India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పరవాడలో నివాసముంటున్న ఖ్యాతేశ్వర్ తెలంగాణ ఈ సెట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. 2023లో కంచరపాలెం పాలిటెక్నికల్ కళాశాలలో 80% మార్కులతో ఉత్తీర్ణత చెందాడు. ఆయన మాట్లాడుతూ.. ప్రణాళిక ప్రకారం చదివి ఈ లక్ష్యాన్ని సాధించినట్లు తెలిపాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం జోగిపాలెం గ్రామానికి చెందిన ఖ్యాతేశ్వర్ తండ్రి విన్నారావు ఉద్యోగం నిమిత్తం పరవాడలో ఉంటున్నారు.
జిల్లావ్యాప్తంగా ఈ నెల 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతి రావు అన్నారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో మే 24 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగనున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
జూన్ 4వ తేదీన నిర్వహించే కౌంటింగ్ కోసం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరెట్ సమావేశ మందిరంలో మంగళవారం ఆయన సార్వత్రిక ఎన్నికలు కౌంటింగ్ నిర్వహణ ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలకు లోబడి పక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.
కిర్గిస్థాన్ దేశంలో వైద్య విద్య అభ్యసిస్తున్న రాజాంకు చెందిన 13 మంది విద్యార్థులు భయం నీడన ఉన్నారు. ఈ తెల్లవారుజామున మరోసారి తాము నివాసం ఉంటున్న హాస్టల్పై దుండగులు ఎటాక్ చేసినట్లు చెప్పారు. వీలున్నంత త్వరగా భారత్కు రప్పించేందుకు రాజకీయ నేతలు, అధికారులు కృషి చేయాలని వీరు ప్రాధేయపడుతున్నారు.
జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల కోసం శ్రీకాకుళం జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక MP స్థానం ఉంది. మహిళల ఓటింగ్ పెరిగిందని, వారంతా YCPకే ఓటేశారని.. జగన్ మళ్లీ సీఎం అవుతారని ధర్మాన సోదరులు, తదితరులు ప్రకటించారు. మరోవైపు, మెజార్టీ స్థానాలు తమవే అని అచ్చెన్నాయుడు తదితరులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ పార్టీ ఆధిపత్యం ఉంటుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
పాడి పశువులు సాధారణంగా ఒకటి లేదా రెండు దూడలకు జన్మనిస్తాయి. మూడు దూడలు జన్మించడం చాలా అరుదు. ఒకే ఈతలో నాలుగు దూడలు పుట్టిన ఘటన జలుమూరు మండలంలో చోటు చేసుకుంది. పెద్ద దూగాం గ్రామానికి చెందిన రైతు గుండ సింహాచలానికి చెందిన ఆవు సోమవారం ఒకే ఈతలో నాలుగు దూడలకు జన్మనిచ్చింది. రెండు మగ, రెండు ఆడ దూడలు జన్మించగా, రెండు గంటల వ్యవధిలో ఒక మగ దూడ, ఒక ఆడ దూడ మృతి చెందాయి. మిగిలిన రెండు ఆరోగ్యంగానే ఉన్నాయి.
చిలకపాలెం శ్రీ శివాని ఇంజినీరింగ్ కళాశాలను సోమవారం సాయంత్రం ఎస్పీ జీ.ఆర్ రాధిక సందర్శించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రత ఏర్పాట్లను, సీసీ కెమెరాలు ద్వారా నిఘాను ఆమె పర్యవేక్షించారు. అనంతరం స్ట్రాంగ్ రూమ్స్ బయట భద్రతాపరమైన అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఆదేశించారు. ఆమె వెంట ఏఎస్పీ ప్రేమ్ కాజల్, డిఎస్పీ వై. శృతి, ఎస్సై చిరంజీవి ఉన్నారు.
బక్రీద్ను పురస్కరించుకుని రాష్ట్ర జంతు సంక్షేమ సంస్థ నియమావళిని అమలు చేసేందుకు జిల్లా నోడల్ అధికారిగా ఏఎస్పీ (క్రైమ్) వి.ఉమామహేశ్వరరావును నియమించినట్లు ఎస్పీ జి.ఆర్ రాధిక సోమవారం తెలిపారు. జిల్లాలో జంతువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు చెక్పోస్టుల వద్ద నిరంతరం విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో జంతువులను అక్రమంగా తరలించినా 63099 90803 కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆమదాలవలస మండలం చెవ్వాకులపేట ఇసుక ర్యాంప్ వద్ద సుమారు 10 లారీలను సోమవారం సీజ్ చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. స్థానిక పోలీసుల సమన్వయంతో న్యాయస్థానం ఆదేశాలకు విరుద్ధంగా ఇసుక లారీలు ఉండడంతో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక ర్యాంప్ మూసివేసినప్పటికీ యథేచ్ఛగా ఇసుక తరలించడంతో చర్యలు చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో జిల్లాకు చెందిన మహిళా ఓటర్ల ప్రభంజనం స్పష్టించారు. పోలైన ఓట్లు గణాంకాలే 18,75,934 మంది ఓటర్లకు 14,40,885 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 76.81 శాతం ఓట్లు పోలైనట్లు అధికారులు తేల్చారు. 4,35,049 మంది పోలింగ్కు దూరంగా ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 36,836 మంది అధికంగా ఓటేశారు. జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకోని వారు నాలుగు లక్షల మంచికి పైగా ఉన్నారు.
Sorry, no posts matched your criteria.