India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ అడ్మిషన్లకై ఏపీ ఉన్నత విద్యామండలి(APSCHE) ఈసెట్-2024 వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అడ్మిషన్లు కావలసిన విద్యార్థులు ఈ నెల 30లోపు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్, కౌన్సిలింగ్ పూర్తి వివరాలకై విద్యార్థులు https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన నెల్లి రాము ఏక కాలంలో రెండు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లగొట్టి ఔరా అనిపించాడు. రెండు నెలల క్రితం సెంట్రల్ బ్యాంకులో ఉద్యోగం సాధించిన రాము.. తాజాగా SBIలో క్లర్క్గా ఎంపికయ్యాడు. పేదరికంలో పుట్టిన రాము క్రమ శిక్షణతో చదివి ఉద్యోగం సాధించినట్లు అతడి కుటుంబీకులు తెలిపారు. రాముకు పలువురు అభినందనలు తెలిపారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో ఫిబ్రవరి-2024లో నిర్వహించిన MA ఇంగ్లిష్ మొదటి సెమిస్టర్ రీ వాల్యుయేషన్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. విద్యార్థులు తమ రిజిస్టర్ నంబర్ ద్వారా అధికారిక వెబ్సైట్ https://results.andhrauniversity.edu.in/ లో చెక్ చేసుకోవాలని వర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో మోసపోయిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎచ్చెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినికి అదే గ్రామానికి చెందిన జగదీశ్ ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. శారీరకంగా దగ్గరవడంతో విద్యార్థిని గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని కోరగా జగదీశ్ ముఖం చాటేయడంతో బాలిక యాసిడ్ తాగింది. బాలిక పరిస్థితి విషమం ఉందని పోలీసులు తెలిపారు.
జగన్ వింత ప్రవర్తనపై మాజీ CS ఎల్వీ సుబ్రహ్మణ్యం ద్వారా విస్తుపోయే నిజాలు తెలిశాయని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. విశాఖలో స్టీల్ ప్లాంట్ తొలగించి అక్కడ రాజధాని కట్టేద్దామంటూ పిచ్చి సలహాను నాడు సీఎంగా ఉన్న జగన్ ఎల్వీ ముందు పెట్టారని అచ్చెన్న వ్యాఖ్యానించారు. ఈ మేరకు జగన్ మనస్తత్వం గురించి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడిన వీడియోను అచ్చెన్న Xలో పోస్ట్ చేశారు.
ప్రమాదవశాత్తు కవిటి మండల యువకుడు కేరళలో మృతి చెందిన ఘటన గురువారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. జి.కరాపాడ గ్రామానికి చెందిన సురేశ్ అలియాస్ కాళీ ఉదయం తాను పని చేస్తున్న ప్రదేశం నుంచి జారి కింద పడ్డాడు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్కు ఇటీవల పెళ్లి నిశ్చయమైనట్లు కుటుంబీకులు తెలిపారు.
జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది జిల్లాలోని మొత్తం 93 ఇంటర్ కళాశాలలోని మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు 8,420 మంది ఉండగా, మొదటి ఏడాదిలో ప్రవేశాలు కొనసాగుతున్నాయి. జులై 15 నాటికి పుస్తకాలను అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
సోంపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్ జై భీమ్ సిబ్బందితో కలిసి మందస మండలంలోని కొండలోగాం పంచాయతీలోని నాటుసారా తయారీని అరికట్టేందుకు గురువారం సాయంత్రం దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో బెల్లపు ఊటలను ధ్వంసం చేసినట్లు ఇన్స్పెక్టర్ వెల్లడించారు. అనంతరం గ్రామంలో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1900 లీటర్ల బెల్లం ఊటను అధికారులు ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటుసారాని స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలో బీఈడీ(స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్స్ చదివే విద్యార్థులు రాయాల్సిన 4వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైంటేబుల్ విడుదలైంది. ఆగస్టు 13, 14, 16, 17 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి ఈ పరీక్షలు జరగనున్నాయి. సబ్జెక్టువారీగా షెడ్యూల్ వివరాలకై విద్యార్థులు https://exams.andhrauniversity.edu.in/ అధికారిక వెబ్సైట్ చెక్ చేసుకోవచ్చు.
కంచిలి మండలం చిన్న శ్రీరాంపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన లోళ్ళ కాళీ ప్రశాంత్ గురువారం విడుదలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగ ఫలితాలలో ప్రతిభ కనబరిచాడు. ప్రాథమిక, ఉన్నత విద్య గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పూర్తి చేసి ఉన్నత చదువులతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతూ SBIలో ఉద్యోగం సాధించాడు. యువకుడి విజయం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Sorry, no posts matched your criteria.