వరకు గుంటూరులో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీల్లో పాల్గొంటారన్నారు.

News July 15, 2024

శ్రీకాకుళం: 18నుంచి కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం

image

ఈనెల 18 నుంచి ఆగస్టు 2 వరకు కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించే కార్యక్రమం పోష్టర్‌ను ఆయన ఆవిష్కరణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

News July 15, 2024

శ్రీకాకుళం: ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం అమలు చేయండి’

image

రాష్ట్ర ప్రభుత్వం ‘నిర్మాణ కార్మిక సంక్షేమ చట్టం’ అమలు చేసి, తమ ఎన్నికల హామీ నిలబెట్టుకోవాలని ‘శ్రీకాకుళం జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆ సంఘం అధ్యక్షుడు ఆదినారాయణ మూర్తి మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు లక్ష నిర్మాణ కార్మిక కుటుంబాలు, సంక్షేమ చట్టం నిలుపుదల వలన ఇబ్బందులు పడుతున్నారన్నారు. 

News July 15, 2024

ఎచ్చెర్ల: ఎన్నికల్లో విధుల్లో పోలీసు సిబ్బంది సహకారం అభినందనీయం

image

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆర్మ్డ్ పోలీస్ విభాగం అధికారులు, సిబ్బంది సంపూర్ణ సహకారం అందించారని ఎస్పీ జీ.ఆర్ రాధిక కొనియాడారు. సోమవారం ఎచ్చెర్ల ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో ఆర్మ్డ్ రిజర్వ్ యాత్రంగం ఆధ్వర్యంలో సెరేమోని పరేడ్ నిర్వహించారు. పరేడ్‌లో భాగంగా ఆమె గౌరవ వందనం సమర్పించారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఆమె DGP కార్యాలయంలో రిపోర్ట్ చేయనున్న విషయం విదితమే.

News July 15, 2024

వీరఘట్టం: పొలం పని చేస్తూ గుండెపోటుతో రైతు మృతి

image

పొలం పని చేస్తూ వీరఘట్టం మండలం చిట్టపులివలసకు చెందిన జక్కు కృష్ణ (65)అనే రైతు సోమవారం మృతి చెందాడు. ఉదయం ఇంటి వద్ద అల్పాహారం తీసుకుని కూలీ పని కోసం గ్రామానికి చెందిన మరో రైతు పొలంలో పార పని చేస్తుండగా ఒక్కసారిగా కృష్ణ కుప్పకూలిపోయాడని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటివరకు చిన్న జ్వరం కూడా రాని కృష్ణ ఒక్కసారి గుండెపోటుతో మృతి చెందడం స్థానికుల్ని కలిచివేసింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News July 15, 2024

నౌపడ – పూరి వరకు ప్రత్యేక రైళ్లు

image

పూరి జగన్నాథ స్వామి రథయాత్ర సందర్భంగా ఈ నెల 15, 16, 17వ తేదీల్లో టెక్కలి మండలం నౌపడ స్టేషన్ నుంచి పూరికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 15, 16వ తేదీల్లో నౌపడ నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ రైలు నౌపడ బయలుదేరి మధ్యాహ్నం 12:05 కి పూరి చేరుకుంటుంది. తిరిగి 15, 17వ తేదీల్లో రాత్రి 11 గంటలకు పూరీలో బయలుదేరి మరుసటి రోజు ఉదమం 6:40కు నౌపడ చేరుకుంటుంది.

News July 15, 2024

వంగర: పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య

image

ఆర్థిక ఇబ్బందులు ఓ రైతు ప్రాణం తీశాయి. ఎస్సై జనార్దనరావు వివరాల ప్రకారం.. పెద్దరాజులగుమ్మడకు చెందిన ఆర్.కృష్ణమూర్తి (46) రైతు శనివారం సాయంత్రం గ్రామ సమీపంలోని పొలంలో పురుగు మందు తాగాడు. స్థానికులు గమనించి ఓ ప్రైవేటు వాహనంలో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి విశాఖకు తరలిస్తుండగా మార్గమధ్యలో అదే రోజు రాత్రి మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.