India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలికి చెందిన మల్లిపెద్ది ప్రణవ్ సాయి అనే విద్యార్థికి మంగళవారం విడుదలైన ఈఏపీసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి 12వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. తూర్పుగోదావరి జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ప్రణవ్ సాయి ఇటీవల విడుదల అయిన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో కూడా రాష్ట్రస్థాయి 62వ ర్యాంకు, నీట్ లో ఆల్ ఇండియా 430వ ర్యాంకు సాధించి ప్రతిభ కనబరిచాడు. విద్యార్థిని స్థానికులు అభినందించారు.
టెక్కలి సమీపంలో జరుగుతున్న అండర్ 23 నార్త్ జోన్ క్రికెట్ పోటీల్లో భాగంగా మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరగ్గా మొదట బ్యాటింగ్ చేసిన విశాఖ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేయగా తదుపరి 274 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు 31.1 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌట్ కావడంతో మొదటిరోజు విశాఖ జట్టు గెలుపొందింది. బుధవారం విజయనగరం-విశాఖ మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం టెక్కలి సమీపంలో అండర్-23 నార్త్ జోన్ క్రికెట్ పోటీలు ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి ప్రారంభమైన పోటీలు ఈనెల 16వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొదటిరోజు క్రికెట్ పోటీలను ఇంజినీరింగ్ కళాశాల డైరెక్టర్ డా.వి.వి నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదటి రోజు శ్రీకాకుళం-విశాఖ జట్లు మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు ఆర్గనైజింగ్ కన్వీనర్ ఎన్. లాల్ బహుదూర్ తెలిపారు.
శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా వేసవికాలం పూర్తయినప్పటికీ ఎండలు దంచి కొడుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి వాతావరణం కొంతమేర చల్లబడినా.. ప్రస్తుతం ఎండలు మళ్లీ భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన విషయం తెలిసిందే. మంగళవారం 12 గంటల సమయానికి 34 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వడంతో ఉక్కపోత మళ్లీ మొదలైంది. వృద్ధులు, చిన్నపిల్లలు ఎండ వేడికి చాలా ఇబ్బంది పడుతున్నారు.
ప్రజా పంపిణీలో కీలకంగా పనిచేసిన వాలంటీర్ల పరిస్థితి ప్రశ్రార్థకమైంది. ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా 1,08,273 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. అందులో శ్రీకాకుళం జిల్లాలో 12,399 మంది పని చేస్తుండగా.. అందులో 8,784 మంది రాజీనామా చేశారు. వీరిని తిరిగి విధుల్లో చేర్చుకునే పరిస్థితి కనపడటం లేదు. మిగిలిన 3,574 మంది విధుల్లోనే ఉన్నారు. చంద్రబాబు రూ.10వేలు జీతం ఇస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
కేంద్రంలో రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రిగా నియమితులు కావడంతో భోగాపురం మహర్దశ పటనుందని జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు. విశాఖ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 2014లో చంద్రబాబు విశాఖ-విజయనగరం మధ్య భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మించాలని నిర్ణయించారు. గత సర్కార్ నిర్మాణంలో తీవ్ర జాప్యం చేసింది. ప్రస్తుతం కేంద్ర,రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వమే ఉండటంతో ప్రజల్లో ఆశలు చిగురించాయి.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీటెక్- మెకానికల్ ఇంజినీరింగ్( 2020- 21 నుంచి అడ్మిషన్ పొందినవారు) కోర్సు సెకండియర్ ఫస్ట్ సెమిస్టర్ స్పెషల్ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఈ నెల 19, 20, 21 తేదీల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటలవరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా టైంటేబుల్ పూర్తి వివరాలకు విద్యార్థులు https://www.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
ఈనెల 12వ తేదీన ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు గన్నవరంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కూటమి నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నాయకులు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. కూటమి తరఫున 31 ఆర్టిసీ ఎక్స్ప్రెస్, 9 ఆల్ట్రా డీలక్స్ కలిపి మొత్తం 40 బస్సులు జిల్లా నుంచి గన్నవరంకి వెళ్లనున్నాయి. ఈ బస్సులు మంగళవారం రాత్రి బయలుదేరి బుధవారం ఉదయానికి చేరుకుంటాయి.
జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు సాధించలేకపోవడంతో ఓ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. రాజాం పట్టణానికి చెందిన ఓ విద్యార్థి(17) చదువు కోసం తల్లిదండ్రులు విశాఖపట్నం నివాసం మార్చారు. బాలుడు అక్కడున్న ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివాడు.అన్ని సబ్జెక్టుల్లోనూ మంచి మార్కులు సాధించాడు. అడ్వాన్స్డ్ రాసినా ఐఐటీలో సీటు రాకపోవడంతో ఎంవీపీ కాలనీలో ఉన్న భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
సౌత్ ఈస్టర్న్ రైల్వే చక్రధర్ పూర్ డివిజన్ పరిధిలో భద్రత పరమైన పనులు చేపడుతున్న కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్టేర్ రైల్వే డివిజన్ డీసీఎం సందీప్ తెలిపారు. రూర్కెలా-జగదల్పూర్-రూర్కెలా ఇంటర్ సీటీ రైళ్లను ఈనెల 12వ తేదీన రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే రూర్కెలా-గుణపూర్-రూర్కెలా ఎక్స్ ప్రెస్ రైళ్లను ఈనెల 12న రద్దు చేసినట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.