India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జలుమూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు పక్క గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఉంది. విషయం తల్లిదండ్రులకు తెలియడంతో శ్రీకాకుళం నగరంలో నివాసముంటూ కుమార్తెను చదివిస్తున్నారు. ఆ యువకుడు బాలికను మళ్లీ కలుస్తుండేవాడు. తనతో తీసుకున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరిస్తున్నాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వాసుదేవరావు తెలిపారు.
పొరపాట్లకు తావివ్వకుండా కేటాయించిన విధులు నిర్వహించాలని, EC నిబంధనల ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సక్రమంగా చేయాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జీలాని సమూన్ ఎన్నికల అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం జిల్లా పరిషత్ మందిరంలో బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై అధికారులకు అవగాహన కల్పించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా నిర్వహించాలన్నారు.
ఆమదాలవలస నియోజకవర్గ పరిధికి చెందిన మండలంలో గురువారం వాతావరణం నిప్పుల కుంపటిలా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణంలో భానుడి ప్రతాపం అధికం కావడంతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయాందోళన చెందుతున్నారు. ఎండ వేడి, ఉక్కపోతతో చిన్నారులు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. తోపుడు బండ్లపై వ్యాపారులు, దినసరి కూలీల పరిస్థితి దయనీయంగా తయారైంది. అవసరమైతే గానీ బయటకు రావొద్దని వైద్యులు సూచిస్తున్నారు.
జిల్లాలో పాలీసెట్ -2024 కౌన్సిలింగ్ కొనసాగుతోంది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తున్నారు. బుధవారం 27,001నుంచి 43,000 ర్యాంకు మధ్య విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలు పరిశీలించగా, 336 మంది హాజరయ్యారు. వీరిలో ఓసి, బిసి 305, ఎస్సీ, ఎస్టీ 31 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈనెల 27 నుంచి కౌన్సిలింగ్కు 951 మంది హాజరయ్యారు. నేడు 43001 నుంచి 59000 ర్యాంకుల వారికి పరిశీలిస్తారు.
జిల్లాలో కూరగాయల ధరలు రోజు రోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయి. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా కనీసం కిలో ధర రూ.50/- లు కంటే ఎక్కువ చెల్లించాల్సిందే. బజార్లలో కిలో పచ్చిమిర్చి ఏకంగా రూ.60/- లు వరకు పలకగా రిటైల్ షాపులలో కనీసం రూ.65/- లు నుంచి రూ.70/- ల వరకు అమ్ముతున్నారు. దీనితో సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలను చూసి కొనాలన్నా, తినాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి.
వాల్తేరు డివిజన్ నౌపడ- పూండి సెక్షన్లో వంతెనల పునర్నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఈ శుక్రవారం పలు రైళ్లను రద్దు చేసినట్టు వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. ఆరోజు శుక్రవారం పలాస-విశాఖ (07471) (07470) ప్రత్యేక మెమో పాసింజర్ రైళ్లను రద్దు చేశారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి సహకరించాలని వాల్తేరు సీనియర్ డీసీఎం కె.సందీప్ కోరారు.
పొందూరు మండలంలోని ఓ గ్రామంలో చిన్నారిపై అత్యాచారయత్నానికి ఓ యువకుడు పాల్పడినట్లు అందిన ఫిర్యాదు మేరకు దిశ డీఎస్పీ శ్రీనివాసరావు బుధవారం విచారణ చేపట్టారు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఈ ఘటనపై నివేదిక కోరడంతో ఈ కేసుపై జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పోక్సో కేసు నమోదు చేసినందున స్థానిక పోలీసు స్టేషన్లో పలువురిని విచారించారు.
మందస మండల కేంద్రంలో నివాసముంటున్న ఎల్ఐసి ఏజెంట్ వెంకటేశ్వరరావు(60) బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఘటనపై, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్యతో పాటు ఒక కుమార్తె ఉన్నారు.
ఆన్లైన్ విధానంలో అంతర్ కళాశాలల క్రాస్ వర్డ్ పజిల్ పోటీలను కేంద్ర విద్యాశాఖ నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు https://nice.crypticsingh.com/ అధికారిక వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని కోరుతూ ఈ మేరకు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో ఉత్తమ ప్రతిభ చూపిన వారితో జోనల్, జాతీయ స్థాయిలో పోటీలను ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ తెలిపింది.
ప్రయాణికుల సౌకర్యార్థం బత్తిలి నుంచి పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు ప్రతిరోజూ 2 సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతిరోజూ సాయంత్రం 5, 6 గంటలకు ఈ బస్సులు బత్తిలిలో బయలుదేరి తర్వాతి రోజు ఉదయం 06.35, 07.35 గంటలకు భీమవరం చేరుకుంటాయని, ప్రయాణికులు ఈ సర్వీసులను ఆదరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
Sorry, no posts matched your criteria.