Srikakulam

News June 26, 2024

ఇచ్ఛాపురం: వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వండి

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ బాబును నియోజకవర్గంలోని వాలంటీర్లు కలిశారు. కవిటి మండలం రామయ్యపుట్టుగలో ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం సమర్పించారు. వాలంటీర్ ఉద్యోగాల నుంచి తమను బలవంతంగా రాజీనామా చేయించారని వాపోయారు. మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ప్రాధేయపడ్డారు. దీనిపై ఎమ్మెల్యే అశోక్ సానుకూలంగా స్పందించారు. సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News June 25, 2024

జలుమూరు: కారు ఢీకొని వృద్ధుడి మృతి

image

కారు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన జలుమూరు మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జలుమూరు మండలం రాణ గ్రామానికి చెందిన వాన సింహాచలం(73) తన ద్విచక్ర వాహనంపై సారవకోట వెళుతుండగా గంగాధర పేట వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు జలుమూరు ఎస్సై మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 25, 2024

టాలీవుడ్ స్టోరీస్ C/O ఉత్తరాంధ్ర

image

ఉత్తరాంధ్రలో జరిగిన యధార్థగాథలే.. కథలుగా వెండితెరపై అలరిస్తున్నాయి. ఇటీవల పలాస, జయమ్మ పంచాయతీ, కోటబొమ్మాళి లాంటి సినిమాలు ప్రేక్షకుల మన్ననలు పొందాయి. తాజాగా.. పాకిస్థాన్ జైలులో చిక్కుకున్న సిక్కోలు మత్స్యకారుడి స్టోరీలో నాగచైతన్య-సాయి పల్లవి నటించారు. రామ్‌చరణ్-బుచ్చిబాబు సినిమాకు కోడి రామ్మూర్తి జీవిత చరిత్రే ఆధారమని టాక్. అనుష్క ప్రధాన పాత్రలో క్రిష్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

News June 25, 2024

టెక్కలి: రైతు భరోసా పథకం ‘అన్నదాత సుఖీభవ’ గా మార్పు

image

రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఇక ‘అన్నదాత సుఖీభవ’గా కొనసాగనుంది. ఈ మేరకు మంగళవారం వ్యవసాయశాఖ అధికారులు సంబంధిత వెబ్‌సైట్‌లో మార్పులు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వ్యవసాయ పథకాలకు సంబంధించిన పేరును మార్పు చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేరుతో పాటు ఏపీ ప్రభుత్వం లోగోను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News June 25, 2024

శ్రీకాకుళం: అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష

image

వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ అధికారులతో టెక్కలి ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మంగళవారం విజయవాడ వ్యవసాయశాఖ కమిషనర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన ఎరువులను సిద్ధం చేయాలని ఆదేశించారు. అన్ని జిల్లాల్లో భూసార పరీక్షలు జరపాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల నమూనాలు సేకరించి ఫలితాలు విడుదల చేయాలని ఆదేశించారు.

News June 25, 2024

శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల్లో భారీ వర్షం

image

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పలాస, వజ్రపుకొత్తూరు మండలాల పరిధిలో మంగళవారం ఉదయం భానుడు తన ప్రతాపం చూపడంతో ప్రజలు ఉక్క పోతతో అల్లాడారు. మధ్యాహ్నం ఎట్టకేలకు ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకుంటూ భారీ వర్షం కురవడంతో ఆయా ప్రాంత ప్రజలు కొంత ఉపశమనం పొందారు. ఇటు పల్లపు ప్రాంత రైతులు ఈ వర్షం వరి నాట్లు వేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తపరిచారు.

News June 25, 2024

శ్రీకాకుళం జిల్లాలో DSC పోస్టులు ఎన్నంటే.?

image

మెగా DSC నోటిఫికేషన్, టెట్ నిర్వహణకు జులై 1న షెడ్యూల్ విడుదల చేసేందుకు AP పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మొత్తం 16,347 డీఎస్సీ పోస్టులకు గానూ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 144 ఎస్టీటీలతో కలిపి మొత్తం 543 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికల ముందు రాష్ట్రంలో టెట్ పరీక్ష జరగ్గా.. బీఈడీ, డీఎడ్ కోర్సులు పూర్తి చేసిన వారికి మరోసారి టెట్ నిర్వహించాలని కేబినెట్‌లో సోమవారం నిర్ణయించారు. SHARE IT.

News June 25, 2024

శ్రీకాకుళంలో 27న మినీ జాబ్ మేళా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని స్థానిక నెహ్రూ యువ కేంద్రంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27వ తేదీన నిర్వహిస్తున్న జాబ్ మేళాలో భాగంగా ఎస్.కె సేఫ్టీ వింగ్స్ ప్రైవేట్ సంస్థలో పనిచేసేందుకు 18 నుంచి 35 సంవత్సరాల లోపు ఉన్న యువతీ యువకులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. జీతం రూ.16 వేల నుంచి రూ.18 వేల వరకు ఉంటుందని తెలియజేశారు. పదో తరగతి పాసైన వారు ఈ ఉద్యోగానికి అర్హులు.

News June 24, 2024

పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తాం: ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ జి.ఆర్ రాధిక నిర్వహించారు. ఈ మేరకు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పూర్తిస్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు. సమస్యలపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు.

News June 24, 2024

నరసన్నపేట: చోరీ కేసులో ఆరు నెలల జైలు శిక్ష

image

చోరీ కేసులో ఒకరికి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ నరసన్నపేట సివిల్ జడ్జి సి.హరిప్రియ తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే.. 2019 నవంబర్ 6 తేదీన నరసన్నపేటలో విద్యుత్ శాఖ ఏఈ పల్లి బాలకృష్ణ ఇంట్లో మండలానికి చెందిన బమ్మిడి దేవకుమార్ బంగారం దొంగతనం చేశాడు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో ఆరు నెలల జైలు శిక్ష ఆమె విధించారు. ఈ క్రమంలో ముద్దాయిని రిమాండ్‌కు తరలించారు.