India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి శ్రీకాకుళం జిల్లాలోని జూనియర్ కాలేజీలు శనివారం నుంచి పునః ప్రారంభం కానున్నాయి. నేటి నుంచే కళాశాలలో క్లాసులు కూడా మొదలుకానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలు మేరకు 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇప్పటికే ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశిత వార్షిక క్యాలెండర్ను కూడా విడుదల చేసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 168 జూనియర్ కళాశాలలో ఉండగా ఇందులో 38 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 3,19,702 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.93.30 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పెన్షన్లలో 2,38,993 మంది లబ్ధిదారులకు రూ.71.69 కోట్లు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. మిగిలిన 80,709 మందికి రూ.21.60 కోట్లను జూన్ 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జిల్లాలోని 732 గ్రామ వార్డు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ పంపిణీ చేస్తారు.
ఎన్నికల ఫలితాల కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజల ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ, 1 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.
బాచుపల్లి PS పరిధి కౌసల్యకాలనీలో విషాదం నెలకొంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరవర్ధన్ రెడ్డి(33) ఆత్మహత్య చేసుకొన్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. శ్రీకాకుళం వాసి వీరవర్ధన్ గత కొంతకాలంగా బాచుపల్లిలో నివాసం ఉంటున్నాడు. తన భార్య డెలివరీ కోసం ఇటీవల కుమారుడితో కలిసి స్వస్థలానికి వెళ్లింది. శుక్రవారం ఇంట్లో ఉరివేసుకొని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందులే సూసైడ్కు కారణమని తెలుస్తోంది. కేసు నమోదైంది.
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. మరికొద్దిరోజుల్లో ఫలితాలు వెలువడనున్నాయి. తొలిసారి నెంబర్ల ప్లేట్లపై సరికొత్త యుద్ధానికి వైసీపీ, TDP, జనసేన అభిమానులు దిగుతున్నారు. ఫలానా ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నంబర్ ప్లేట్లను కొట్టిస్తున్నారు. నంబర్ ప్లేట్లను డిజైన్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తున్నారు. ఇదో కొత్త ట్రెండ్గా మారింది అని రాజాంలోని ఓ స్టిక్కరింగ్ దుకాణం యజమాని తెలిపారు.
పాలీసెట్ కౌన్సిలింగ్ను ఎన్నికల ఫలితాల దృష్ట్యా పలు మార్పులు చేశారు. ఈ మేరకు జూన్ 3న జరగాల్సిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూన్ 6న జరుగుతుంది. ప్రత్యేక రిజర్వేషన్లు వర్తించే వారికి సైతం ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. పాత షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్లు ఎంట్రీకి ఈనెల 31 నుంచి జూన్ 5 వరకు అవకాశం ఇవ్వగా.. ప్రస్తుతం జూన్ 7 నుంచి 10 వరకు మార్పు చేశారు. అలాట్మెంట్ల ప్రకటన జూన్ 7 నుంచి 13వ తేదీకి మార్చారు.
కౌంటింగ్ ప్రక్రియ, అధికారుల చేపట్టాల్సిన విధులు, బాధ్యతలపై కలెక్టరేట్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల ప్రకటన కీలక దశకు చేరుకున్నట్టు తెలిపారు. ఇందు కోసం ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎవరూ ఏయే విధులు నిర్వహించాలనే క్రమంలో ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి టెక్కలి సమీపంలో జరుగుతున్న అంతర్ జిల్లాల అండర్-19 క్రికెట్ పోటీల్లో మొదటి రోజు తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీకాకుళం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 167 పరుగులు చేసి ఆలౌట్ కాగా తదుపరి బ్యాటింగ్ చేసిన తూర్పుగోదావరి జట్టు 39.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు చేసి విజయం సాధించింది.
శ్రీకాకుళం జిల్లా పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సిలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు బ్రాంచ్, కళాశాల ఎంపిక కోసం తమ ఆప్షన్లను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. ఈ నెల 31 నుంచి జూన్ 1 వరకు.. 1- 50,000 వరకు, జూన్ 2, 3 తేదీల్లో 50,001- 90,000 వరకు, 4, 5 తేదీల్లో 90,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలి.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలో బీఎస్సీ, బీఏ తదితర డిగ్రీ కోర్సుల్లో 2020-21 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ఫలితాల కోసం ఎదురుచూపులు తప్పట్లేదు. 2024 జనవరిలో ఆరో సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలు జరిగినట్లు విద్యార్థులు శుక్రవారం తెలిపారు. సుమారు 4 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఫలితాలు విడుదల కాలేదని, పీజీలో చేరేందుకు ఆటంకం ఏర్పడుతుందని ఆందోళన చెందుతున్నారు.
Sorry, no posts matched your criteria.