India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెక్కలి, నందిగాం మండలంలోని వంశధార ప్రధాన కాలువలను బుధవారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరిశీలించనున్నట్లు ఆయన క్యాంపు కార్యాలయం సిబ్బంది తెలిపారు. సాయంత్రం 5 గంటలకు టెక్కలి టౌన్లోని వంశధార కాలువలను, 6 గంటలకు నందిగాంలో వంశధార కాలువను పరిశీలించనున్నట్లు తెలిపారు. కావున సాయంత్రం నిమ్మాడలో మంత్రి అచ్చెన్నాయుడు అందుబాటులో ఉండరని క్యాంపు కార్యాలయం సిబ్బంది పేర్కొన్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాస కిడ్నీ రీసెర్చ్ ఆసుపత్రి సమీపంలో పాత జాతీయ రహదారి వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఓ ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటోలో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు. గమనించిన స్థానికులు గాయపడిన వ్యక్తులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రజలు ఎన్నికల్లో ఓడించి పాతాళానికి తొక్కినా వైసీపీ నేతల బుద్ధి మారలేదని మంత్రి అచ్చెన్న ట్వీట్ చేశారు. టీడీపీ హయంలో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయిందని ఆయన ఫైరయ్యారు. నోరు తెరిస్తే అన్నిటికి చంద్రబాబే కారణమంటూ చేసిన అంబటి వ్యాఖ్యలకు మాజీ మంత్రి అచ్చెన్న Xలో కౌంటర్ ఇచ్చారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్డీ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన ఏపీ ఆర్ సెట్ ప్రవేశాలకు గాను ముఖాముఖి ఈనెల 24 నుంచి ప్రారంభంకానున్నట్లు సెట్ కన్వీనర్ దేవప్రసాద్ రాజు మంగళవారం తెలిపారు. రాష్ట్రంలో 12 విద్యాలయాల్లో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు సబ్జెక్టులు వారీగా ముఖాముఖి ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. https://cets apsche.ap.gov.in వెబ్ సైట్లో వివరాలు పొందుపరిచామన్నారు.
ప్రభుత్వం నిర్వహించిన ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మే నెల 24 నుంచి 31వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షల్లో జిల్లా నుంచి 7,431 మంది విద్యార్థులు హాజరుకాగా 4,857 మంది ఉత్తీర్ణులై 65.36 శాతం ఫలితాలు సాధించారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు వారి ఉన్నత చదువులకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాజాం మండలం బోద్దాం గ్రామంలో మంగళవారం రాత్రి టీడీపీ నాయకులు, కార్యకర్తలు గ్రామ దేవత అసిరితల్లి వారాలు నిర్వహించారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారి తీసింది. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. డీఎస్పీ శ్రీనివాస్ చక్రవర్తి గ్రామానికి చేరుకొని శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
కేంద్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసిన పీఎం కిసాన్తో జిల్లాలో 2,29,407 మంది రైతుల బ్యాంక్ ఖాతాలకు రూ.45.88 కోట్ల నిధులు జమకానున్నాయి. అర్హత కలిగిన ప్రతి రైతు బ్యాంకు ఖాతాకు వ్యవసాయ పెట్టుబడి కోసం రూ.2వేలు చొప్పున జమ అవుతాయని వ్యవసాయ శాఖ జేడీ శ్రీధర్ తెలిపారు. 2019 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఈ విడతలో పాత రైతులకే అవకాశం ఉందని కొత్త వారికి లేదన్నారు.
కష్టకాలంలో జండా మోసిన ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని మంత్రి అచ్చనాయుడు అన్నారు. కోటబొమ్మాలి పార్టీ కార్యాలయానికి మంగళవారం సాయంత్రం చేరుకున్న ఆయన అభిమానులు, నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. పార్టీకి కార్యకర్తలే వెన్నెముకని వారి సేవలను పార్టీ ఎప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రజల మంచి కోరే పనులు చేయాలని సూచించారు.
ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్- 2024లో నిర్వహించిన బీపీఈడీ నాల్గవ సెమిస్టర్ (రెగ్యులర్ &సప్లిమెంటరీ) పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్సైట్లో తమ రిజిస్టర్ నెంబర్ ద్వారా ఫలితాలు తెలుసుకోవచ్చు. పరీక్షల ఫలితాలకై అధికారిక వెబ్సైట్ https://results.andhrauniversity.edu.in/లో చెక్ చేసుకోవాలని ఆంధ్రా యూనివర్సిటీ పరీక్షల విభాగం తెలిపింది.
ఎచ్చెర్ల మండల పరిధిలోని కుప్పిలి గ్రామంలో మంగళవారం గ్రామ దేవత శ్రీ అసిరితల్లి సిరిమానోత్సవంలో అపశ్రుతి నెలకొంది. స్థానికుల వివరాలు.. గ్రామంలో ఉరేగిస్తున్న సిరిమాను ఒక్కసారిగా విరిగిపోవడంతో సిరిమానుపై కూర్చున్న పూజారి కింద ఉన్న వారిపై పడ్డారు. తీవ్రంగా గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించగా కారి పల్లేటి అనే వ్యక్తి మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. అప్పన్న అనే మరో వ్యక్తి పరిస్థితి సీరియస్గా ఉంది.
Sorry, no posts matched your criteria.