India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఆంధ్రా యూనివర్సిటీ(AU) పరిధిలో జనవరి- 2024లో జరిగిన డిగ్రీ 3వ, 5వ సెమిస్టర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. రీవాల్యుయెషన్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఫలితాలు చెక్ చేసుకోవాలని ఆంధ్ర యూనివర్శిటీ వర్గాలు సూచించాయి. ఫలితాలకై యూనివర్శిటీ అధికారిక వెబ్సైట్ https://results.andhrauniversity.edu.in/ చూడాలని AU పరీక్షల విభాగం తెలిపింది.
శ్రీకాకుళం జిల్లా టీడీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి గురువారం విజయవాడలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు, రెండోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కింజరాపు అచ్చెన్నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా ప్రగతికి సీఎం చంద్రబాబు నాయుడు మరో అవకాశం ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
విజయవాడలో నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార విధుల నిర్వహణకు వచ్చిన కానిస్టేబుల్ మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ ఏ లక్ష్మయ్య రెడ్డి నిన్న చంద్రబాబు ప్రమాణ స్వీకార బందోబస్త్లో పాల్గొన్నాడు. అనంతరం అనారోగ్యం కారణంగా నేటి ఉదయం 5.30 సమయంలో విజయవాడలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామైన పోలాకి (M) పల్లిపేటకు తరలించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది.
టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ అనుబంధ డిగ్రీ కళాశాలల డిగ్రీ 6వ సెమిస్టర్, సప్లిమెంటరీ (2015-16, 2016-17 అడ్మిట్ బ్యాచ్) పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు. విద్యార్థులు అరగంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
టెక్కలికి చెందిన వైసీపీ నాయకుడు నర్సింగ్ నాధ్ను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు టెక్కలి సీఐ పీ పైడయ్య తెలిపారు. గత నెల 13వ తేదీన పోలింగ్ బూత్ వద్ద జరిగిన తగాదా విషయంలో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ సందర్భంగా టెక్కలికి చెందిన నర్సింగ్ నాధ్ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో రిమాండ్ విధించడంతో నరసన్నపేట ఉప కారాగారానికి తరలించారు.
మొగిలివలస వేంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను గుర్తుతెలియని వాహనం డీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. గెడ్డ కంచరాం గ్రామానికి చెందిన సత్యం, కుమార్ రాజాంలో కూరగాయలు కొని ఆటోలో తీసుకొస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆటోలో ఇరుక్కుపోయిన వారిని 108లో ఉన్న పనిముట్లతో ఆటోను కట్ చేసి రాజాంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
వేసవి సెలవుల అనంతరం దాదాపు నెలన్నర తరువాత నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, జడ్పీ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థుల్ని పాఠశాలలకు పంపేందుకు సన్నద్ధం అయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పంపిణీ చేసే విద్యాకానుక కిట్ల సరఫరాను ప్రభుత్వం పూర్తి చేసింది.
టెక్కలిలో హ్యాట్రిక్ విజయం సాధించిన అచ్చెన్నాయుడు మరోసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1996 ఉపఎన్నికల్లో ఆయన రాజకీయ ఎంట్రీ ఇచ్చారు. 2009లో ఓటమి చవిచూసిన అచ్చెన్న 2014, 2019, 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా వరుస విజయాలు సాధించారు. అనంతరం కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన ఆయన 2020 నుంచి ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో అయిదేళ్ల LLB కోర్సు చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ సప్లిమెంటరీ(2013- 14 బ్యాచ్, 2021- 22 తర్వాతి బ్యాచ్లు) పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. జూలై 6, 8, 9, 10,11 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తామని AU పరీక్షల విభాగం తెలిపింది. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు AU అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవాలని సూచించింది.
Sorry, no posts matched your criteria.