Srikakulam

News May 25, 2024

శ్రీకాకుళం: ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆమదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*పలాసలో 40 తులాల బంగారం చోరీ చేసిన దుండగులు.*వజ్రపుకొత్తూరు మండల పరిధిలో చెట్టుకు ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య. *దైవ దర్శనానికెళ్లి కాశీలో గుండె పోటుతో మృతి చెందిన టెక్కలివాసి. *రాష్ట్రంలో పోలైన అత్యధిక బ్యాలెట్ ఓట్లు శ్రీకాకుళం జిల్లాలోనే. *మద్యం మత్తులో డ్రైనేజీలో పడి మృతి చెందిన హిరమండల వాసి. *ఎచ్చెర్ల మండల పరిధిలో బోల్తాపడిన ఇసుక లారీ.*రైల్వే పనుల కారణంగా పాతపట్నం వెళ్లే రైళ్లు రద్దు

News May 24, 2024

శ్రీకాకుళం: ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన విపత్తు నిర్వహణ సంస్థ

image

ఆముదాలవలస నియోజకవర్గ పరిధిలో రేపు శనివారం వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరించింది. రేపు ఆముదాలవలసలో 39.9, బూర్జలో 40.6, సరుబుజ్జిలిలో 40.3, పొందూరులో 39.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉష్ణోగ్రత నమోదవుతుందని తెలిపింది. వడగాలులు వీచే అవకాశం ఉన్నందున రైతులు, బయట పనిచేసే కార్మికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ APSDMA ఈ మేరకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.

News May 24, 2024

వజ్రపుకొత్తూరులో ఉరివేసుకొని యవకుడి ఆత్మహత్య

image

మండలంలోని బెండిగేట్ సమీప తోటలోని చెట్టుకు ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా వెళ్లిన స్థానికులు చెట్టుకు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి భయాందోళన చెందుతూ.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని జేబులోని ఐడి కార్డు ఆధారంగా విశాఖపట్నం నావల్ డాక్ యార్డ్‌లో కాంట్రాక్ట్ లేబర్‌గా పనిచేస్తున్న ఉమామహేశ్వరరావు(26)గా గుర్తించారు.

News May 24, 2024

శ్రీకాకుళం: కౌంటింగ్ నిర్వహణకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు

image

జూన్ 4వ తేదిన చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీర్ కళాశాల స్ట్రాంగ్ రూమ్‌లో జరగనున్న సార్వత్రిక ఓట్ల లెక్కింపు ప్రక్రియకు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు ఉండాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక అదేశించారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఓట్ల కౌంటింగ్ నిర్వహణ, కౌంటింగ్ రోజున తీసుకోవలసిన చర్యలు, భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై డీఎస్పీలు, సీఐలతో ఎస్పీ సమీక్షించారు. అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు.

News May 24, 2024

శ్రీకాకుళం: ప్రయాణికుల రద్దీ మేరకు బెంగుళూరుకు ప్రత్యేక రైలు

image

ప్రయాణికుల రద్దీ మేరకు శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్ల మీదుగా SMVT బెంగుళూరు(SMVB), భువనేశ్వర్(BBS) మధ్య ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.06271 SMVB- BBS రైలును ఈ నెల 31న, నం.06272 BBS- SMVB రైలును జూన్ 2వ తేదీన నడుపుతామని తెలిపారు. ఈ రైళ్లు ఏపీలో విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం తదితర ప్రధాన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు చెప్పారు.

News May 24, 2024

శ్రీకాకుళం: రేపే పరీక్ష.. 830 మందికి 4 కేంద్రాలు

image

APPSC ఆధ్వర్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీన శ్రీకాకుళం జిల్లాలో పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతి రావు శుక్రవారం పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో 830 మంది అభ్యర్థులు ఏపీపీఎస్సీ పరీక్షకు హాజరు కానున్నారని తెలిపారు. ఆయా కేంద్రాల‌ వ‌ద్ద 144 సెక్ష‌న్ అమ‌లు చేయాల‌ని పోలీసులకు సూచించారు.

News May 24, 2024

కౌంటింగ్‌పై అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్

image

కౌంటింగ్ ప్రక్రియపై సంపూర్ణ అవగాహన, పట్టు కలిగి ఉండాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మనజీర్ జిలాని సమూన్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు-2024లో భాగంగా వచ్చే నెల 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు, విధి విధానాలపై అంబేడ్కర్ ఆడిటోరియంలో కౌంటింగ్ సూపర్‌వైజర్‌లు, మైక్రో అబ్జర్వర్‌లు, కౌంటింగ్ అసిస్టెంట్లు తదితర సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

News May 24, 2024

పలాసలో 40 తులాల బంగారం చోరీ

image

పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి రోటరీనగర్‌లో తెల్లవారుజామున ఓ ఇంట్లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. NREGSలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగిని అలివేణి అనే మహిళ తన స్వగ్రామానికి వెళ్లగా, ఇదే అదనుగా భావించి దోచేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి 40 తులాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.18 వేల నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News May 24, 2024

శ్రీకాకుళం జిల్లాలో పాలిటెక్నిక్ సీట్ల వివరాలు

image

శ్రీకాకుళం జిల్లాలో 5 ప్రభుత్వ , 5 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలలో 780 సీట్లు, ప్రైవేట్ కళాశాలలో 1811 సీట్లు మొత్తం 10 కళాశాలలో 2,591 సీట్లు ఉన్నాయి. శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 300 సీట్లు, శ్రీకాకుళం మహిళా పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, టెక్కలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌-120 సీట్లు, ఆమదాలవలస-120 సీట్లు, సీతంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 120 సీట్లు, ఉన్నాయి.

error: Content is protected !!