India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శ్రీకాకుళం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గొండు శంకర్ మంత్రి ధర్మాన ప్రసాదరావును ఓడించారు. శ్రీకాకుళంలోని కిష్టప్ప పేటకు చెందిన శంకర్ 2021లో సర్పంచిగా ఎన్నికయ్యారు. పలు కార్యక్రమాలతో బాబు దృష్టిలో పడిన ఇతను MLA టికెట్ సాధించారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవిని కాదని ఇతనికి టికెట్ కేటాయించడంతో వ్యతిరేక గళం వినిపించినా ..ప్రణాళికాబద్ధంగా అన్ని వర్గాలను కలిసి మద్దతు కూడగట్టి విజయం సాధించారు.
జలుమూరు మండలం తిలారు రైల్వేగేటు సమీపంలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు జీఆర్పీ హెచ్సీ చక్రధరరావు తెలిపారు. తిలారు రైలు నిలయం నుంచి ఉర్లాం వెళ్లే మార్గంలో మృతదేహం లభ్యమైందని ఆయన మంగళవారం పేర్కొన్నారు. మృతుడు పచ్చ తెలుపు పువ్వులు గల లుంగీ, నారింజ రంగు బనియన్ ధరించాడని వయసు సుమారు 75 సంవత్సరాలు ఉంటుందని చెప్పారు. మృతదేహాన్ని శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో భద్రపరిచామన్నారు.
పలాస నియోజకవర్గ పరిధి 22వ రౌండ్ ఓట్లు లెక్కింపు పూర్తి అయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సీదిరి అప్పలరాజుకు 61,210 ఓట్లు, ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీషకు 1,01,560 ఓట్లు పోలయ్యాయి. కాగ ఎన్డీఏ అభ్యర్థి గౌతు శిరీష 40,350 ఓట్లు ఆధిక్యతతో విజయం సాధించారు. ఈమె మొదటి ప్రయత్నంలో ఓడినప్పటికీ రెండవ ప్రయత్నంలో విజయం సాధించి మొదటిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.
శ్రీకాకుళం పార్లమెంట్ టీడీపీ ఎంపీగా గెలుపొందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. ఆయన వెంట కింజరాపు అచ్చెన్నాయుడు, గొండు శంకర్, కుటుంబ సభ్యులు, నాయకులు, అభిమానులు ఉన్నారు.
⁍ఎచ్చెర్ల: నడుకుదిటి ఈశ్వరరావు (బీజేపీ)
⁍పలాస: గౌతు శిరీష (టీడీపీ)
⁍పాతపట్నం: మామిడి గోవిందరావు (టీడీపీ)
⁍ఆమదాలవలస: కూన రవికుమార్ (టీడీపీ)
⁍నరసన్నపేట: బగ్గు రమణమూర్తి (టీడీపీ)
⁍శ్రీకాకుళం: గొండు శంకర్ (టీడీపీ)
⁍టెక్కలి: కింజరాపు అచ్చెన్నాయుడు (టీడీపీ)
⁍రాజాం: కోండ్రు మురళీ మోహన్ (టీడీపీ)
⁍పాలకొండ నిమ్మక జయకృష్ణ (జనసేన)
⁍ఇచ్ఛాపురం, బెందాళం అశోక్ (టీడీపీ)
బుధవారం శ్రీకాకుళం జిల్లా పరిధిలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) అధికారులు తెలిపారు. ఈ మేరకు APSDMA అధికారులు తాజాగా ఒక ప్రకటన విడుదల చేశారు. అటు పొరుగున ఉన్న విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో సైతం రేపు వర్షాలు పడతాయని స్పష్టం చేశారు.
కింజరాపు కుటుంబం నుండి తాజా ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు నాయకులు గెలుపొందారు. దివంగత ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహన్ శ్రీకాకుళం ఎంపీ, సోదరుడు అచ్చెన్న టెక్కలి అసెంబ్లీ, అల్లుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి సిటీ నుంచి గెలిచారు. 2019లో సైతం అచ్చెన్న, రామ్మోహన్తో పాటు రామ్మోహన్ సోదరి ఆదిరెడ్డి భవాని రాజమండ్రి సిటీ నుండి టీడీపీ తరపున గెలిచారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. గెలుపు వీరులు వీరే.. ఎచ్చెర్ల నడుకుదిటి ఈశ్వరరావు, పలాస గౌతు శిరీష, పాతపట్నం- మామిడి గోవిందరావు, ఆమదాలవలస -కూన రవికుమార్, నరసన్నపేట -బగ్గు రమణమూర్తి, శ్రీకాకుళం- గొండు శంకర్, టెక్కలి – కింజరాపు అచ్చెన్నాయుడు, పాలకొండ -నిమ్మక జయకృష్ణ, ఇచ్ఛాపురం, బెందాళం అశోక్ గెలుపొందారు.
కూటమికి చరిత్రాత్మకమైన విజయాన్ని రాష్ట్ర ప్రజలు ఇచ్చారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణ మూర్తి అన్నారు. గతంలో ప్రజలు చేసిన పొరపాటుకు ఐదేళ్లుగా పడిన ప్రతిఒక్కరూ ఇబ్బంది పడ్డారని అన్నారు. ఈరోజు ఈ విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీను చంద్రబాబు అమలు చేసి ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తారని అన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి మంత్రి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పై, నరసన్నపేట వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై ఓడిపోయారు. అలాగే పలాస వైసీపీ అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై వెనుకంజులో ఉన్నారు.
Sorry, no posts matched your criteria.