Srikakulam

News April 16, 2024

కంచిలి: ట్రైన్ ఢీ కొని వ్యక్తి మృతి

image

సోంపేట హైవే బ్రిడ్జి కింద ఉన్న రైల్వే ట్రాక్ దాటుతుండగా ట్రైన్ ఢీ కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఘటన స్థలానికి చేరుకొన్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కానీ మృతదేహం చిద్రమవ్వడంతో గుర్తుపట్టే స్థితిలో లేనట్లు తెలుస్తోందన్నారు. కాగా ఇది ప్రమాదమా ..? లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

News April 16, 2024

ఎచ్చెర్ల: కౌన్సెలింగ్ డేట్ ప్రకటన

image

గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి ప్రవేశానికి మిగిలిన సీట్లు భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని, మెరిట్ లిస్టులో పేర్లు ఉన్న విద్యార్థులు హాజరు కావాలని గురుకుల విద్యాలయ సంస్థ జిల్లా కోఆర్డినేటర్ ఎన్ బాలాజీ ప్రకటించారు. ఈ ఏడాది పరీక్ష రాసిన విద్యార్థులలో బాలురకు ఈనెల 18వ తేదీన దుప్పలవలస గురుకుల పాఠశాలలో, 19న బాలికలకు పెద్దపాడు గురుకుల పాఠశాలలో ఉదయం 10 గంటలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు.

News April 16, 2024

వీరఘట్టం: దరఖాస్తులకు గడువు ముగింపు

image

మే నెల 13వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధుల్లో పాల్గొనబోయే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు స్వీకరించినట్లు తహశీల్దార్ కే. జయప్రకాశ్ తెలిపారు. అయితే జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు స్వీకరణకు సోమవారంతో గడువు ముగిసిందని అన్నారు. మొత్తం 220 మంది పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తులు చేసుకున్నట్లు పేర్కొన్నారు.

News April 16, 2024

టీడీపీలో చేరిన దువ్వాడ సోదరుడు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు, పలాస 18వ వార్డు కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ ఆయన భార్య కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ వైసీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబు, అచ్చెన్నాయుడు సమీక్షంలో వీరు టీడీపీ గూటికి చేరారు. యామలపేట సర్పంచ్ సంజీవ్ కుమార్, వైసీపీ టెక్కలి మండల మాజీ అధ్యక్షుడు, సర్పంచ్ బగాది హరిబాబు తదితరులు పసుపు కండువా కప్పుకొన్నారు.

News April 16, 2024

ఎన్నికల విధుల్లో పొరపాట్లకు తావివ్వరాదు: కలెక్టర్

image

ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నప్పుడే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదని కలెక్టర్ మనజీర్ జిలానీ సోమవారం సమూన్ అన్నారు. జిల్లా పరిషత్ మందిరంలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశాన్ని త్వరగా అవగాహన చేసుకోవాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చేటప్పుడు సందేహాలను నివృత్తి చేయాలన్నారు.

News April 16, 2024

భావనపాడు వరకు రోడ్డు సౌకర్యం: చంద్రబాబు

image

విశాఖపట్నం నుంచి భావనపాడు వరకు సముద్రతీర ప్రాంతంలో రోడ్డు నిర్మాణం చేపడతామని, బీచ్‌ని అభివృద్ధి చేస్తామని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పలాస పట్టణంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. జీడి రైతుకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. డీఎస్సీ ఫైల్ పైనే మొదటి సంతకం పెడతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పలాస ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష పాల్గొన్నారు.

News April 16, 2024

శ్రీకాకుళం జిల్లాలో పీడబ్ల్యూడీ ఓటర్లు@21,481

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియోజక వర్గాల వారిగా జిల్లాలో పీడబ్ల్యూడీ ఓటర్లు 21,481 ఉండగా.. జిల్లాలో 85 సంవత్సరాలు దాటిన వృద్ధులు 11,485 ఓటర్ల ఉన్నట్లు కలెక్టర్ మంజీర జిలానీ సమూన్ పేర్కొన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలు గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉన్నాయా లేదని రిటర్నింగ్ అధికారులను అడుగగా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నట్లు ఆర్ఓలు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

News April 15, 2024

SKLM: ‘ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలి’

image

జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో చార్జిషీట్లు త్వరితగతను ఫైల్ చేయాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. సోమవారం శ్రీకాకుళం పట్టణంలో జిల్లా కోర్టులో వీడియో కాన్ఫరెన్ష్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో పోలీసులు త్వరతగితిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి, కోర్టు వారికి పోలీసు వారు సహకరించాలని కోరారు.

News April 15, 2024

వైసీపీకి రాజీనామా చేసిన దువ్వాడ దంపతులు

image

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరుడు దువ్వాడ శ్రీకాంత్, ఆయన భార్య రాష్ట్ర కళింగ కార్పొరేషన్ డైరెక్టర్ దువ్వాడ జయశ్రీ సోమవారం పలాసలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీకి విధేయుడుగా సేవలందించినా గడిచిన కొంతకాలంగా జరిగిన అవమానాలను తట్టుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

News April 15, 2024

నెల్లూరు వద్ద ముగ్గురు శ్రీకాకుళం వాసుల మృతి

image

నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసులు ముగ్గురు చనిపోయారు. టెక్కలికి చెందిన రామయ్య(44), జలుమూరు(M) నగిరికటకానికి తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వెళ్లారు. ముగ్గురూ కలిసి బైకుపై ఆ జిల్లాలోని పొదలకూరుకు పనికి వెళ్లారు. తిరిగొస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను మరో బైక్ ఢీకొట్టింది. రామయ్య స్పాట్‌లో చనిపోగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో కన్నుమూశారు.